Coordinates: 25°19′28″N 87°17′12″E / 25.3244°N 87.2867°E / 25.3244; 87.2867

విక్రమశిల విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?విక్రమశిల
Vikramaśīla
బీహార్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 25°19′28″N 87°17′12″E / 25.3244°N 87.2867°E / 25.3244; 87.2867
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
సమీప నగరం భగల్‌పూర్
కోడులు
ప్రాంతీయ ఫోన్ కోడ్

• +0641
విక్రమశిల విశ్వవిద్యాలయ శిథిలాలు

పాల సామ్రాజ్యకాలంలోని, రెండు ప్రముఖమైన బౌద్ధ అభ్యాసకేంద్రాలలో ఒకటి నలందా విశ్వవిద్యాలయం కాగా రెండవది ఈ విక్రమశిల విశ్వవిద్యాలయం. నలందా విశ్వవిద్యాలయంలోని పండితుల నాణ్యత పడిపోతూ ఉండుటవల్ల, పాలవంశపు రాజు ధర్మపాలుడు (783-820) విక్రమశిలని స్థాపించాడు. ఇక్కడి పండితులలో ముఖ్యమైనవాడు అతిషుడు.

ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని భగల్‌పూర్ 50 కి.మీ దూరంలో అంతిచక్ గ్రామం ఉన్న స్థలమే ఒకప్పటి విక్రమశిల విశ్వవిద్యాలయం.

చరిత్ర[మార్చు]

పాలవంశరాజుల కాలంలో ప్రాచీన వంగ, మగధ ప్రాంతాలలో ఎన్నో బౌద్ధ మఠాలు వెలిసాయి. టిబెట్‌వారి సమాచారం ప్రకారం, ఆ కాలంలో ఐదు మహావిహారాలుండేవి. మొదటిదైన విక్రమశిల ఆ కాలంనాటి అత్యున్నతమైనది కాగా, నాలందా పాతదైపోయినప్పటికీ వెలుగులీనుతూనే ఉంది. మిగిలినవి సోమపుర, ఓదంతపుర, జగ్గదల లు.

పాలవంశపు రాజు ధర్మపాలుడు (783-820) విక్రమశిలని స్థాపించినప్పటి నుండి 12వ శతాబ్దంలో భక్తియార్ ఖిల్జీ అనేక బౌద్ధ కేంద్రాలతో బాటు దీనిని కూడా ధ్వంసం చేసేవరకూ వెలుగొందింది. మనకు విక్రమశిల గురించిన సమాచారం కేవలం టిబెట్ వారి వద్దనే లభ్యమౌతోంది. అందులో ముఖ్యమైనవి క్రీ. శ 16-17 శతాబ్దాలనాటి తారనాథుడనే టిబెట్ సన్యాసి రచనలు.

100మందికి పైగా అచార్యులతోనూ, 1000కిపైగా విద్యార్థులతోనూ విక్రమశిల అతి పెద్ద బౌద్ధ విశ్వవిద్యాలయం. బౌద్ధ అభ్యాసం, సంస్కృతి, మతం ప్రచారం చేసేందుకు ఇక్కడి పండితులకు విదేశాలనుండి కూడా అహ్వానాలోస్తూ ఉండేవి.

సంస్థ[మార్చు]

విక్రమశిల తక్కిన విశ్వవిద్యాలయాకంటే స్పష్టమైన అధికార క్రమాన్ని కలిగి ఉండేదని, సుకుమార్ దత్త్ వంటివారి అభిప్రాయం.

  • అధ్యక్షుడు
  • ద్వారపాలకుడు లేదా ద్వారపండితుడు (ద్వారాలు ఆరు. అవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, మొదటి మద్యం, రెండవ మద్యం)
  • మహాపండితుడు
  • పండితుడు (సుమారుగా 108 మంది)
  • ఉపాధ్యాయులు లేదా అచార్యులు (పండితులతో కలిపి 160మంది)
  • భిక్షువులు (సుమారుగా 1000మంది)

