Coordinates: 14°16′02″N 79°07′03″E / 14.267242°N 79.1176296°E / 14.267242; 79.1176296

నందలూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 14°16′02″N 79°07′03″E / 14.267242°N 79.1176296°E / 14.267242; 79.1176296
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండలంనందలూరు మండలం
Area
 • మొత్తం7.75 km2 (2.99 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం5,481
 • Density710/km2 (1,800/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1070
Area code+91 ( 08565 Edit this on Wikidata )
పిన్‌కోడ్516150 Edit this on Wikidata


నందలూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అన్నమయ్య జిల్లా, నందలూరు మండలం లోని గ్రామం, ఇది మండల కేంద్రం.

ఇది సమీప పట్టణమైన రాజంపేట నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1198 ఇళ్లతో, 5481 జనాభాతో 775 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2648, ఆడవారి సంఖ్య 2833. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 980 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 239. గ్రామం జనగణన లొకేషన్ కోడ్ 593579.[2] పిన్ కోడ్: 516 150.

గ్రామచరిత్ర[మార్చు]

నందలూరుకు సమీపంలోని ఆడపూరు దగ్గర బౌద్ధారామం ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ బౌద్ధారామం

నందలూరు గురించి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో పలు విశేషాలు నమోదుచేశారు. 1830నాటికి ఈ గ్రామం పుణ్యక్షేత్రంగా పేరొందింది. వీరాస్వామయ్య ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ ఊరి వద్ద చెయ్యారనే నది గడియదూరం వెడల్పు కలిగుందన్నారు. నదికి ఇరుపక్కల గుళ్ళున్నవని, పరశురాముని మాతృహత్య నివర్తించిన స్థలమని ఆయన పేర్కొన్నారు.[3]

ఈ గ్రామం ఒకప్పుడు బౌద్ధ క్షేత్రం. నందలూరుకు సమీపంలోని ఆడపూరు దగ్గర బౌద్ధారామముండేది. ఇప్పటికీ దీనిని బైరాగి గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్ట కింద సొరంగ మార్గముంది. నందలూరు దగ్గర చాలా గుహలున్నాయి. సిద్ధవటం కోటలోనుంచి నందలూరు గుహల్లోకి రహస్య మార్గముందంటారు. పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో బౌద్ధ స్తూపాలు, బౌద్ధ విహారం, కొన్ని కట్టడాలు, 1600 పైగా సీసపు నాణేలు, మరికొన్ని బౌద్ధ చిహ్నాలు దొరికాయి.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ గ్రామానికి పూర్వం తొండమండలం, నిరంతపురం, చొక్కనాథపురం అనే పేర్లు ఉండేవి. నిరంధర అనే మహారాజు నిరంతపురం అనే గ్రామాన్ని నిర్మించగా అది బాహుదా నది వెల్లువలో కొట్టుకుపోగా తరువాత నలంద అనే రాజు ఉంపుడుగత్తె ఈ ప్రదేశాన్ని సందర్శించి నెలందలూరు అనే పేరుతో తిరిగి గ్రామాన్ని నిర్మించినట్టు మెకంజీ కైఫీయత్‌లో పేర్కొనబడింది.[4] పూర్వం ఒక తెలుగు చోడ ప్రభువు గోహత్య పాప నివారణార్థం బాహుదానదీ తీరం వెంబడి 108 శివాలయాలను నిర్మించాడు. ఆ దేవాలయాలలో నంది విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యత ఇచ్చినందువల్ల ఆ నది గట్టున ఉన్న గ్రామానికి నం(ది)దుల ఊరు అనే పేరు వచ్చిందనీ అదే వ్యవహారికంలో నందలూరుగా మారిందని మరొక ఐతిహ్యం.[5]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.

