మగధ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు
Luckas-bot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: uk:Магадха |
చి యంత్రము కలుపుతున్నది: id:Magadha |
||
పంక్తి 172: | పంక్తి 172: | ||
[[fr:Magadha]] |
[[fr:Magadha]] |
||
[[hu:Magadha]] |
[[hu:Magadha]] |
||
[[id:Magadha]] |
|||
[[it:Regno Magadha]] |
[[it:Regno Magadha]] |
||
[[ja:マガダ国]] |
[[ja:マガダ国]] |
15:11, 1 జూలై 2010 నాటి కూర్పు
మగధ (ఆంగ్లం :Magadha) (సంస్కృతం : मगध ) ప్రాచీన భారతదేశానికి చెందిన పదహారు మహాజనపదాలలో ఒకటి. ఈ రాజ్యము బీహారు మరియు గంగానదికి దక్షిణాన గల ప్రాంతాలలో వ్యాపించి యుండేది; దీని మొదటి రాజధాని రాజగృహ (నవీన రాజగిరి) తరువాత పాటలీపుత్ర (నవీన పాట్నా). మగధ సామ్రాజ్యం లిచ్ఛవి మరియు అంగ సామ్రాజ్యాలను జయించడం వలన బీహార్ నుండి బెంగాల్ వరకూ మరియు ఉత్తరప్రదేశ్ వరకునూ వ్యాపించింది.[1] ప్రాచీన మగధ సామ్రాజ్యం గురించి రామాయణం, మహాభారతం మరియు పురాణాలలో ప్రస్తావింపబడినది. బౌద్ధ మరియు జైన మత గ్రంధాలలో ఎక్కువగా ప్రస్తావింపబడినది. మొదటి సారిగా మగధ ప్రస్తావన అధర్వణ వేదం లో వున్నది. అంగ, గాంధారులు, మరియు ముజావత్ లను ప్రస్తావించినచోటే మగధనూ ప్రస్తావించడం జరిగినది. భారతదేశానికి చెందిన రెండు ప్రధాన సామ్రాజ్యాలైన మౌర్య సామ్రాజ్యము మరియు గుప్త సామ్రాజ్యము ఈ మగధ ప్రాంతంనుండే ఉద్భవించాయి. ఈ సామ్రాజ్యాల కాలంలో భారతదేశం శాస్త్ర రంగాలలో, గణితము, ఖగోళ శాస్త్రము, మతము, మరియు తత్వము మున్నగు రంగాలలో ముందంజవేసింది. ఈ కాలానికి "స్వర్ణయుగం" అని పేరు.
భౌగోళికం
మగధ సామ్రాజ్యాలు
వంశాలు : బృహద్రథ వంశం, ప్రద్యోత వంశం, శిశునాగ వంశం, (క్రీ.పూ 684 - 424 ), నంద వంశం, మౌర్య వంశం, సుంగ వంశం, కాణ్వ వంశం, గుప్త వంశం.
16 మహా జనపాదలలో, మగధ జనపదం, అశోకుని కాలంలో ఉత్థాన దశకు చేరుకున్నది.
బృహద్రథ సామ్రాజ్యం
ప్రద్యోత సామ్రాజ్యం
శిశునాగ సామ్రాజ్యం
నంద సామ్రాజ్యం
The నంద వంశ స్థాపకుడు, శిశునాగ వంశానికి చెందిన మహానందిన్ కుమారుడు మహాపద్మ నంద. ఇతను తన 88వ యేట మరణించాడు. నందవంశం తరువాత మౌర్య వంశం రాజ్యం స్థాపించింది.
మౌర్య సామ్రాజ్యం
సుంగ సామ్రాజ్యం
కాణ్వ సామ్రాజ్యం
గుప్త సామ్రాజ్యం
మగధ రాజులు
బృహద్రథ వంశము
పురాణాలలో కానవచ్చే రాజ్యాలు మరియు రాజులు.
- బృహద్రథుడు
- జరాసంధుడు
- సహదేవ
- సోమాపి (1678-1618 BC)
- శ్రుతశ్రావుడు (1618-1551 BC)
- ఆయుతాయుశుడు (1551-1515 BC)
- నిరామిత్రుడు (1515-1415 BC)
- సుక్షత్ర (1415-1407 BC)
- బృహత్కర్మణ్య (1407-1384 BC)
- సేనాజిత (1384-1361 BC)
- శ్రుతంజయ (1361-1321 BC)
- విప్రుడు (1321-1296 BC)
- శుచి (1296-1238 BC)
- క్షేమ్య (1238-1210 BC)
- సుబ్రత (1210-1150 BC)
- ధర్మ (1150-1145 BC)
- శుశుమ (1145-1107 BC)
- దృఢసేన (1107-1059 BC)
- సుమతి (1059-1026 BC)
- శుభల (1026-1004 BC)
- సునీత (1004-964 BC)
- సత్యజిత్ (964-884 BC)
- బిస్వజిత్ (884-849 BC)
- రుపుంజయ (849-799 BC)
ప్రద్యోత వంశము
వాయు పురాణం అనుసారం క్రీ.పూ. 799-684 పాలించిన సామ్రాజ్యం.
- ప్రద్యోత
- పాలక
- వైశాఖయుప
- అజక
- వర్తివర్ధన
హరియాంక వంశం (క్రీ.పూ. 545 - 346 ) మరియు శిశునాగ వంశం (క్రీ.పూ. 430-364)
- బింబిసారుడు (క్రీ.పూ. 545-493 ), మొదటి మగధ సామ్రాజ్య స్థాపకుడు. [2][3]
- అజాతశత్రు (493-461 BC)
- దర్శక (from 461 BC)
- ఉదాయిన్
- శిశునాగ (క్రీ.పూ. 430), మగధ రాజ్యాన్ని స్థాపించాడు.
