వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
వనపర్తి | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి జిల్లా |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
ఇది వనపర్తి జిల్లాకు చెందిన అసెంబ్లీ నియోజకవరం. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజనలో భాగంగా నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి గోపాల్పేట మండలం, ఆలంపూర్ నియోజకవర్గం నుంచి పెబ్బేరు మండలాలు కొత్తగా ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి. గతంలో పాక్షికంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర మండలాలు కొత్తగా ఏర్పడిన దేవరకద్ర నియోజకవర్గంకు తరలించారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లెల చిన్నారెడ్డి గెలుపొందినాడు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ప్రముఖస్థానం సంపాదించిన సురవరం ప్రతాపరెడ్డి 1952లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు.[1]
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]
నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]
- 2001 లెక్కల ప్రకారము జనాభా: 2,75,329.
- ఓటర్ల సంఖ్య (ఆగస్టు 2008 నాటికి): 2,36,695.[2]
- ఎస్సీ, ఎస్టీల శాతం: 21.64%, 0.43%.
నియోజకవర్గ భౌగోళిక సమాచారం[మార్చు]
భౌగోళికంగా మహబూబ్నగర్ జిల్లాలో మధ్యగా ఉన్న ఈ నియోజకవర్గం తూర్పున నాగర్కర్నూల్ నియోజకవర్గం, కొల్లాపూర్ నియోజకవర్గాలతో సరిహద్దును కలిగి ఉండగా, పశ్చిమాన, ఉత్తరాన దేవరకద్ర నియోజకవర్గం సరిహద్దుగా ఉంది. దక్షిణాన కొంతభాగం ఆలంపూర్ నియోజకవర్గం సరిహద్దుగా ఉంది. నియోజకవర్గంలోని పెద్దమండలి మండలంలోని కొంతభాగం, పెబ్బేరు మండలం గుండా 7వ నెంబరు జాతీయ రహదారి వెళ్తున్నది.
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
ప్రస్తుతం రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు.
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
- :[3] {| border=2 cellpadding=3 cellspacing=1 width=90%
|- style="background:#0000ff; color:#ffffff;" ! సంవత్సరం ! గెలుపొందిన సభ్యుడు ! పార్టీ ! ప్రత్యర్థి ! ప్రత్యర్థి పార్టీ |- bgcolor="#87cefa" | 1952 | సురవరం ప్రతాపరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | రామచంద్రారెడ్డి | స్వతంత్ర అభ్యర్థి |- bgcolor="#87cefa" | 1952 (ఉ.ఎ) | ఎం.ఆర్.రెడ్డి | పి.ఎస్.పి | జయరామ్ | భారత జాతీయ కాంగ్రెస్ |- bgcolor="#87cefa" | 1957 | పద్మనాభరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | ఏకగ్రీవ ఎన్నిక | |- bgcolor="#87cefa" | 1962 | జానంపల్లి కుముదినీ దేవి | భారత జాతీయ కాంగ్రెస్ | జి.ఎస్.రెడ్డి | స్వతంత్ర అభ్యర్థి |- bgcolor="#87cefa" | 1967 | జానంపల్లి కుముదినీ దేవి | భారత జాతీయ కాంగ్రెస్ | ఎం.జగన్నాథరెడ్డి | స్వతంత్ర అభ్యర్థి |- bgcolor="#87cefa" | 1972 | అయ్యప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | ఏ.బాలకృష్ణయ్య | స్వతంత్ర అభ్యర్థి |- bgcolor="#87cefa" | 1978 | జయరాములు | ఇందిరా కాంగ్రెస్ | ఏ.బాలకృష్ణయ్య | జనతా పార్టీ |- bgcolor="#87cefa" | 1983 | ఏ.బాలకృష్ణయ్య | తెలుగుదేశం పార్టీ | జయరాములు | కాంగ్రెస్ |- bgcolor="#87cefa" | 1985 | ఏ.బాలకృష్ణయ్య | తెలుగుదేశం పార్టీ | జిల్లెల చిన్నారెడ్డి | కాంగ్రెస్ |- bgcolor="#87cefa" | 1989 | జిల్లెల చిన్నారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | ఏ.