1630

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1630 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంఘటనలు[మార్చు]

  • మార్చి 9: 1630 క్రీట్ భూకంపం సంభవించింది.
  • ఏప్రిల్ 8: న్యూ ఇంగ్లాండ్‌కు ప్యూరిటన్ల వలస (1620-1640) : అర్బెల్లా ఓడ, మరో మూడు ఓడలతో కూడిన విన్‌త్రోప్ ఫ్లీట్ ఇంగ్లండ్‌లోని సోలెంట్ నుండి బయలుదేరాయి. జాన్ విన్త్రోప్ నాయకత్వంలో 400 మంది ప్రయాణికులు అమెరికాలోని మసాచుసెట్స్ బే వలసకు వెళ్లారు; మరో కొన్ని వారాల్లో మరో ఏడు ఫ్లీట్లు కూడా వెళ్ళాయి.
  • జూన్ 14: అర్బెల్లా నౌక లోని ప్రయాణీకులు చివరకు మసాచుసెట్స్‌లోని సేలం వద్ద కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టారు. వారిలో అమెరికా యొక్క మొట్టమొదటి ప్రముఖ కవి అన్నే బ్రాడ్‌స్ట్రీట్‌తో కూడా ఉంది.
  • జూలై: 1629–31 నాటి ఇటాలియన్ ప్లేగు వెనిస్‌కు చేరుకుంది.
  • సెప్టెంబర్ 17: మసాచుసెట్స్ బే వలసలో బోస్టన్ స్థావరాన్ని స్థాపించారు.[1]

తేదీ తెలియదు[మార్చు]

  • పరమారిబోలో (ఆధునిక సురినామ్‌లో ) మొదట ఆంగ్లేయులు స్థిరపడ్డారు.
  • భారతదేశంలో 1630-32 నాటి దక్కన్ కరువు ప్రారంభమవుతుంది; ఇందులో ఇరవై లక్షల మంది చనిపోయారు.
  • మొఘల్ సామ్రాజ్యంలో, లాహోర్ కోటలోని షాజహాన్ యొక్క పెర్ల్ మసీదు పవిత్రం చేయబడింది (1635 లో ఇది పూర్తయింది).
  • జోహాన్ హెన్రిచ్ ఆల్స్టెడ్ యొక్క ఎన్సైక్లోపీడియా సెప్టెంబర్ టోమిస్ డిస్టింకా ప్రచురించబడింది.

జననాలు[మార్చు]

ఛత్రపతి శివాజీ

మరణాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Historical note". Archives Guide - Town of Boston. City of Boston. Retrieved 2013-03-20.
"https://te.wikipedia.org/w/index.php?title=1630&oldid=3883110" నుండి వెలికితీశారు