Coordinates: 16°11′43″N 80°42′12″E / 16.195409°N 80.703206°E / 16.195409; 80.703206

జంపని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జంపని
—  రెవెన్యూ గ్రామం  —
జంపని is located in Andhra Pradesh
జంపని
జంపని
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°11′43″N 80°42′12″E / 16.195409°N 80.703206°E / 16.195409; 80.703206
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం వేమూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి గవిని అరుణకుమారి
జనాభా (2011)
 - మొత్తం 7,863
 - పురుషుల సంఖ్య 3,879
 - స్త్రీల సంఖ్య 3,984
 - గృహాల సంఖ్య 2,284
పిన్ కోడ్ 522261
ఎస్.టి.డి కోడ్ 08644

జంపని బాపట్ల జిల్లా వేమూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన వేమూరు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తెనాలి నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2284 ఇళ్లతో, 7863 జనాభాతో 2049 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3879, ఆడవారి సంఖ్య 3984. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2533 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 190. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590400.[1]

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం తెనాలి నుండి గుంటూరు వెళ్ళు రైలుమార్గంలో, తెనాలికి 10 కి.మీ. దూరంలో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

పోతుమర్రు 3 కి., యడవూరు 3 కి.మీ, వరాహపురం 4 కి.మీ, బూతుమల్లి 4 కి.మీ, చక్రాయపాలెం 4 కి.మీ

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి వేమూరులో ఉంది. సమీప జూనియర్ కళాశాల వేమూరులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల తెనాలిలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల వడ్లమూడిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కొల్లూరులోను, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

జంపనిలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

జంపనిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

గుంటూరు-రేపల్లె మార్గము
కి.మీ. వరకు గుంటూరు-మాచర్ల రైలు మార్గము
59.4 గుంటూరు
కొత్త గుంటూరు వరకు
ఎన్‌హెచ్-16 లేదా ఎహెచ్-45
48 వేజండ్ల
42 సంగం జాగర్లమూడి
38 అంగలకుదురు
విజయవాడ వరకు
33.8 తెనాలి
గూడూరు వరకు
గుంటూరు రోడ్డు
31 చిన్నరావూరు
24 జంపని
తెనాలి-కొల్లూరు రోడ్డు
20 వేమూరు
13 పెనుమర్రు
10 భట్టిప్రోలు
ఎన్‌హెచ్-214ఎ
5 పల్లికోన
0 రేపల్లె

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు (కెనరా బ్యాంక్), సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 6 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

జంపనిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 169 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 31 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 21 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1827 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 42 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1784 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

జంపనిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1784 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

జంపనిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

చెరకు

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గవిని అరుణకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ మహంకాళీదేవి ఆలయo[మార్చు]

ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం, 2013 అక్టోబరు 29న వేడుకగా నిర్వహించారు.

శ్రీ హనుమత్, లక్ష్మణ, సీతా సమేత కోదండరామ స్వామి దేవాలయం[మార్చు]

నూతనంగా నిర్మించిన ఈ దేవాలయంలో, 2013, నవంబరు-25 నుండి ప్రత్యేక పూజలు చేసి, 27 నాడు, వేదమంత్రోచ్ఛారణల మధ్య, వైభవంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిపించారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

  1. ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమానికి, 2014, మార్చి-19న శంకుస్థాపన జరిగింది. ఈ ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు 2014, మే-13 నుండి 23 వరకూ నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రతి రోజూ ఉదయం సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, పవిత్ర పుష్పాలు, దళాలతో విశేషపూజలు నిర్వహించెదరు. సాయంత్రం స్తోత్రపారాయణం, భజనలు చేయుదురు. హనుమజ్జయంతి నాడు విశేష అభిషేకాలు, శాంతికళ్యాణం, ఆలయ రథోత్సవం, భక్తులచే లక్షనామార్చన యఙం నిర్వహించెదరు.
  2. ఈ ఆలయంలో, హనుమజ్జయంతి వార్షిక వేడుకలు, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో (మే నెలలో) శుద్ధ పౌర్ణమినుండి మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. మొదటి రోజు ప్రత్యేక పూజలు చేయుదురు. రెండవ రోజున అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణం చేయుదురు. మూడవ రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసెదరు.
  3. ఈ ఆలయంలో, 2014, డిసెంబరు-12, శుక్రవారం నాడు, నాగేంద్రస్వామివారి విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమాన్ని, భక్తులు వైభవంగా నిర్వహించారు. ప్రవాస భారతీయులు శ్రీ పార్ధసారథి, సురేఖ దంపతులు విగ్రహప్రతిష్ఠ చేపట్టినారు.