- కాకవర్ణ (394-364 BC)
- క్షేమధర్మన్ (618-582 BC)
- క్షత్రాజ (582-558 BC)
- నందివర్ధన
- మహా నందిన్ (క్రీ.పూ. 424 వరకు), ఇతని సామ్రాజ్యం ఇతని కుమారుడు మహాపద్మ నందుడికి సంక్రమించింది.
నంద వంశం (424-321 BC)
- మహాపద్మ నంద (క్రీ.పూ. 424 ), మహా నందిన్ కుమారుడు, నంద సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
- పంఢూక
- పంఘుపతి
- భూతపాల
- రాష్ట్రపాల
- గోవిషంక
- దశసిద్ధక
- కైవర్త
- ధన (అగ్రమ్మెస్, క్జాండ్రమ్మెస్) (క్రీ.పూ. 321 వరకు), చంద్రగుప్త మౌర్యుడు ఇతడిని ఓడించి, సామ్రాజ్యాన్ని తన ఆధీనంలో తీసుకున్నాడు.
మౌర్య సామ్రాజ్యం (324-184 BC)
- చంద్రగుప్త మౌర్యుడు (సంద్రకొత్తోసు) (క్రీ.పూ. 324-301 ), నంద సామ్రాజ్యం మరియు మెసిడోనియన్ సెల్యూకిడ్ సామ్రాజ్యాలను ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
- బిందుసారుడు (301-273 BC)
- అశోక వర్ధనుడు (అశోకుడు) (క్రీ.పూ. 273-232), భారతదేశ చరిత్రలో ఓ గొప్ప చక్రవర్తి. భారత ఏకీకరణ చేసిన మొదటివాడు (after conquering most of దక్షిణాసియా మరియు ఆఫ్ఘనిస్తాన్ లను జయించాడు. బౌద్ధ మతాన్ని అవలంబించాడు, జంతువుల హక్కులను ప్రవేశపెట్టాడు మరియు అహింసను ప్రోత్సహించాడు. ఒక సెక్యులర్ పాలకుడు, ఇతడికి అనేక సార్లు "అనేక తరాలకు రాజు"గా అభివర్ణిస్తారు.
- దశరథ (232-224 BC)
- సంప్రతి (224-215 BC)
- సాలీసుక (215-202 BC)
- దేవవర్మన్ (202-195 BC)
- శతధన్వాన్ (195-187 BC), ఇతడి కాలంలో మౌర్య సామ్రాజ్యం కుంచించుకు పోయినది.
- బృహద్రథ (187-184 BC), పుష్యమిత్ర సుంగ చే హత్య గావింపబడ్డాడు.
సుంగ వంశం (క్రీ.పూ. 185-73)
- పుష్యమిత్ర సుంగ (185-149 BC), బృహద్రథుడిని చంపి తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
- అగ్నిమిత్ర (149-141 BC), పుష్యమిత్రుని కుమారుడు మరియు వారసుడు
- వసుజ్యేష్ట (141-131 BC)
- వసుమిత్ర (131-124 BC)
- ఆంధ్రాక (124-122 BC)
- పులిందక (122-119 BC)
- ఘోష
- వజ్రమిత్ర
- భాగభద్ర, పురాణాలు పురాణాలలో ప్రస్తావింపబడినవాడు
- దేవభూతి (క్రీ.పూ. 83-73), సుంగ రాజులలో ఆఖరివాడు.
కాణ్వ వంశం (క్రీ.పూ. 73-26)
- వసుదేవ (క్రీ.పూ. 73 నుండి)
- వసుదేవుని వారసులు (క్రీ.పూ. 26 వరకు)
గుప్త సామ్రాజ్యం (క్రీ.శ. 240-550)
- శ్రీగుప్తుడు I (క్రీ.శ. 240-290)
- ఘటోత్కచుడు (290-305)
- మొదటి చంద్రగుప్తుడు (305-335), గుప్త సామ్రాజ్య స్థాపకుడు, ఇతడి కాలానికి భారతీయ సంస్కృతిలోస్వర్ణయుగం అనిపేరు.
- సముద్ర గుప్తుడు (335-370)
- రామగుప్తుడు (370-375)
- రెండవ చంద్రగుప్తుడు (చంద్రగుప్త విక్రమాదిత్యుడు) (375-415), సముద్రగుప్తుని కుమారుడు, ఇతని కాలంలో గుప్తసామ్రాజ్యం తన ఉచ్చ స్థానానికి చేరుకున్నది. ఇతడి కాలంలో చైనా]] యాత్రికుడు ఫాహియాన్ భారత్ ను సందర్శించాడు.
- మొదటి కుమారగుప్తుడు (415-455)
- స్కంద గుప్తుడు (455-467)
- రెండవ కుమార గుప్తుడు (467-477)
- బుద్ధ గుప్తుడు (477-496)
- మూడవ చంద్రగుప్తుడు (496-500)
- వైణ్య గుప్తుడు (500-515)
- నరసింహ గుప్తుడు (510-530)
- మూడవ కుమార గుప్తుడు (530-540)
- విష్ణు గుప్తుడు (c. 540-550)
మూలాలు
- ↑ Ramesh Chandra Majumdar (1977). Ancient India. Motilal Banarsidass Publ. ISBN 8120804368.
- ↑ Rawlinson, Hugh George. (1950) A Concise History of the Indian People, Oxford University Press. p. 46.
- ↑ Muller, F. Max. (2001) The Dhammapada And Sutta-nipata, Routledge (UK). p. xlvii. ISBN 0-7007-1548-7.