దివాకర్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దివాకర బాబు మాడభూషి
దివాకర్ బాబు
జననం1951
గుంటూరు జిల్లా
ప్రసిద్ధిరంగస్థల, సినిమా రచయిత

దివాకర్ బాబు రంగస్థల, సినిమా రచయిత. 100 కి పైగా సినిమాలకు రచయితగా పనిచేశాడు. శుభలగ్నం, యమలీల, ఘటోత్కచుడు, మావిచిగురు, చూడాలనివుంది, ఆహ్వానం, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు వంటి సూపర్‌హిట్ సినిమాలకు మాటలందించాడు.

జననం[మార్చు]

దివాకర్ బాబు 1951 లో తాడేపల్లిగూడెంలో జన్మించారు. గుంటూరులో పెరిగారు. ఈయన తండ్రి కూడా నాటకరంగంలో పనిచేశారు. వీరి తాత, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కూడా రచనా వ్యాసంగంలో ఉన్నారు.[1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే అభిమానం ఉండేది. దివాకర బాబు ముందు కరూర్ వైశ్యా బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగం చేస్తూనే నాటకాలు రాయడం, పరిషత్తు పోటీల్లో పాల్గొనడం, ప్రదర్శనలు ఇవ్వడం చేసేవారు. అసురగణం, ఎవ్వనిచే జనించు, పుటుక్కు జరజర డుబుక్కుమే, కుందేటికొమ్ము మొదలైన నాటికలు... రసరాజ్యం వంటి నాటకాలు రచించారు.

మద్రాసు వెళ్ళి దర్శకుడు రేలంగి నరసింహారావును కలిసి, ఒక కథ చెప్పారు. అది ఆయనకు నచ్చి దాన్ని అభివృద్ధి చేసి మద్రాసుకు వచ్చేయమన్నారు. అలా కొంటెకాపురం సినిమాతో సినిమా రచయిత అయ్యారు. తర్వాత మన్మధ లీల – కామరాజు గోల, డబ్బెవరికి చేదు లాంటి చిత్రాలకు మాటలు రాశాడు. మెల్లగా సినిమా అవకాశాలు పెరగడంతో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. రేలంగి నరసింహారావు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్టారెడ్డి, ముత్యాల సుబ్బయ్య, రవిరాజ పినిశెట్టి, గుణశేఖర్ వంటి దర్శకులతో పనిచేశారు.

ఆయన తనయుడు శ్రీకర్ బాబు కూడా సినిమా రంగంలోకి ప్రవేశించాడు.[2]

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Diwakarbabu: తొలి సినిమాకే నా పేరు లేదు: సినీ రచయిత దివాకర్‌బాబు". EENADU. Retrieved 2022-04-04.
  2. "Writer Divakar Babu Son Turns Director". andhravilas.net. ఆంధ్రా విలాస్. Archived from the original on 2016-11-16. Retrieved 18 November 2016.

బయటి లింకులు[మార్చు]