బాలకృష్ణయ్య | తెలుగుదేశం పార్టీ |- bgcolor="#87cefa" | 1994 | రావుల చంద్రశేఖర్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | జిల్లెల చిన్నారెడ్డి | కాంగ్రెస్ పార్టీ |- bgcolor="#87cefa" | 1999 | జిల్లెల చిన్నారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | రావుల చంద్రశేఖర్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ |- bgcolor="#87cefa" | 2004 | జిల్లెల చిన్నారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | కందూర్ లావణ్య | తెలుగుదేశం పార్టీ |- bgcolor="#87cefa" | 2009 | రావుల చంద్రశేఖర్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | జిల్లెల చిన్నారెడ్డి | కాంగ్రెస్ పార్టీ |- |2014 | జిల్లెల చిన్నారెడ్డి |కాంగ్రెస్ పార్టీ |సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి |తె.రా.స |- |2018 |సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి |తె.రా.స | జిల్లెల చిన్నారెడ్డి |కాంగ్రెస్ పార్టీ |}
1999 ఎన్నికలు[మార్చు]
1999లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.చిన్నారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావుల చంద్రశేఖర్ రెడ్డిపై 3353 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చిన్నారెడ్డికి 65286 ఓట్లు రాగా, రావుల చంద్రశేఖర్ రెడ్డి 61933 ఓట్లు సాధించాడు.
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.చిన్నారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందూర్ లావణ్యపై 3975 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. చిన్నారెడ్డి 64239 ఓట్లు సాధించగా, లావణ్యకు 60264 ఓట్లు లభించాయి. మొత్తం 5 గురు అభ్యర్థులు పోటీచేయగా ప్రధానపోటీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే కొనసాగింది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు కలిపి మొత్తం పోలైన ఓట్లలో 95.9% ఓట్లు సాధించారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థితో సహా మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.
- వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
క్రమసంఖ్య | అభ్యర్థి పేరు | అభ్యర్థి పార్టీ | సాధించిన ఓట్లు |
---|---|---|---|
1 | జి.చిన్నారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 64239 |
2 | కందూర్ లావణ్య | తెలుగుదేశం పార్టీ | 60264 |
3 | సత్యంసాగర్ | బహుజన్ సమాజ్ పార్టీ | 2792 |
4 | పి.విష్ణువర్థన్ రెడ్డి | ఇండిపెండెంట్ | 1454 |
5 | జింకల కృష్ణయ్య | ఇండిపెండెంట్ | 1081 |
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మంత్రి జి.జిన్నారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు.[4] భారతీయ జనతా పార్టీ తరఫున సబ్బిరెడ్డి వెంకటరెడ్డి పోటీలో ఉన్నాడు.[5] ప్రజారాజ్యం నుండి భూపేష్ ముదిరాజ్[6], లోక్సత్తా తరఫున ప్రవీణ్ కుమార్లు[7] పోటీపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్.చంద్రశేఖర్ రెడ్డి పోటీలో ఉన్నాడు.
నియోజకవర్గ ప్రముఖులు[మార్చు]
- జి.చిన్నారెడ్డి
- రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేసిన జి.చిన్నారెడ్డి మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. వ్యవసాయశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించిన చిన్నారెడ్డి గతంలో పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ చైర్మెన్గాను, ఆంధ్రప్రదేశ్ ఎలక్త్రానిక్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మెన్గాను వ్యవహరించాడు. 1985లో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టి చిన్నారెడ్డి పరాజయం పొందగా, ఆ తరువాత 1989లో విజయం సాధించాడు. 1999, 2004లలో వరస విజయాలు సాధించాడు. 2009 ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిననూ[8] రావుల చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయాడు
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 12, తేది 11-09-2008.
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
- ↑ Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ సూర్య దినపత్రిక, తేది 22-03-2009
- ↑ సూర్య దినపత్రిక, తేది 18-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-200
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 22-03-2009