ఆందోల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆందోల్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°49′12″N 78°4′48″E మార్చు
పటం
ఆందోల్ మాజీ శాసనసభ్యుడు బాబూ మోహన్

సంగారెడ్డి జిల్లాలోని 05 శాసనసభ స్థానాలలో ఆందోల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

అందోలు నియోజకవర్గం 1952లో ఏర్పడగా, 1967లో ఎస్సీ రిజర్వుడుగా మారింది. 1952 నుండి 1985 వరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించింది. 1985లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థి మల్యాల రాజయ్య విజయం సాధించాడు. 1989లో దామోదర రాజనర్సింహ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో సినీనటుడు బాబూమోహన్ ఎన్నికై తిరిగి 1999 సంవత్సరంలో రెండో సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా పనిచేశాడు. ఇప్పటికి 15 సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాలుగుసార్లు తెలుగుదేశం అభ్యర్థులు, ఒక్కసారి ఇండిపెండెంట్ అభ్యర్థి, రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు.

1967లో ఎస్‌సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా మారిన ఆందోల్‌లో మాజీ మంత్రి సి.రాజనర్సింహ హవా నడిచింది. ఇక్కడి నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రాజనర్సింహ మంత్రిగానూ సుదీర్ఘ కాలం పనిచేశాడు. తర్వాత ఆయన తనయుడు దామోదర రాజనర్సింహ ఆరు సార్లు పోటీ చేశాడు. వరుసగా మూడుసార్లు పరాజయం పాలైనా పట్టు వదలకుండా నాలుగోసారి విజయం సాధించాడు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి గానూ పనిచేశాడు.[1] ఇక్కడి నుంచి టిడిపి తరఫున గెలిచిన సినీనటుడు బాబూమోహన్ కూడా చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశాడు.

2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ అధికార బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు విజేతలుగా నిలిచింది. 2014లో బాబూమోహన్ గెలుపొందగా, 2018లో క్రాంతి కిరణ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[2]

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • టెక్‌మల్
  • అల్లాదుర్గ్
  • రేగోడ్
  • రాయికోడ్
  • ఆందోల్
  • మున్‌పల్లి

ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ఓట్ల తేడా
2004 దామోదర రాజనర్సింహ భారత జాతీయ కాంగ్రెస్ బాబు మోహన్ తెలుగుదేశం పార్టీ 24723
2009 దామోదర రాజనర్సింహ భారత జాతీయ కాంగ్రెస్ బాబు మోహన్ తెలుగుదేశం పార్టీ 2906
2014 బాబు మోహన్ తెలంగాణ రాష్ట్ర సమితి దామోదర రాజనర్సింహ భారత జాతీయ కాంగ్రెస్ 3291
2018 చంటి క్రాంతి కిర‌ణ్ తెలంగాణ రాష్ట్ర సమితి దామోదర రాజనర్సింహ భారత జాతీయ కాంగ్రెస్ 16,465
2023[3] దామోదర రాజనర్సింహ భారత జాతీయ కాంగ్రెస్ చంటి క్రాంతి కిర‌ణ్ బీఆర్ఎస్ 27427

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి సి.దామోదర్ రాజనరసింహ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.బాబుమోహన్‌పై 24723 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. దామోదర్‌కు 67529 ఓట్లు రాగా, బాబూమోహన్‌కు 42806 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బాబూ మోహన్ మళ్ళీ పోటీ చేయగా[4] ప్రజారాజ్యం పార్టీ నుండి మల్యాల శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ తరఫున దామోదర్ రాజనరసింహ, లోక్‌సత్తా పార్టీ తరఫున లక్షణరావు పోటీపడ్డారు.[5]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (19 November 2023). "అది రాజనర్సింహల అడ్డా". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  2. Eenadu. "అందోలు విజయం.. అధికారానికి మార్గం". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  5. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009