Jump to content

భారత్ జోడో న్యాయ్ యాత్ర

వికీపీడియా నుండి
భారత్ జోడో న్యాయ్ యాత్ర
Date2024 జనవరి 14 (2024-01-14) – 2024 మార్చి 20 (2024-03-20)
Duration~66 రోజులు
Typeపాదయాత్ర, నిరసన
Themeరాజకీయ ఉద్యమం, సామాజిక ఉద్యమం
Causeఆర్థిక సమస్యలు, సామాజిక అసమానతలు
Motiveనిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధనిక-పేద విభజన, రైతులకు సంబంధించిన సమస్యల వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటానికి.[1]
Participantsరాజకీయ నాయకులు, పౌరులు, పౌర సమాజ సంస్థలు, రాజకీయ కార్యకర్తలు

భారత్ జోడో న్యాయ్ యాత్ర (లిట్: ఇండియా జస్టిస్ అండ్ యూనిటీ మార్చ్ ) భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని 14 జనవరి 2024న ఇంఫాల్ నుండి ప్రారంభమై 20 మార్చి 2024న ముంబయిలో ముగుస్తుంది. ఈ రాజకీయ యాత్ర భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఉంటుంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర మొత్తం 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 110 లోక్‌సభ స్థానాల గుండా వెళుతుంది. భారత్‌ న్యాయ్‌ యాత్రలో చిన్నపాటి నడకతో పాటు బస్సులో ఎక్కువ భాగం నడుస్తుంది.[2][3]

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 11 రోజుల పాటు కొనసాగనుంది. ఆ రాష్ట్రంలో 1,074 కిలోమీటర్ల దూరం వరకు యాత్ర ఉంటుంది. అమేథీ, రాయ్‌బరేలీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా వెళ్లనుంది. అసోంలో 8 రోజులు, పశ్చిమబెంగాల్‌-5, బిహార్‌-4, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయలలో ఒక్కోరోజు పాటు యాత్ర ఉంటుంది.[4]

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర 'లోగో', ట్యాగ్‌లైన్‌ “న్యాయ్ కా హక్ మిల్నే తక్” ను ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జనవరి 06న విడుదల చేశాడు.[5] భారత్ జోడో న్యాయ్ యాత్రను 14 జనవరి 2024న మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలోని ఖోంగ్జోమ్‌ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే జెండా ఊపి ప్రారంభించాడు.[6][7]

షెడ్యూల్

[మార్చు]
ఆల్ ఇండియా - తాత్కాలిక యాత్ర షెడ్యూల్
రాష్ట్రం కవర్ చేయబడిన దూరం (కిమీ) రోజుల సంఖ్య కవర్ చేయబడిన జిల్లాలు ప్రధాన స్థలాలు
మణిపూర్ 107 1 4 ఇంఫాల్
నాగాలాండ్ 257 2 5 కోహిమా
అస్సాం 833 8 17 జోర్హాట్, డిస్పూర్, గౌహతి
అరుణాచల్ ప్రదేశ్ 55 1 1 ఇటానగర్
మేఘాలయ 5 1 1 షిల్లాంగ్
పశ్చిమ బెంగాల్ 523 5 7 కూచ్ బెహర్ , సిలిగురి , ముర్షిదాబాద్
బీహార్ 425 4 7 అరారియా , పూర్ణియ , ససారం
జార్ఖండ్ 804 8 13 ధన్‌బాద్ , రాంచీ , జంషెడ్‌పూర్
ఒడిశా 341 4 4 ఝర్సుగూడ
ఛత్తీస్‌గఢ్ 536 5 7 రాయ్‌ఘర్ , అంబికాపూర్
ఉత్తర ప్రదేశ్ 1,074 11 20 వారణాసి , ప్రయాగ్‌రాజ్ , అమేథీ , రాయ్‌బరేలీ , లక్నో , బరేలీ , అలీగఢ్ , ఆగ్రా
మధ్యప్రదేశ్ 698 7 9 గుణ , ఉజ్జయిని
రాజస్థాన్ 128 1 2 ధోల్పూర్ , బన్స్వారా
గుజరాత్ 445 5 7 దాహోద్ , మాండ్వి
మహారాష్ట్ర 479 5 6 మాలెగావ్ , నాసిక్ , థానే , ముంబై
మొత్తం 6,713 66 110

మూలాలు

[మార్చు]
  1. Kumar, Devesh (29 December 2023). "Rahul Gandhi to hit the road again: Bharat Nyay Yatra explained in numbers". mint (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 30 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 December 2023.
  2. Eenadu (4 December 2023). "మణిపుర్‌ నుంచి మహారాష్ట్ర వరకు.. భారత్‌ న్యాయ్‌ యాత్ర". the original నుండి 8 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 January 2024.
  3. Sakshi (28 December 2023). "రాహుల్‌ గాంధీ 'భారత్‌ న్యాయ యాత్ర'". the original నుండి 8 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 January 2024.
  4. TV9 Telugu (5 January 2024). "రాహుల్ యాత్ర రూటు మారింది.. ఢిల్లీ పీఠం కోసం యూపీ మీదుగా పయనం." the original నుండి 8 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Eenadu (6 January 2024). "రాహుల్‌ యాత్ర.. లోగో విడుదల చేసిన కాంగ్రెస్‌". the original నుండి 8 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 January 2024.
  6. Eenadu (14 January 2024). "మణిపుర్‌లో.. 'భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర' షురూ". the original నుండి 14 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 January 2024.
  7. TV9 Telugu (14 January 2024). "భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభం.. ఖర్గే, రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు." the original నుండి 14 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)