విరూపాక్ష రాయలు
| విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
విరూపాక్ష రాయ (సా.శ. 1345–1405) విజయనగర సామ్రాజ్య చక్రవర్తి.
1404 లో రెండవ హరిహర రాయలు మరణంతో, విజయనగర సామ్రాజ్యం యొక్క సింహాసనం అతని కుమారులైన మొదటి దేవరాయలు, రెండవ బుక్క రాయలు, విరూపాక్షరాయల మధ్య వివాదాస్పదమైంది. విరూపాక్ష రాయలు తన అన్నగారు అయిన రెండవ బుక్క రాయలుకు రావలసిన రాజ్య సింహాసనాన్ని అపహరించాడు. కానీ ఇతను ఎక్కువ కాలం రాజ్యము చేసుకొనలేకపొయినాడు. ఒక సంవత్సరము తరువాత రాజ్యాన్ని సామంత, విధేయుల సహాయంతో రెండవ బుక్క రాయలు స్వాధీనం చేసుకున్నాడు.[1]
ఇతని గురించి చెప్పుకోవలసిన విజయం తన తండ్రిగారి హయాములో సింహళ ద్వీపంపైన సాధించింది.
అతని పాలన కొన్ని నెలలు మాత్రమే ఉన్నందున, విరూపాక్ష పాలనలో ఎటువంటి ముఖ్యమైన సంఘటనలు లేదా మార్పులు గుర్తించబడలేదు. అయినప్పటికీ విరుపాక్ష రాయలు గోవా, చౌల్, దాబోల్ వంటి రాజ్య భూములను ముస్లింల ద్వారా కోల్పోయాడని యాత్రికుడు ఫెర్నావో నూనిజ్ గుర్తించాడు. విరుపాక్షరాయలు స్వయంగా క్రూరంగా ఉండేవాడని, "స్త్రీలను తప్ప మరేమీ పట్టించుకోకుండా, తనను తాను త్రాగుడుకు అలవాటు పడ్డాడని" నూనిజ్ రాశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "The Vijayanagar Empire: Sangama Dynasty". Jagranjosh.com. 2014-09-17. Retrieved 2020-07-22.
బాహ్య లంకెలు
[మార్చు]- https://web.archive.org/web/20051219170139/http://www.aponline.gov.in/quick%20links/HIST-CULT/history_medieval.html
- http://www.ourkarnataka.com/states/history/historyofkarnataka40.htm Archived 2005-11-01 at the Wayback Machine
| ఇంతకు ముందు ఉన్నవారు: రెండవ హరిహర రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1404 — 1405 |
తరువాత వచ్చినవారు: రెండవ బుక్క రాయలు |