రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 2 మండలాలు ఉన్నాయి. పునర్విభజనలో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇదివరకు కాటేదాన్ చేవెళ్ళ, చార్మినార్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పర్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం, వ్యవ్సాయ విశ్వవిద్యాలయం ఈ నియోజకవర్గపు ప్రత్యేకతలు.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,60,591
  • ఓటర్ల సంఖ్య [1] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము) :2,32,290

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 తొలకంటి ప్రకాష్ గౌడ్ తెలుగుదేశం పార్టీ జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ
2014 తొలకంటి ప్రకాష్ గౌడ్ తెలుగుదేశం పార్టీ జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ
2018 తొలకంటి ప్రకాష్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ గ‌ణేష్ గుప్త‌ తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్ భూపాల్ రెడ్డి పోటీలో ఉండగా, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకాశ్ గౌడ్ పోటి చేస్తున్నాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున సామరాజ్ పాల్ రెడ్డి బరిలో ఉన్నాడు. మజ్లిస్ తరఫున ఇంద్రారెడ్డి కుటుంబానికి ఆత్మీయుడైన మురళీధర్ రెడ్డి పోటీ చేస్తుండగా, జ్క్షానేశ్వర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు.[2] లోక్‌సత్తా తరఫున సోల్‌కర్ రెడ్డి బరిలో ఉన్నాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  2. ఈనాడు దినపత్రిక తేది 22-03-2009