మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం
రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 4 మండలాలు ఉన్నాయి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 1957లో ఇతర నియోజకవర్గంలో కలవగా మళ్ళీ 1962లో ప్రత్యేకంగా ఏర్పడింది. 1978లో మర్రి చెన్నారెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిని గెలిపించిన ప్రత్యేకతను ఈ నియోజకవర్గం దక్కించుకుంది. ఇటీవలి వరకు తెలుగుదేశం పార్టీలో స్థానం పొంది అనేక పదవులు నిర్వహించి, నవతెలంగాణ పార్టీ స్థాపించిన టి.దేవేందర్ గౌడ్ వరుసగా 3 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎన్నికలలో కంగ్రెస్ పార్టీ 6 సార్లు, తెలుగుదేశం పార్టీ 4 సార్లు విజయం సాధించగా, 1962లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన వందేమాతరం రామచంద్రారావు కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.వి. రంగారెడ్డిపై గెలుపొందినాడు.[1]
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]
నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]
- నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,80,622
- ఓటర్ల సంఖ్య [2] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము) :2,60,281
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 1962 వి.రామచందర్ రావు ఇండిపెండెంట్ కె.వి.రంగారావు భారత జాతీయ కాంగ్రెస్ 1967 సుమిత్రాదేవి భారత జాతీయ కాంగ్రెస్ కె.ఆర్.అబ్బయ్య ఇండిపెండెంట్ 1972 సుమిత్రాదేవి కాంగ్రెస్ పార్టీ వి.ప్రకాష్ సి.పి.ఎం 1978 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ టి.మోహన్ రెడ్డి జనతా పార్టీ 1983 ఉమావెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ ట్.పి.రెడ్డి తెలుగుదేశం పార్టీ 1985 కొమ్మారెడ్డి సురేందర్రెడ్డి తెలుగుదేశం పార్టీ జి.సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ 1989 ఉమావెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ కొమ్మారెడ్డి సురేందర్రెడ్డి తెలుగుదేశం పార్టీ 1994 టి.దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ ఎస్.ఉమాదేవి కాంగ్రెస్ పార్టీ 1999 టి.దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ ఎస్.హరివర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2004 టి.దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ కె.ఆర్.సురేందర్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర సమితి 2009 కె.లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.ప్రభాకర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ 2014 మల్లిపెద్ది సుధీర్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర సమితి టి.జంగయ్య తెలుగుదేశం పార్టీ 2018 చామకూర మల్లారెడ్డి తెలంగాణా రాష్ట్ర సమితి కె.లక్ష్మారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
2004 ఎన్నికలు[మార్చు]
2004 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి టి.దేవేందర్ గౌడ్ వరుసగా మూడవ పర్యాయం పోటీచేయగా మొత్తం 172904 ఓట్లు సాధించి సమీప తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన కె.ఆర్.సురేందర్ రెడ్డిపై 25704 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సురేందర్ రెడ్డికి 147200 ఓట్లు లభించాయి.
- 2004 ఎన్నికలలో అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
అభ్యర్థి పేరు పార్టీ సాధించిన ఓట్లు టి.దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ 172916 కె.సురేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 147209 సి.వి.రత్నం బహుజన్ సమాజ్ పార్టీ 8484 ఎం.అనురాధ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 7113 పి.బాలకిషన్ స్వతంత్ర అభ్యర్థి 2677 కె.సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి 2322 హమిదుల్ హక్ చౌదరి స్వతంత్ర అభ్యర్థి 1430 జి.ప్రభాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి 981
నియోజకవర్గ ప్రముఖులు[మార్చు]
- మర్రి చెన్నారెడ్డి
- ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకసారి పోటీచేసి గెలుపొందినాడు. 1919, జనవరి 13న వికారాబాదు తాలుకాలోని సిర్పూరులో జన్మించిన చెన్నారెడ్డి 1996లో మరణించాడు.
- టి.దేవేందర్ గౌడ్
- రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్మెన్గాను, 3 సార్లు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగాను, రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్మెన్గానూ, రాష్ట్రమంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన నేత టి.దేవేందర్ గౌడ్ మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో 1953, మార్చి 18న జన్మించాడు. కళాశాల దశలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేసిన అనుభవంతో తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ఎన్.టి.రామారావు నేతృత్వంలో పార్టీలో చేరి అంచెలంచెలుగా పార్టీలో ముఖ్య వ్యక్తిగా ఎదిగాడు. తన తెలంగాణ వాదానికి పార్టీలో తగిన ప్రతిస్పందన లభించకపోవడంతో 2008, జూన్ 23న తెలుగుదేశం పార్టీకి రాజానామా చేసి నవతెలంగాణా ప్రజాపార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించాడు. ఫిబ్రవరి 2009లో నవతెలంగాణా పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశాడు.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2004-06-02. Retrieved 2008-09-26.
- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.