శివాలయం[మార్చు]

ఈ ఆలయంలో 2017, ఫిబ్రవరి-6వతేదీ సోమవారంనాడు ద్వాదశ జ్యోతిర్లింగ ఆవిష్కరణ కార్యక్రమం, వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ జ్యోతిర్లింగం నిర్మాణానికి గ్రామానికి చెందిన శ్రీ పాములపాటి పద్దయ్య కుమారుడు శ్రీ వెంకటేశ్వరరావు ఙాపకార్ధం, వెంకటేశ్వరరావు భార్య శ్రీమతి నాగేంద్రమ్మ, రెండు లక్షల రూపాయల విరాళం అందజేసినారు. ద్వాదశ జ్యోతిర్లింగం వద్ద పూజలు చేసిన వారికి రాహు కేతు దోషం పోతుందనీ, వారికి సకల శుభాలు కలుగుతాయనీ ఈ సందర్భంగా పండిత ప్రముఖులు తెలియజేసినారు.

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.

ఈ ఆలయానికి 5.1 ఎకరాల మాన్యం భూమి ఉంది.

శ్రీ రావులమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

స్థానిక ఆలయంలో, 2014, ఆగస్టు-24, ఆదివారం నాడు, అమ్మవారి వార్షిక జాతరను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండియే భక్తులు, అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం పొంగళ్ళు, నైవేద్యాలు సమర్పించి మొక్కులుంతీర్చుకున్నారు. సాయంత్రం వేళలో గ్రామోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ఫలపుష్పాలు సమర్పించారు.

శ్రీ శాంభవీ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 2014, అక్టోబరు-29 నాడు, ఆలయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి మైకులద్వారా భక్తిగీతాలు ఆలపించారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి విశేషపూజలు చేసి పొంగళ్ళు సమర్పించారు.

శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం[మార్చు]

జంపనిలోని సహకార చక్కెర కర్మాగారం ఆవరణలో ఉన్న ఈ ఆలయంలో, ఆలయ 29వ వార్షిక వేడుకలను, 2014, డిసెంబరు-7, ఆదివారం, మార్గశిర బహుళ పాడ్యమినాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుఝామునుండియే అభిషేకాలు, అర్చనలు. విశేష పూజలు నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • గొంది రమేశ్ బాబు రంగస్థల నటుడు, నంది పురస్కార గ్రహీత. 2003వ సంవత్సరంలో హైదరాబాదులో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో వీరు దర్శకత్వం వహించిన, "ఆశల పల్లకిలో" అను నాటికకు నంది పురస్కారం లభించింది. వీరు తెనాలి నాతక కళాకారుల సంఘానికి నాలుగు సంవత్సరాలు అధ్యక్షులుగా కొనసాగినారు. వీరు 74 సంవత్సరాల వయసులో, 2015, మార్చి-3వ తేదీనాడు జంపనిలో కాలధర్మం చెందినారు. [15]
  • పోతార్లంక సాయిరాం సివిల్ జడ్జి
  • మొవ్వా శ్యామసుందరరావు వాలీబాల్ ద్రోణాచార్యుడు
  • నందిరాజు మధుసూదనరావు గ్రామ కరణం, ఆధ్యాత్మికవాది.

గ్రామ విశేషాలు[మార్చు]

  1. ఈ గ్రామంలో సహకార రంగంలోని చక్కెర కర్మాగారం ఉంది. జనాభాలో ముస్లిముల శాతం మిగతా రాష్ట్రం కంటే ఎక్కువ.
  2. అమెరికాలో స్థిరపడిన ఈ వూరివారు, గ్రామంలో రు.25 లక్షలతో ఉన్నత పాఠశాల భవనం, రు. 15 లక్షలతో రక్షిత మంచినీటి పథకం, జన్మభూమి నిధులకు రు. 30 లక్షలు, 8వ వార్డు ప్రాథమిక పాఠశాల నూతన భవనానికి రు. 5 లక్షలు, విరాళంగా ఇచ్చారు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 7977, పురుషుల సంఖ్య 3990, మహిళలు 3987, నివాసగృహాలు 2190, విస్తీర్ణం 2049 హెక్టారుల

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.


"https://te.wikipedia.org/w/index.php?title=జంపని&oldid=4130756" నుండి వెలికితీశారు