కొరవి గోపరాజు
Jump to navigation
Jump to search
కొరవి గోపరాజు తెలంగాణకు చెందిన తెలుగు కవి.[1] ఈయన 1500-1530 కాలానికి చెందిన వాడు. ఇతని తండ్రి కసవరాజు, తల్లి కామాంబిక. ఆయన సంస్కృతంలో ప్రసిద్ధ కథామాలిక ఐన సింహాసన ద్వాత్రింశికను తెలుగులోకి అనువదించారు. దాని మాతృక ప్రపంచ కథా సాహిత్యంలోనే ప్రఖ్యాతిపొందినది. గోపరాజు సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలగు శాస్త్రాలలో ప్రవీణుడు.
జీవిత విశేషాలు[మార్చు]
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లాలో గల భీంగల్ ఇతని స్వస్థలం[2]. పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు.
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ద్వానా శాస్త్రి. "తెలుగు సృజన దీప్తులు". eenadu.net. ఈనాడు. Archived from the original on 17 డిసెంబరు 2017. Retrieved 11 December 2017.
- ↑ నవ వసంతం-2,7 వ తరగతి-తెలుగు వాచకం, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015, పుట-3