ఆంధ్ర రాష్ట్రం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆంధ్ర రాష్ట్రం | |
|---|---|
| Anthem: మా తెలుగు తల్లికి మల్లె పూదండ | |
భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర స్థానం | |
| Coordinates: 16°30′N 80°38′E / 16.50°N 80.64°E | |
| దేశం | |
| రాష్ట్రావతరణ | 1953 అక్టోబరు 1 |
| రాజధాని నగరం | కర్నూలు |
| పెద్ద నగరం | విశాఖపట్నం |
| జిల్లాలు | 13 |
| Government | |
| • Body | ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం |
| • ఆంధ్రరాష్ట్ర గవర్నర్లు | సి.ఎం.త్రివేది |
| • ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రులు |
|
| • హైకోర్టు | హైకోర్టు, గుంటూరు |
| Demonym | తెలుగు / ఆంధ్రులు |
| Time zone | UTC+05:30 (IST) |
ఆంధ్రరాష్ట్రం, భారతదేశపు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1953 అక్టోబరు 1న ఏర్పడింది.[1]
మద్రాసు ప్రెసిడెన్సీ లోని తెలుగు భాష మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు.[2] ఆంధ్ర రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు తుంగభద్ర నది నుండి తుంగభద్రా రిజర్వాయి బేక్ వాటర్స్. రాయలసీమ, కోస్తా ప్రాంతాలు ఇందులో కలిసున్నాయి.
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్.ఎస్ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.1937 నాటి శ్రీబాగ్ ఒడంబడిక ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు రాజధాని అయింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యాడు. సి.ఎం.త్రివేది గవర్నరు అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.
ఆ తర్వాత 1956 నవంబరు 1 తేదీన తెలంగాణ ప్రాంతం ఇందులో కలిసి తెలుగువారి విశాలాంధ్రగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 58 సంవత్సరాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 అమల్లోకి వచ్చింది. 2014 జూన్ 2న అధికారికంగా విభజన జరిగి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి
జిల్లాలు
[మార్చు]ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పటి జిల్లాలు
[మార్చు]ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు
[మార్చు]
1956 నవంబరు 1న, హైదరాబాద్ రాష్ట్రం లోని తెలుగుభాష మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాన్ని కలిపి విశాలమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇతర భాషలు మాట్లాడే ప్రాంతాల్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కలిపింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ https://news.google.com/newspapers?nid=P9oYG7HA76QC&dat=19531002&printsec=frontpage&hl=en
- ↑ "Madras Province - Hyderabad India Online". web.archive.org. 2023-01-02. ఒరిజినల్ నుండి 2023-01-02 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-02.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)