నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది భారతదేశ తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఇది జహీరాబాదు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనికి వచ్చును.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • మానూర్
  • నారాయణ్‌ఖేడ్
  • కల్హేర్
  • శంకరంపేట్
  • సిర్గాపూర్
  • నాగలిగిద్ద

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 ఆర్.దేశ్‌పాండే స్వతంత్ర అభ్యర్థి ఎస్.అప్పారావు కాంగ్రెస్ పార్టీ
1967 శివారావు కాంగ్రెస్ పార్టీ ఏ.ఆర్.కె.ఆర్.పటేల్ స్వతంత్ర అభ్యర్థి
1972 మహారెడ్డి వెంకట్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి శివారావు కాంగ్రెస్ పార్టీ
1978 శివారావు ఇందిరా కాంగ్రెస్ మహారెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1983 మహారెడ్డి వెంకట్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శివారావు కాంగ్రెస్ పార్టీ
1985 శివారావు కాంగ్రెస్ పార్టీ మహారెడ్డి వెంకట్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1989 పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ మహారెడ్డి వెంకట్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 మహారెడ్డి విజయపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ మహారెడ్డి విజయపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 సురేష్ కుమార్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ మహారెడ్డి విజయపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయపాల్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ
2014 పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ మహారెడ్డి విజయపాల్ రెడ్డి తె.రా.స
2016 (ఉప ఎన్నిక) మహారెడ్డి భూపాల్‌ రెడ్డి తెరాస పి. సంజీవ రెడ్డి కాంగ్రెసు పార్టీ
2018 మహారెడ్డి భూపాల్‌ రెడ్డి తెరాస సురేష్ కుమార్ షెట్కర్ కాంగ్రెసు పార్టీ

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణారెడ్డి పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎస్.భూపాల్ రెడ్డి పోటీపడ్డాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయపాల్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి అమర్ సింగ్ పవార్ పోటీచేశారు.[1]

2014ఎన్నికలు[మార్చు]

2014 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీచేసిన ప.కిష్టా రెడ్డి తన సమీప ప్రత్యర్థియు తె.రా.స అభ్యర్థియునైన మ.భూపాల్ రెడ్డిపై 14746 ఓట్ల తేడాతో గెలుపొందిరి. ఆ ఎన్నికలలో ప.కిష్టారెడ్డికి 62,347 ఓట్లు, మ.భూపాల్ రెడ్డీకి 47,601 ఓట్లు లభించినవి. 25 ఆగస్టు 2015 నాడు ప.కిస్టారెడ్డి గుండెపోటుతో మరణించారు.

2016 ఉప-ఎన్నిక[మార్చు]

నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు ప.కిష్టారెడ్డి మృతితో ఖాళీయైన ఈ నియోజకవర్గమునకు 13 ఫిబ్రవరి 2016 నాడు ఉప ఎన్నిక నిర్వహింపబడెను. ఆ ఉప-ఎన్నికలో అధికార తె.రా.స.కు చెందిన మ.భూపాల్ రెడ్డి గెలుపొందిరి.

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు[మార్చు]

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009