ఇచ్చట విద్యాభ్యాసము ముగించినవారికి రాజులు 'పండిత ' అని బిరుదునిచ్చి గౌరవించుచుండిరి. రత్నవ్రజ, జేతారి, ద్వీపంకర, రత్నకీర్తి, జ్ఞానశ్రీమిత్ర, రత్నాకరశాంతి మున్నగువారీ పండితులలో అగ్రగణ్యులు. విక్రమశిలావిద్యాపీఠమున ఆరుద్వారములుండెడివి. వానివద్ద దిగ్దంతులగు పండితులుండెరి. వీరిలో ప్రజ్ఞాకరమతి అనునాతడు దక్షిణద్వారమున, రత్నాకరశాంతి ప్రాగ్ద్వారమును, వాగీశ్వరకీర్తి ఉతారద్వారమును నొకప్పుడు రక్షించుచుండెరని తారానాధుడనే చరిత్రకారుడు వ్రాసియున్నాడు. ఈ ఆరు ద్వారములకు ఎదురుగా ఆరు విశాలమగు కళాశాలలుండెడివి. ఒకో కళాశాలలో నూటయెన్మండు ఉపాధ్యాయులుండిరి. ఇదిగాక దీని అంతర్భాగమున ఒకేసారిగ యెనిమిదివేలమంది ఉపాసకులు నిల్చుటకు సరియగు స్థలము ఉండేడిదట. ఈ విద్యాపీఠము చుట్టునూ గల గోడపై సింహద్వారమునకు దక్షిణ పార్స్వమున నాగార్జునియొక్కయు, ఉత్తరపార్స్వంబున దతిశుని యొక్కయు చిత్రములు వ్రాయబడియున్నవి. ఈవిధముగ పండితశిఖామణులిచ్చట బహూకరింపబడుచుండెరి.

బౌద్ధ తంత్రమునకు ఈ విశ్వవిద్యాలయము విశేషవిఖ్యాతి వహించి యుండెను. సా.శ.5 వ శతాబ్దమున ఇంద్రజాలాదికములతో గూడిన తంత్ర శాస్త్రము బౌద్ధులలో ప్రబలి 8, 10 వ శతాబ్దములలో విశేషముగ అభివృద్ధి చెందినది. ఏకేశ్వరాత్మకమగు మహాయాన బౌద్ధమున ఈ శక్త్యారాధమగు ఈ తంత్ర విద్య చేర్చారు. వ్యాకరణ, వేదాంత, తర్కశాస్త్రమలు పిమ్మట పేర్కొన వలసిన విషయములు. నాలందా విద్యాపఠమునకు పిమ్మట విశేషఖ్యాతిని గాంచిన ఈ విద్యాపీఠము తుదకు భక్తయార్ ఖల్జీచే నాశనమొనర్పబడెను.[1]

వాస్తు, త్రవ్వకాలు[మార్చు]

విశ్వవిద్యాలయ శిథిలాలలో కొన్నిటిని మాత్రమే ఇప్పటివరకూ తవ్వకాలలో బయట పడ్డాయి.

స్థూపం[మార్చు]

A The Main stupa at the center
మధ్యభాగంలోని ప్రధానస్థూపం

చేరడం ఎలా..?[మార్చు]

దగ్గర్లోని పెద్ద పట్టణం కహాల్‌గావ్ 13కి.మీ దూరంలో ఉంది. భారతీయ రైల్వే ఢిల్లీ నుండి భగల్‌పూర్‌కి నెం2367/2368 విక్రమశిల ఎక్స్‌ప్రెస్ ని కూడా నడుపుతోంది.

విశేషాలు[మార్చు]

తవ్వకాల చోటు వద్దనున్న మ్యూజియం. ఇక్కడ తవ్వకాలలో బయటపడిన శిల్పాలు, కళాఖండాలు, పాత్రలు, నాణేలు, ఆయుధాలు, ఆభరణాలు ప్రదర్శింపబడుతూ ఉంటాయి.
స్థూపం వద్ద నుండి ప్రవేశద్వారం
విశ్వవిద్యాలయపు స్తంభాలు
చర్చాస్థలి, ధ్యానస్థలి తదితరాల శిథిలాలు

బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.


మూలాలు[మార్చు]

  1. Bharati [1933] samchika