కీసర మండలం
కీసర మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా లోని మండలం.[1]
ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కీసర రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్గిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
గణాంక వివరాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 1,77,288 - పురుషులు 90,006 - స్త్రీలు 87,282
రాజకీయాలు[మార్చు]
ఈ మండలం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గంలో ఒక భాగం. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది.[3] కాంగ్రెస్ పార్టీకి 11313 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 10875 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీకి 4661 ఓట్లు వచ్చాయి.
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- అహ్మద్గూడా
- బోగారం
- చీర్యాల్
- ధర్మారం
- గోదుమకుంట
- హరిదాస్పల్లి
- కుందన్పల్లి
- నర్సంపల్లి
- తిమ్మాయిపల్లి
- యాద్గార్పల్లి (తూర్పు)
- యాద్గార్పల్లి (పడమర)
- కీసర
- కీసర దాయిరా
- నాగారం
- రాంపల్లి
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 20-05-2009