కొయ్యలగూడెం
స్వరూపం
కొయ్యలగూడెం | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 17°7′43.00″N 81°25′38.46″E / 17.1286111°N 81.4273500°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ఏలూరు |
| మండలం | కొయ్యలగూడెం |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( 08821 |
| పిన్కోడ్ | 534312 |
కొయ్యలగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, కొయ్యలగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది కొయ్యలగూడెం మండలానికి కేంద్రం.[1]
ప్రముఖులు
[మార్చు]ప్రధాన వ్యాసం: వడ్డూరి అచ్యుతరామ కవి

- వడ్డూరి అచ్యుతరామ కవి - ఇతను 1916 అక్టోబర్ 16 వ సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో జన్మించారు.[ఆధారం చూపాలి] వారి తండ్రి వడ్డూరి సోమరాజు కరిణీకం, వ్యవసాయం చేస్తూ కవిత్వం కూడా వ్రాసేవారు తీరిక సమయాలలో పురాణ ప్రవచనాలు చెప్పేవారు.
- అతను రచించిన భక్తవత్సల శతకం పద్యాలను కుమారుడు అచ్యుత రామారావు ఫెయిర్ చేసేవారు అలా తరచూ పద్యాలను వ్రాయడం వలన చిన్నతనంలోనే అతనుకు కూడా పద్యాలు వ్రాయాలని కోరిక కలిగి వినాయకుని పై తోలి పద్యం వ్రాసి అతని నాన్నకు చూపితే వారు చూసి మెచ్చుకుని బాగుందని అని చెప్పాడు.
- ఆ తరువాత అతని నాన్న భక్తవత్సలం శ్రీ దేవిభాగవతం, రామాయణం, భాగవతం చదివితే పద్యాలు ఇంకా బాగా వ్రాయగలవు అని దీవించారు. తొలిసారిగా శ్రీగణేశ్ పురాణం వ్రాశారు.ఈ గ్రామంలో జన్మించాడు.
- తరువాత కొంతకాలానికి స్వాతంత్ర్య ఉద్యమం లో భాగంగా ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధిజీ పిలుపు మేరకు అతను కాకినాడలో సత్యాగ్రహంలో పాల్గొని బ్రిటీష్ వారిని ఎదిరించి తంజావూరు జైలులో శిక్ష అనుభవించారు.