సమీప ప్రభుత్వ ఆర్ట్స్/సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం రాజంపేట లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, కడప లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

నందలూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

నందలూరులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

నందలూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 162 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 303 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 7 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 74 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 39 హెక్టార్లు
  • బంజరు భూమి: 37 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 150 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 36 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 190 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కన్యక చెరువు[మార్చు]

నందలూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 178 హెక్టార్లు
  • చెరువులు: 12 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

నందలూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, పొద్దుతిరుగుడు, నువ్వులు

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

నారింజ

చేతివృత్తులవారి ఉత్పత్తులు[మార్చు]

బుట్టలు

ప్రముఖులు[మార్చు]

  • వేదాంతం కమలాదేవి సంఘ సేవకురాలు ఈ గ్రామంలో జన్మించింది.[6]
  • కోడూరు సుమనశ్రీ, ప్రముఖ కూచిపూడి నృత్య గురువు, రచయిత్రి (మా నందలూరు కథలు పేరిట ఆమె పుస్తకాన్ని కూడా వెలువరించింది.)

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

సౌమ్యనాథ స్వామివారి ఆలయం[మార్చు]

ఇది 11వ శతాబ్దంలో చోళవంశరాజులచే నిర్మించబడిన ఆలయం.[7] సంతాన సౌమ్యనాథునిగా, వీసాల సౌమ్యనాథునిగా ప్రసిద్ధికెక్కాడు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో చోళ కళాశిల్ప నైపుణ్యానికి ప్రతీక. 11వ శతాబ్దపు పూర్వార్థంలో చోళరాజులు నిర్మించి, స్వామివారికి 120 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాల్లో లిఖించబడి ఉంది. అప్పటి నుండి చోళపాండ్య కాకతీయ మట్లి మున్నగురాజులు 17వ శతాబ్దం వరకు దశలవారీగా ఆలయనిర్మాణం చేపట్టి పలు రాజుల పాలనలో శ్రీవారి ఆలయం ప్రసిద్ధికెక్కింది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలిగోపురం కట్టించి నందలూరు, ఆడపూరు, మందరం, మన్నూరు, హస్త వరం అయిదు గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనాలు ఉన్నాయి. ఆ గ్రామాల రెవెన్యూ ఇప్పటికీ ఆలయానికే అందుతోంది. అన్నమయ్య జన్మస్థానమైన తాళ్ళపాక గ్రామం, నందలూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.

శ్రీ సౌమ్యనాథుని చొక్కనాథుడని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణానికి ఎర్ర రాయిని వినియోగించారు. ఆలయ కుడ్యాలపై వివిధ రాజుల సంకేతాలుగా మత్స్య, సింహ, అర్థచంద్రాకారపు చిహ్నాలున్నాయి. తమిళ శాసనాలు అధికంగా ఉండగా, తెలుగు శాసనాలు కొన్నిమాత్రమే. దేవస్థానంలో గోడలపైన కాకుండా నిలువు బండలపై 11వ శతాబ్దం నుండి విజయనగర పాలన వరకు ముఖ్యమైన అనేక వివరాలతో 54 శాసనాలు ఉన్నాయి.

ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి, కోర్కెను మొక్కుకుని, 108 ప్రదక్షిణలుచేస్తే, నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి జిల్లా నలుమూలల నుండియేగాక, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.[2]

శ్రీ కామాక్షీ సమేత ఉల్లంఘేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ అనంతపురమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయం గ్రామములోని కన్యక చెరువు గట్టున వెలసింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  4. కె.నాగేశ్వరరెడ్డి (4 November 2001). "అన్నమాచార్యుడు దర్శించిన సౌమ్యనాథుని ఆలయం". వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం.
  5. కె.నాగేశ్వరరెడ్డి (4 November 2001). "అన్నమాచార్యుడు దర్శించిన సౌమ్యనాథుని ఆలయం". వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం.
  6. కమలాదేవి, వేదాంతం (1897 - 1940), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 63-64.
  7. "Surya Telugu Daily Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra , Telugu Culture and Tradition, etc". web.archive.org. 2009-11-24. Archived from the original on 2009-11-24. Retrieved 2021-07-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లింకులు[మార్చు]

  • వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, విద్వాన్ కట్టా నరసింహులు
"https://te.wikipedia.org/w/index.php?title=నందలూరు&oldid=3868346" నుండి వెలికితీశారు