హైదరాబాద్ పబ్లిక్ స్కూల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
స్థానం
పటం
,
సమాచారం
రకంపబ్లిక్
స్థాపన1923
బోధనా సిబ్బంది102
విద్యార్ధుల సంఖ్య590 (మొత్తం), 406 (9-12)
Campus160 ఎకరాలు
Color(s)Blue and gold
WebsiteOfficial website
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట

ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్లో ఒక పేరెన్నికగల విద్యాసంస్థ. ఈ సంస్థకు 100 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. దేశంలోని 20 ప్రసిద్ధ పాఠశాలల్లో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటని ప్రఖ్యాత వరల్డ్ మ్యాగజైన్ గుర్తించింది. 140 ఎకరాల సువిశాల ప్రాంగణం, పెద్ద క్రీడా మైదానం, ఎటు చూసినా పచ్చదనం, అత్యాధునిక వసతులతో కూడి ఉంది ఈ విద్యాసంస్థ. ఈ సంస్థలో చదివిన ఎందరో విద్యార్థులు అత్యున్నత స్థానములలో స్థిరపడ్డారు. మన రాష్ట్రంలో ఈ విద్యాసంస్థకు కడపలో శాఖా సంస్థ ఉంది. 2014 ఫిబ్రవరి 4 న ఈ సంస్థ పూర్వ విద్యార్థి సత్య నాదెళ్ల ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ సంస్థ మూడవ ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా నియమింపబడిన సందర్భంగా ఈ విద్యాసంస్థ పేరు వార్తలలో నిలిచించి. దీని రెండవ ప్రాంగణం రామంతాపూర్ ప్రాంతంలో ఉంది.

చరిత్ర[మార్చు]

ఉన్నత వర్గాల వారి కోసం ముఖ్యంగా నవాబులు, జాగీర్‌దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల చదువుల కోసం 1923లో ‘జాగీర్‌దార్ స్కూల్’ పేరుతో ప్రారంభమైందీ పాఠశాల. అప్పటి జాగీర్‌దార్లలో ఒకరైనా సర్ వికార్-ఉల్-ఉమా బహుల్‌ఖానగూడ పేరుతో ఉన్న ప్రస్తుత బేగంపేటలో దీర్ఘకాల లీజ్ ప్రాతిపదికన పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. బ్రిటిష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపాల్‌గా... ముగ్గురు విద్యార్థులతో పాఠశాల మొదటి బ్యాచ్ ప్రారంభమైంది.

1950లో ప్రభుత్వం జమిందారీ వ్యవస్థను రద్దు చేయడంతో... అప్పటి వరకు కేవలం ప్రముఖుల పిల్లలకే పరిమితమైన జాగీర్‌దార్ స్కూల్ పబ్లిక్ స్కూల్‌గా రూపాంతరం చెందింది. నాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదటి అధ్యక్షుడిగా హెచ్‌పీఎస్ సొసైటీ ఏర్పాటైంది. బాలులకు మాత్రమే పరిమితమైన హెచ్‌పీఎస్ 1988 నుంచి బాలికలకు కూడా ప్రవేశాలు కల్పించింది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

ప్రముఖ పూర్వ విద్యార్థులు[మార్చు]

ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఎందరో నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రాజకీయ నాయకులుగా, సినీతారలుగా, వ్యాపారవేత్తలుగా ఉన్నారు. వారిలో కొందరు.

శతాబ్ది ఉత్సవాలు[మార్చు]

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది సందర్భంగా భారత గౌరవాధ్యక్షులు శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఎందరో మహానుభావులు ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తన అనుభవాల ఆధారంగా విద్యార్థులను బలమైన నిర్ణయాలు తీసుకునేవారిగా తీర్చిదిద్దింది, అకడమిక్ ఎక్సలెన్స్, విద్యార్థులలో మంచి నడవడిక స్కూల్ లో ప్రధానమైనవని గా ఉన్నాయని, ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ పాఠశాల దేశానికి గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది[2].అని గుర్తు చేసారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ఈ పాఠశాలలో చదివి, ఉన్నత స్థాయికి చేరిన పూర్వ విద్యార్థులైన, సత్య నాదెళ్ల, అజయ్ పాల్ బంగా, శంతను నారాయణ్, ప్రేమ్ వత్స, హర్ష భోగ్లే వంటి వారు పాల్గొంటారు. ఇందులో భాగంగా మల్టీ స్పోర్ట్స్ ఫెసిలిటీ, స్టార్టప్స్ కోసం ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు కూడా ఈ వేడుకల్లో ఉంటుంది. ఈ ఉత్సవాలు డిసెంబర్ 27న ముగుస్తాయి[3] .

ఇవికూడా చూడండి

మూలాలు[మార్చు]

  1. "Biden nominates Indian American Ajay Banga for World Bank president news in telugu". web.archive.org. 2023-05-04. Archived from the original on 2023-05-04. Retrieved 2023-05-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. admin (2023-12-19). ""The Hyderabad Public School has inspired many students and fetched great recognition to the country" says Hon'ble President of India on the Centenary of The Hyderabad Public School, Begumpet – Brainfeed Magazine" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-24.
  3. "Murmu to kick-start grand finale of Hyderabad Public School". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-12-17. Retrieved 2023-12-24.

బయటి లంకెలు[మార్చు]