కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | |||
![]() కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | |||
పదవీ కాలం 2018 - 2022 ఆగస్టు 2 | |||
నియోజకవర్గం | మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం | ||
---|---|---|---|
తెలంగాణ శాసన మండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 2016-2018 | |||
పదవీ కాలం 2009 - 2014 | |||
తరువాత | బూర నర్సయ్య గౌడ్ | ||
నియోజకవర్గం | భువనగిరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బ్రాహ్మణవెల్లెంల, నల్లగొండ జిల్లా, తెలంగాణ | 1967 జూన్ 1||
రాజకీయ పార్టీ | ![]() | ||
ఇతర రాజకీయ పార్టీలు | ![]() | ||
తల్లిదండ్రులు | పాపిరెడ్డి - సుశీలమ్మ | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీ | ||
సంతానం | ఒక కుమారుడు | ||
వెబ్సైటు | www.krgreddy.com |
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి శానససభ్యుడిగా ఉన్నాడు.[1][2] శాసన మండలి సభ్యుడిగా, భువనగిరి లోకసభ నియోజకవర్గం నుండి 15వ లోక్ సభ (2009-2014) సభ్యుడిగా పనిచేశాడు.[3]
జననం - చదువు[మార్చు]
రాజగోపాల్ రెడ్డి 1967, జూన్ 1న పాపిరెడ్డి - సుశీలమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లాలోని బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో జన్మించాడు.[4] ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. పట్టా పొందాడు. రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం భువనగిరి లోకసభ ఎంపిగా ఉన్నాడు.
వివాహం[మార్చు]
రాజగోపాల్ రెడ్డికి 1994, ఆగస్టు 20న లక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.
ప్రవృత్తి[మార్చు]
వ్యాపారవేత్తగా ప్రసిద్ధి పొందాడు. ఆ సమయంలోనే అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించాడు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాలు, నేత్ర శిబిరాలు నిర్వహించాడు.
రాజకీయరంగం[మార్చు]
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 2009లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటి చేసి భారత కమ్యునిస్టు పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] తరువాత 2016 నుండి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటిచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6] ఆయన 2022 ఆగస్టు 2న కాంగ్రెస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.[7]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 21న మునుగోడులో జరిగిన ఆత్మగౌరవ సభలో కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[8]
పదవులు[మార్చు]
- 31.08.2009 - 2014: నీటి వనరులపై కమిటీ సభ్యుడు
- 04.05.2017 - 17.12.2018: టేబుల్ పేపర్స్ కమిటీ చైర్మన్, తెలంగాణ శాసనమండలి.
ఇతర వివరాలు[మార్చు]
చైనా, ఈజిప్ట్, జెర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, మలేసియా, శ్రీలంక, సింగపూర్, యు.ఎస్.ఏ. మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు[మార్చు]
- ↑ "లోకసభ జాలగూడు". Archived from the original on 2013-02-01. Retrieved 2014-01-19.
- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ "Ugly scenes at martyrs meeting - Today's Paper". The Hindu. 2010-11-15. Retrieved 2016-12-01.
- ↑ "Komatireddy Rajgopal Reddy | MLA | Munugode | Congress | Nalgonda". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-07-28. Retrieved 2021-10-29.
- ↑ "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2021-10-29.
- ↑ "Komatireddy Rajgopal Reddy(Indian National Congress(INC)):Constituency- MUNUGODE(NALGONDA) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-10-29.
- ↑ Sakshi (3 August 2022). "కాంగ్రెస్కు రాజగోపాల్రెడ్డి గుడ్బై!". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
- ↑ 10TV Telugu (21 August 2022). "బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి..కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అమిత్ షా". Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- 1967 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- 15వ లోక్సభ సభ్యులు
- తెలంగాణ పారిశ్రామికవేత్తలు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు
- నల్గొండ జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- యాదాద్రి భువనగిరి జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు
- నల్గొండ జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- నల్గొండ జిల్లా వ్యాపారవేత్తలు
- తెలంగాణ శాసన సభ్యులు (2018)