పూసలపాడు (బెస్తవారిపేట)
పూసలపాడు | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°30′04″N 79°05′49″E / 15.501°N 79.097°ECoordinates: 15°30′04″N 79°05′49″E / 15.501°N 79.097°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | బేస్తవారిపేట మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,512 హె. (6,207 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 5,466 |
• సాంద్రత | 220/కి.మీ2 (560/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08406 ![]() |
పిన్(PIN) | 523334 ![]() |
పూసలపాడు, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్:523 334. ఎస్.టి.డి.కోడ్:08406.
గ్రామచరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
ఈ గ్రామం బెస్తవారిపేట నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సమీప గ్రామాలు[మార్చు]
సోమిదేవిపల్లి 3 కి.మీ, మోక్షగుండం 4 కి.మీ, పిట్టికాయగుళ్ల 6 కి.మీ, నేకనాంబాదు 7 కి.మీ, దర్గా 8 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన కంభం మండలం, పడమరన రాచర్ల మండలం, పడమరన గిద్దలూరు మండలం, దక్షణాన కొమరోలు మండలం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు.
శ్రీ పెద్దమ్మ దేవస్థానం[మార్చు]
ఈ గ్రామంలో నూతనంగా శ్రీ పెద్దమ్మ దేవస్థానం నిర్మాణం పూర్తయినది.
శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]
పూసలపాడు బస్సుస్టాండువద్ద, నూతనంగా నిర్మించిన ఈ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, ఆలయంలో పూజలు నిర్వహించారు. గణపతి, విగ్రహపూజలు, జలాధివాసం, సుందరకాండ పారాయణం, పుష్పాధివాసం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.
శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]
ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించినారు. దేవతామూర్తుల విగ్రహాల వద్ద గణపతి పూజ, జలాధివాసం, హోమాలు, ధాన్యాదివాసం చేపట్టినారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో అంగరంగ వైభవంగా పోలేరమ్మ, పోతురాజుల విగ్రహాలను ప్రతిష్ఠించినారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయం క్రిక్కిరిసి పోయినది. అలయ కమిటీ, గ్రామపెద్దల ఆధ్వర్యంలొ అన్నప్రసాద వితరణ నిర్వహించినారు.
శ్రీ మడియాలస్వామివారి ఆలయం[మార్చు]
పూసలపాడులో మడియాలస్వామి తిరునాళ్ళు, నిర్వహించారు. భక్తులు బోనాలు, కుంకుమబండ్లు కట్టినారు. గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బస్సుస్టాండు సమీపంలోని ఆలయం వద్ద స్వామికి విశేషపూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకాలు, అభిషేకాలు కుంకుమార్చనలు నిర్వహించారు.
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 5,466 - పురుషుల సంఖ్య 2,852 - స్త్రీల సంఖ్య 2,614 - గృహాల సంఖ్య 1,402;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,794.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,009, మహిళల సంఖ్య 2,785, గ్రామంలో నివాస గృహాలు 1,269 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,512 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]