Coordinates: 16°34′28″N 78°02′30″E / 16.5745624°N 78.0415662°E / 16.5745624; 78.0415662

ఘన్‌పూర్ (వనపర్తి జిల్లా)

వికీపీడియా నుండి
(ఘన్‌పూర్ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఘన్‌పూర్, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, ఘన్‌పూర్ మండలానికి చెందిన గ్రామం.[1]

ఘన్‌పూర్
—  రెవెన్యూ గ్రామం  —
ఘన్‌పూర్ is located in తెలంగాణ
ఘన్‌పూర్
ఘన్‌పూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°34′28″N 78°02′30″E / 16.5745624°N 78.0415662°E / 16.5745624; 78.0415662
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి
మండలం ఘన్‌పూర్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,742
 - పురుషుల సంఖ్య 3,995
 - స్త్రీల సంఖ్య 3,747
 - గృహాల సంఖ్య 1,635
పిన్ కోడ్ 509380
ఎస్.టి.డి కోడ్

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం 1635 ఇళ్లతో, 7742 జనాభాతో 2322 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3995, ఆడవారి సంఖ్య 3747. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1084 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 356. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 575777.[3] పిన్ కోడ్: 509380.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మహబూబ్ నగర్లో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ మహబూబ్ నగర్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మహబూబ్ నగర్లో ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ఘన్‌పూర్లో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ఘన్‌పూర్లో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.

వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ఘన్‌పూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 688 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 53 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 31 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 12 హెక్టార్లు
  • బంజరు భూమి: 868 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 666 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1440 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 95 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ఘన్‌పూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 95 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ఘన్‌పూర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, రాగులు

చేతివృత్తులవారి ఉత్పత్తులు[మార్చు]

వస్త్రాలంకరణ

గ్రామ చరిత్ర[మార్చు]

ఘనపూర్ ప్రాంతాన్ని ఇప్పటికి 800 ఏళ్ళ క్రితం కాకతీయుల సామంతులు పాలించినట్లు తెలుస్తుంది. వారిలో గోన బుద్దారెడ్డి కుమారుడు గోన గణపరెడ్డి ఒకరు. ఇతను తన తండ్రి పేరు మీదుగా గోపాల్‌పేట మండలం, బుద్దారం గ్రామంలో బుద్దేశ్వరాలయం నిర్మించాడు.అలాగే ఘనపురం గ్రామంలోనూ గణపతీశ్వరాలయం నిర్మించాడు. ఇక్కడ గణపతీశ్వరాలయం ఉండటం, ఈ ప్రాంతాన్ని గణపరెడ్డి పాలించడం వలన ఈ గ్రామానికి గణపురం అని పేరు వచ్చింది[4]. ఈ గ్రామానికి ఈశాన్యంలో ఎత్తైన రెండు గుట్టలను కలుపుతూ గణపరెడ్డి కోటను నిర్మించాడు. ఈ కోట కారణంగా గణపురానికి ఖిల్లాఘనపురం అను పేరు స్థిరపడిపోయింది. ఈ పట్టణాన్ని తన కాశీయాత్రలో భాగంగా 1830లో సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని గురించి అప్పటి వివరాలు నమోదుచేశారు. అప్పటికీ ఈ పట్టణానికి గణపురం అనే వాడుకే వున్నట్టు ఆయన కాశీయాత్రచరిత్ర గ్రంథం ద్వారా తెలుస్తోంది. ఇది జాగీరు గ్రామమని, కొండ కింది ఊరు, కొండ మీద దుర్గము ఉండేదని వ్రాశారు. కోట దుర్గమంగా ఉందన్నారు. బస్తీ గ్రామమని ప్రశంసించారు. ఐతే గ్రామంలో ఎన్ని ఇళ్ళున్నా చిన్నచిన్నగానే ఉండేవన్న వివరం వ్రాశారు. గ్రామాల్లో చావిళ్ళున్నాయి. అన్ని పదార్థాలూ దొరుకున్నా అప్పట్లో గ్రామంలో నీటికి విపరీతమైన ఎద్దడి ఉండేది. బావులు లోతుగా, నీరు ఉప్పగా ఉండేదన్నారు.[5]

గణపురం ఖిల్లా[మార్చు]

ఈ గ్రామ సమీపంలో ఎత్తైన కొండల మీద ప్రసిద్ధి చెందిన కోట ఉంది. దీనికి గణపురం ఖిల్లా అని పేరు.

