భారత జాతీయ కాంగ్రేసు

వికీపీడియా నుండి
భారత జాతీయ కాంగ్రేసు - ఐ (ఇందిరా కాంగ్రేసు)
పార్టీ చిహ్నము
నాయకత్వము సోనియా గాంధీ
స్థాపితము 1885
ముఖ్య కార్యాలయము 24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011
కూటమి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్
సిద్ధాంతము సామ్యవాద ప్రజాతంత్రము/జనాదారణ
ప్రచురణలు కాంగ్రేస్ సందేశ్
వెబ్ సైట్ కాంగ్రేస్.ఆర్గ్.ఇన్
చూడండి భారత రాజకీయ వ్యవస్థ

భారతదేశ రాజకీయ పార్టీలు

భారతదేశంలో ఎన్నికలు

భారత జాతీయ కాంగ్రెస్ - ఐ (ఇందిరా కాంగ్రేసు) (ఆంగ్లం : Indian National Congress-I) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ. దీనిని 1885 లో దాదాభాయ్ నౌరోజీ, దిన్‌షా వాచా, వుమేష్ చంద్ర బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, మొనొమోహన్ ఘోష్, ఏ.వో. హ్యూమ్, మరియు విలియం వెడ్డర్‌బర్న్ మున్నగు వారు కలిసి స్థాపించారు. ఈ పార్టీ భారత స్వాతంత్ర్య ఉద్యమం నకు ప్రాతినిధ్యం వహించింది. దాదాపు ఒకటిన్నర కోట్లమంది సభ్యులతో, ఏడుకోట్లమంది ఉద్యమకారులతో బ్రిటిష్ రాజ్ ను ఎదిరించి పోరాడింది. స్వాతంత్ర్యం తరువాత, ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. [1].

చరిత్ర [మార్చు]

కాంగ్రెస్ పార్టీ చరిత్రను రెండు కాలాలకు విభజించవచ్చును.

  • స్వాతంత్ర్యానికి పూర్వం
  • స్వాతంత్ర్యం తరువాత.
దస్త్రం:Image delegates INC1885.jpg
1885, డిసెంబరు 28-31, బాంబే నగరమందు, మొదటి సమావేశం సమయాన తీసిన ఫోటో.

ఇవీ చూడండి [మార్చు]