Coordinates: 15°29′02″N 78°54′04″E / 15.484°N 78.901°E / 15.484; 78.901

జల్లివానిపుల్లలచెరువు

వికీపీడియా నుండి
(జె.పి.చెరువు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 15°29′02″N 78°54′04″E / 15.484°N 78.901°E / 15.484; 78.901
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంరాచర్ల మండలం
Area
 • మొత్తం13.65 km2 (5.27 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం2,392
 • Density180/km2 (450/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి965
Area code+91 ( 08405 Edit this on Wikidata )
పిన్‌కోడ్523368 Edit this on Wikidata


జల్లివారి పుల్లలచెరువు లేదా జె.పి.చెరువు, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన రాచర్ల నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 51 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 679 ఇళ్లతో, 2392 జనాభాతో 1365 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1217, ఆడవారి సంఖ్య 1175. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 454 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 28. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591171[2].పిన్ కోడ్: 523368.పటం

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కె.ఓబులేశు, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామ సమీపంలోని నల్లమల అటవి ప్రాంతంలో నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం గ్రామానికి 8 కి.మీ. దూరంలో ఉంది.

అంకాలమ్మ ఆలయo[మార్చు]

ఈ గ్రామ సమీపంలోని అంకాలమ్మ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2014, జూన్-6, శుక్రవారం ఉదయం మొదలైనవి. ఉదయం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సాయంత్రం హోమం, జలాధివాసం, కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం నాడు, అంకాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం కుంకుమబండ్లు కట్టినారు. తరువాత హోమం, యంత్రప్రతిష్ఠ, బింబప్రతిష్ఠ నిర్వహించారు. శుక్ర, శని, ఆదివారం, ఈ మూడురోజులూ భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసారు.

ఈ ఆలయంలో 2015, మే-28వ తేదీ గురువారంనాడు, అమ్మవారికి వార్షిక పూజలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో పంచామృతాభిషేకాలతోపాటు, పలు కార్యక్రమాలు నిర్వహించెదరు.

శ్రీ ఈశ్వరీదేవి ఆలయం[మార్చు]

గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017, ఫిబ్రవరి-9వతేదీ గురువారం ఉదయం శ్రీ మహాగణపతి, ఈశ్వరీదేవి, నాగేంద్రస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, వేదపండితుల ఆధ్వర్యంలో, వైభవంగా నిర్వహించారు. ఉదయం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, శిఖర, కలశ ప్రతిష్ఠ, హోమం నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసినారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. రాత్రికి గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బల ప్రదర్శనను నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ పత్తి ఓబులయ్య:- ఈ గ్రామానికి చెందిన ఈయన, కర్నూలు లలితకళాసమితి అధ్యక్షులుగా పనిచేయుచూ నాలుగు దశాబ్దాలుగా నాటకరంగానికి విశేష కృషిచేసారు. వీరి చేసిన సేవలకు గుర్తింపుగా, 2016, ఏప్రిల్-8 దుర్ముఖినామ ఉగాది పర్వదినాన, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారానికి ఎంపికచేసింది. వీరు ఈ పురస్కారాన్ని, ఉగాదిరోజున ముఖ్యమంత్రి చేతులమీదుగా విజయవాడలో అందుకుంటారు.

గణాంకాలు[మార్చు]

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,333. ఇందులో పురుషుల సంఖ్య 1,162, మహిళల సంఖ్య 1,171, గ్రామంలో నివాస గృహాలు 558 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,365 హెక్టారులు

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి చొల్లవీడులో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల గిద్దలూరులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నంద్యాలలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు గిద్దలూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల గిద్దలూరులోను, అనియత విద్యా కేంద్రం మార్కాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

జల్లివాని పుల్లలచెరువులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. మొబైల్ ఫోన్ ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

శాఖా గ్రంథాలయం[మార్చు]

ఈ గ్రంథాల ప్రథమ వార్షికోత్సవం, 2016, మే-20న నిర్వహించారు.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

జల్లివాని పుల్లలచెరువులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 106 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 70 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 323 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 6 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 40 హెక్టార్లు
  • బంజరు భూమి: 19 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 799 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 562 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 296 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

జల్లివాని పుల్లలచెరువులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 296 హెక్టార్లు
  • అంబ చెరువు.

ఉత్పత్తి[మార్చు]

జల్లివాని పుల్లలచెరువులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

ప్రత్తి, ఆముదం, సజ్జలు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]