గణపురం గుట్టలు[మార్చు]

ఈ గ్రామంలో తొమ్మిది గుట్టలు ఉన్నాయి. వాటికి దేవుని గుట్ట, మనిషి కొండయ్య గుట్ట, వీరన్నగుట్ట, బంగారు గూడు, వెంకయ్యగుట్ట, చౌడమ్మగుట్ట, చంద్రగుట్ట, ముర్రయ్యగుట్ట, దుర్గంగుట్ట అని పేర్లు ఉన్నాయి. ఈ చివరి గుట్టలను కలుపుతూనే గణపరెడ్డి కోటను నిర్మింపచేశాడు.

గణపురం కోటలు[మార్చు]

గణపురంలోని గుట్టలకు అనుసంధానంగా కాకతీయ సామంతరాజులు మట్టితో గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏడు కోటలు నిర్మించారు. వాటికి మేడికోట, బండకోట, వీరన్నకోట, ఆగారంకోట, తక్కిళ్ళకోట, వావిళ్ళకోట, బర్వనికోట అని పేర్లు ఉన్నాయి.

గణ సముద్రం[మార్చు]

గ్రామానికి సంబంధించిన కోటలకు సమీపాన నాటి రాజులు ఒక పెద్ద చెరువును నిర్మించారు. దీనికే గణసముద్రం అని పేరు.

పురాతన మస్జీద్[మార్చు]

గ్రామంలో పురాతన మస్జీద్ ఉంది. గ్రామానికి చెందిన బస్టాండ్ సమీపంలో ఈ పెద్ద మస్జీద్ కనిపిస్తుంది. కళాత్మకమైన నిర్మాణంతో కూడిన ఈ కట్టడం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది.

గ్రామ రాజకీయాలు[మార్చు]

2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సామ్యానాయక్ ఎన్నికయ్యాడు.[6]

గ్రామంలో ప్రముఖ క్రీడాకారిణి[మార్చు]

అంతర్జాతీయ సెపక్ తక్రా క్రీడాకారిణి నవత ఈ గ్రామానికి చెందిన వ్యక్తి. గ్రామానికి చెందిన రాళ్ళ పెద్ద గోపాల్, శేషమ్మల కుమారై అయిన నవత పలు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నది. దక్షిణ కోరియాలో జరుగుతున్న ఆసియా క్రీడలకు తెలంగాణ నుండి (హైదరాబాదు మినహా) భారత బృందానికి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి[7]..

గ్రామ శాసనం[మార్చు]

ఈ గ్రామంలో పాత చేదబావి దగ్గర గల స్తంభంపై నాలుగు వైపుల చెక్కబడిన శాసనం ఉంది. ఇది శక సంవత్సరం 1451 ఖర ఫాల్గుణ బహుళ విదియ గురువారం (సా.శ. 1528) నాడు వేయించబడింది. దీనిని యారలి కుమారుడు మువాక్ తన పుత్రపౌత్రాదులకు మంచి జరుగుటకై ఊరిలో బావిని తవ్వించి, శాసనం వేయించాడు. శాసనం స్తంభంపై రెండు వైపుల 7, 7 పంక్తులు చొప్పున, మూడో వైపు 6 పంక్తులు, నాలుగో వైపు 1 పంక్తి వెరసి మొత్తం 21 పంక్తులలో శాసనం ఉంది[8].

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 57
  5. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  6. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013
  7. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేకంలో మొదటి పేజి, తేది.21.09.2014
  8. గోలకొండ చరిత్ర - సంస్కృతి- శాసనములు, బి. ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్-1989, పుట-203

వెలుపలి లింకులు[మార్చు]