ఎర్రమల్లెలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రమల్లెలు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ధవళ సత్యం
తారాగణం మురళీమోహన్ ,
రాజేష్,
మాదాల రంగారావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ నవతరం పిక్చర్స్
భాష తెలుగు

ఎర్రమల్లెలు 1981లో విడుదలైన తెలుగు సినిమా. నవతరం పిక్చర్స్ పతాకంపై మాదాల కోదండరామయ్య, మాదాల రంగారావు లు నిర్మించిన ఈ సినిమాకు ధవళ సత్యం దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, గిరిబాబు, మాదాల రంగారావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రంలో ఎస్. పి. శైలజ ఆలపించిన నాంపల్లి టేషనుకాడి రాజాలింగో అనే పాట ప్రజాదరణ పొందింది. దీనిని తమిళంలో శివప్పు మల్లి (1981) గా పునర్నిర్మించారు.

ఒక ఊరికి ముగ్గురు క్షుద్రదేవతలు మునసబు, కరణం, కామందు. మిగిలిన జనమంతా వీళ్ళు ఆడుకోవడానికి పావుల్లాంటి వాళ్ళు. చదువురాని వాళ్లి. ఆ ఊరికి చదువు చెప్పడానికి ఒక మాస్టారు వస్తాడు. ఆ మేస్టారి రాకతో చైతన్యం వస్తుంది. విప్లవం రగులుతుంది. ఆ మంటల్లో ఆ ముగ్గురు క్షుద్రదేవతలతో పాటు పక్కవూరి ఫ్యాక్టరీ యజమాని కూడా భగ్గుమంటాడు.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • నడుముకు నిన్ను చీలికచేసి ... బంగారు మాతల్లి, ఎస్ పి శైలజ , రచన: ధవళ సత్యం.
  • నాంపల్లి టేషన్ కాడా రాజాలింగో.ఎస్.పి.శైలజ.రచన:ప్రభు
  • ఓ లగి జిగి లగీ జిగి . శ్రీపతి పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం. రచన: ధవళ సత్యం
  • నేడే మేడే, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం, రచన: అదృష్ట దీపక్
  • బంగారు మా తల్లి ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ , జీ.ఆనంద్., రచన: ధవళ సత్యం
  • బంజరు భూమిలో మట్టిలో, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జి . ఆనంద్, ఎస్ పి శైలజ బృందం, రచన: కొండవీటి వెంకటకవి

విడుదల

[మార్చు]

1981 మే 1న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఎర్ర మల్లెలు విడుదలైంది.[3][4] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 23 కేంద్రాలలో విడుదలైన ఎర్ర మల్లెలు 17 కేంద్రాలలో 50 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించబడింది.[4] ఆంధ్ర పత్రిక పాత్రలతో పాటు రచన, దర్శకత్వంను ప్రశంసించింది.[5] సితార ఉగ్రవాదం, న్యాయ వ్యవస్థలో అవినీతి, కార్మికుల హక్కులు మొదలైన వివిధ సమస్యలను ప్రస్తావించినందుకు రచయిత, నటుడు మదాల రంగారావును ప్రశంసించింది.[6]

కమ్యూనిస్ట్ నేపథ్య చిత్రాలలో ఎర్ర మల్లెలు ఒక మైలురాయిగా గుర్తించారు. ఎర్ర మల్లెలు వాణిజ్య విజయం అదే పంథాలో అనేక చిత్రాలకు ప్రేరణనిచ్చింది. అదే కోవలో, ఆ తరువాత వచ్చిన చిత్రాలు ఎర్రసైన్యం (1994), ఒసేయ్ రాములమ్మా (1997).[4]

చిత్రనిర్మాత టి. కృష్ణ మొదటిసారి తెరపై కనిపించాడు. ఈ పాత్ర కోసం ఆయన గడ్డం పెంచి, తన మరణం వరకు అదే రూపాన్ని కొనసాగించాడు. "నాంపల్లి స్టేషన్ కాడ" పాటతో గాయని ఎస్. పి. శైలజ తన పురోగతిని సాధించింది. ఎర్ర మల్లెలు చిత్రం తమిళ భాషలో శివప్పు మల్లి (1981)గా పునర్నిర్మించబడింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Erra Mallelu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-20.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-20.
  3. "Erra Mallelu". Indiancinema. Archived from the original on 27 January 2023. Retrieved 3 June 2022.
  4. 4.0 4.1 4.2 4.3 Jayadeva, Rentala (2 May 2021). "Erra Mallelu: తెలుగుతెరపై అరుణోదయం.. ఎర్ర మల్లెలు". Sakshi. Archived from the original on 21 February 2022. Retrieved 3 June 2022.
  5. Venkatrao (6 May 1981). "చిత్ర సమీక్ష: ఎర్ర మల్లెలు" [Film review: Erra Mallelu]. Andhra Patrika. Archived from the original on 27 January 2023. Retrieved 6 June 2022.
  6. Srihari, Gudipoodi (17 May 1981). "సినిమా రివ్యూ: ఎర్ర మల్లెలు" [Cinema Review: Erra Mallelu]. Sitara. Archived from the original on 29 January 2023. Retrieved 3 June 2022.

. 3.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]