హుమాయూన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హుమాయూన్
హుమాయూన్
Birth name: నసీరుద్దీన్ హుమాయూన్.
Family name: తైమూరిద్
Title: మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి
Birth: మార్చి 6, 1508
Place of birth: కాబూల్
Death: 1556 ఫిబ్రవరి 22(1556-02-22) (వయసు 47)
Place of death: ఢిల్లీ
Burial: హుమాయూన్ సమాధి
Succeeded by: అక్బర్
Marriage:

హమీదా బాను బేగం
బేగా బేగం
బిగెహ్ బేగం
చాంద్ బీబీ
హాజీ బేగం
మాహ్-చుచక్
మివేహ్ జాన్
షాహ్ జాది ఖానమ్

సంతానం:

అక్బర్, కుమారుడు
మిర్జా ముహమ్మద్ హకీం, కుమారుడు
అఖీఖే బేగం, కుమార్తె
బక్షీ బానూ బేగం, కుమార్తె
బఖ్తున్నిసా బేగం, కుమార్తె

నాసిరుద్దీన్ ముహమ్మద్ హుమాయాన్ ( అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖాన్ అల్-ముకర్రమ్, జామ్-ఇ-సల్తనత్-ఎ-హఖీఖి వ మజాజి, సయ్యద్ అల్-సలాతీన్, అబుల్ ముజఫ్ఫర్ నాసిర్ ఉద్దీన్ ముహమ్మద్ హుమాయూన్ పాద్షాహ్ గాజి, జియాఉల్లాహ్) (పర్షియన్ : نصيرالدين همايون) (మార్చి 6 1508ఫిబ్రవరి 22 1556), మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి. ఇతను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారత ప్రాంతాలను పాలించాడు. 1530–1540, తిరిగి 1555–1556 వరకూ పరిపాలించాడు. ఇతడి తండ్రి బాబరు. కుమారుడు అక్బర్.

వ్యక్తిత్వం[మార్చు]

హుమాయూన్ చక్కని విద్వాంసుడు. జ్యోతిష్యభూగోళ శాస్త్రములందు అభిరుచి గల యీ చక్రవర్తి స్వోపయోగార్ధము భూగోళఖగోలకు ప్రతికృతులను (ఘ్లొబెస్)నిర్మించుకొనెను. జాతకభాగమునందున దీతనికి ప్రబలమగు విశ్వాసముండెడిది. పంచ భూతములయొక్క తత్వమును విమర్చించుచు ఈతడొక గ్రంధమును రచించెను. తన దర్సనమొనర్చి తన ఆదరమునుబడయు జనులను ఈతడు కొన్ని తరగతులుగా విభజించి యందు విద్వాంసులకు మతప్రచారకులతోడను, ధర్మశాస్త్రజ్ఞులతోడను సమముగ అగ్రస్థానమునొసంగెను. ఖగోళమునందు గ్రహముల పేరిట దివ్య భవనములను నిర్మిచి యీ చక్రవర్తి శనిగురువుల భవనములలో విద్వత్సమానము నొనర్చుచుండెను. యుద్ధ రంగములకేగునపుడు, తుదకు ప్రాణములకై పరుగెత్తినపుడుగూడ ఈతడు గ్రంధములనుమాత్రము విడువకుండెనట. ఈ చక్రవర్తి నిర్మించిన విద్యాలయములలో ఢిల్లీ నగరమందలి కళాశాలయు, ఆగ్రానగరమున కెదురుగ యమునా తీరమందలి మరియొక విద్యాలయమును ముఖ్యమయినవి.

హుమాయున్‌కు తన తండ్రి బాబర్ ఎలాంటి స్థితిలోనూ కోల్పోకుండా ఇచ్చిన అపురూపమైన వజ్రం కోహినూర్‌ని చాలాకాలం జాగ్రత్తగా కాపాడుకున్నారు. మొఘల్ చరిత్రకారుడు అబుల్ ఫజల్ వ్రాసిన చరిత్ర ప్రకారం హుమాయున్ షేర్షా కారణంగా రాజ్యాన్ని కోల్పోయి రాజస్థానంలో ప్రవాసం ఉన్నప్పుడు కూడా వజ్రాన్ని నిలబెట్టుకున్నారు. కోహినూర్ పొందాలని మార్వాడ్ రాజైన మాల్దేవు తన అనుచరుడికి వ్యాపారస్తుని వేషం వేసి వజ్రానికి మంచి ధర కట్టి కొనిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే హుమాయున్ అమ్మలేదు. చివరకు రాజ్యాన్ని తిరిగి పొందేందుకు పర్షియన్ రాజు షా తహమస్ సహకరించినప్పుడు, అతనికి కృతజ్ఞతతో 250 విలువైన వజ్రాలతోపాటు కోహినూరును కూడా ఇచ్చేశారు.[1]

మరణం[మార్చు]

హుమాయూన్ సమాధి

ఫిబ్రవరి 22, 1556 న, చేతినిండా పుస్తకాలతో గ్రంథాలయ మెట్లపై నడుస్తూ క్రిందికి వస్తున్న హుమాయూన్, మస్జిద్ నుండి అజాన్ విని, నమాజ్ కు వెళ్ళాలన్న ఆతృతతో వడివడిగా అడుగులు ముందుకు వేశాడు. కాలు జారి, మెట్లపైనుండి, జారి పడ్డాడు. గాయాలపాలైన హుమాయూన మూడురోజుల తరువాత మరణించాడు. 13 యేండ్ల అక్బర్ సింహాసనం అధిష్టించాడు.

మూలాలు[మార్చు]

  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  • Gulbadan Begum Humayun-nama. Trans. & Ed. Annette Beveridge Royal Asiatic Soc. (London) 1902 (ISBN 81-215-1006-6)
  • Cambridge History of India, Vol. III & IV, "Turks and Afghan" and "The Mughal Period". (Cambridge) 1928
  • Muzaffar Alam & Sanjay Subrahmanyan (Eds.) The Mughal State 1526-1750 (Delhi) 1998
  • William Irvine The army of the Indian Moghuls. (London) 1902. (Last revised 1985)
  • Bamber Gasgoigne The Great Moghuls (London) 1971. (Last revised 1987)
  • Jos Gommans Mughal Warfare (London) 2002
  • Peter Jackson The Delhi Sultanate. A Political and Military History (Cambridge) 1999
  • John F. Richards The Mughal Empire (Cambridge) 1993
  • James Tod Annals & Antiquities of Rajasthan (Oxford) 1920 Ed. Wm Crooke (3rd Edition)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హుమాయూన్&oldid=3850343" నుండి వెలికితీశారు