వికీపీడియా నుండి
భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం : Indian National Congress-I) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ. దీనిని 1885 లో దాదాభాయ్ నౌరోజీ, దిన్షా వాచా, వుమేష్ చంద్ర బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, మొనొమోహన్ ఘోష్, ఏ.వో. హ్యూమ్, మరియు విలియం వెడ్డర్బర్న్ మున్నగు వారు కలిసి స్థాపించారు. ఈ పార్టీ భారత స్వాతంత్ర్య ఉద్యమం నకు ప్రాతినిధ్యం వహించింది. దాదాపు ఒకటిన్నర కోట్లమంది సభ్యులతో, ఏడుకోట్లమంది ఉద్యమకారులతో బ్రిటిష్ రాజ్ ను ఎదిరించి పోరాడింది. స్వాతంత్ర్యం తరువాత, ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. [1].
కాంగ్రెస్ పార్టీ చరిత్రను రెండు కాలాలకు విభజించవచ్చును.
- స్వాతంత్ర్యానికి పూర్వం
- స్వాతంత్ర్యం తరువాత.
[మార్చు] ఇవీ చూడండి