సూదిని జైపాల్ రెడ్డి
జైపాల్ రెడ్డి | |||
| |||
భూ శాస్త్ర విజ్ఞాన శాఖామంత్రి
| |||
పదవీ కాలం 29 అక్టోబరు 2012 – 18 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
ముందు | వాయలార్ రవి | ||
తరువాత | జితేంద్ర సింగ్ | ||
శాస్త్ర, సాంకేతిక శాఖామంత్రి
| |||
పదవీ కాలం 29 అక్టోబరు 2012 – 18 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | అశ్వని కుమార్ | ||
తరువాత | జితేంద్రసింగ్ | ||
భారత పార్లమెంటు సభ్యుడు
| |||
పదవీ కాలం జూన్ 2009 – మే 2014 | |||
ముందు | నియోజకవర్గం ప్రారంభం | ||
తరువాత | కొండా విశ్వేశ్వర రెడ్డి | ||
నియోజకవర్గం | చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మాడ్గుల్, హైదరాబాదు రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం తెలంగాణ, భారతదేశం) | 1942 జనవరి 16||
మరణం | 2019 జూలై 28 హైదరాబాదు, భారతదేశం | (వయసు 77)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీ | ||
సంతానం | 2 కుమారులు, 1 కూమర్తె | ||
నివాసం | మాడ్గుల్, తెలంగాణ | ||
వృత్తి | రైతు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మతం | హిందూ |
సూదిని జైపాల్ రెడ్డి (16 జనవరి, 1942 - 28 జూలై 2019) రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. ఇతను పెట్రోలియం, సహజవాయువు మంత్రిగా పదవిని నిర్వహించాడు.
జీవిత విశేషాలు[మార్చు]
జైపాల్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మాడుగులలో 1942, జనవరి 16న జన్మించారు. 18 నెలల వయసులో పోలియో కారణంగా వైకల్యానికి గురయ్యారు. జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ. పట్టా పొందాడు.[1]
రాజకీయ జీవితం[మార్చు]
ఈయన కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి 1969, 1984 మధ్య నాలుగు సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యాడు. ముందుగా కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉన్నా, అత్యవసర పరిస్థితి నివ్యతిరేకిస్తూ 1977లో జనతా పార్టీలో చేరాడు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు. ఇతను భారత పార్లమెంటుకు మొదటిసారిగా 1984లో మహబూబ్నగర్ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. తరువాత భారత పార్లమెంటుకు మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా 1999, 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యాడు. రాజ్యసభ సభ్యునిగా 1990, 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డాడు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా 1991-1992 లో ఉన్నాడు. రెండు సార్లు సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేశాడు. జైపాల్ రెడ్డి చట్ట సభలలో చేసిన డిబేట్లు అత్యంత కీలకమైనవిగా ఉంటాయి. ఇతను అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా 1998లో ఎన్నుకోబడ్డాడు.[2]
మరణం[మార్చు]
జైపాల్ రెడ్డి హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చికిత్స పొందుతూ 2019, జూలై 28 తెల్లవారుజామున గం. 1.28 ని.లకు మరణించారు.[3]
మూలాలు[మార్చు]
- ↑ బిబిసీ తెలుగు, తెలంగాణ (28 July 2019). "జైపాల్ రెడ్డి (1942 - 2019): పల్లె నుంచి దిల్లీ దాకా ఎదిగిన తెలుగు రాజకీయవేత్త". Archived from the original on 29 జూలై 2019. Retrieved 29 July 2019.
- ↑ సాక్షి, తెలంగాణ (29 July 2019). "ఓయూ నుంచి హస్తినకు." Sakshi. Archived from the original on 29 జూలై 2019. Retrieved 29 July 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (29 July 2019). "విలువల వైతాళికుడు జైపాల్ రెడ్డి అస్తమయం". www.andhrajyothy.com. Archived from the original on 29 జూలై 2019. Retrieved 29 July 2019.
బయటి లింకులు[మార్చు]

- Commons category link is on Wikidata
- 1942 జననాలు
- 8వ లోక్సభ సభ్యులు
- 13వ లోక్సభ సభ్యులు
- 14వ లోక్సభ సభ్యులు
- 15వ లోక్సభ సభ్యులు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు
- వికలాంగులు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు
- నాగర్కర్నూల్ జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- నల్గొండ జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు
- రంగారెడ్డి జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) కు చెందిన రాజ్యసభ సభ్యులు
- రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు
- మహబూబ్ నగర్ జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు
- 2019 మరణాలు
- 12వ లోక్సభ సభ్యులు
- ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీతలు