Coordinates: 16°29′19″N 77°48′23″E / 16.488651°N 77.806351°E / 16.488651; 77.806351

అప్పంపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అప్పంపల్లి తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, కౌకుంట్ల మండలం లోని గ్రామం.[1]

అప్పంపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
అప్పంపల్లి is located in తెలంగాణ
అప్పంపల్లి
అప్పంపల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°29′19″N 77°48′23″E / 16.488651°N 77.806351°E / 16.488651; 77.806351
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం కౌకుంట్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,476
 - పురుషుల సంఖ్య 1,243
 - స్త్రీల సంఖ్య 1,233
 - గృహాల సంఖ్య 542
పిన్ కోడ్ 509110
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన చిన్నచింతకుంట నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గద్వాల నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 542 ఇళ్లతో, 2476 జనాభాతో 953 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1243, ఆడవారి సంఖ్య 1233. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 133 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 3. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 575822[3].పిన్ కోడ్: 509409.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి దేవరకద్రలో ఉంది.సమీప జూనియర్ కళాశాల చిన్నచింతకుంటలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గద్వాలలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల మహబూబ్ నగర్లోను, పాలీటెక్నిక్ గద్వాలలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల గద్వాలలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు మహబూబ్ నగర్లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

అప్పంపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

అప్పంపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 96 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 857 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 857 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

అప్పంపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 367 హెక్టార్లు* చెరువులు: 283 హెక్టార్లు* వాటర్‌షెడ్ కింద: 206 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

అప్పంపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, రాగులు

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బీడీలు

రాజకీయాలు[మార్చు]

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యాడు.[4]

అప్పంపల్లి సంఘటన[మార్చు]

తెలంగాణ విమోచనోద్యమంలో ఈ గ్రామం జిల్లాలోనే ప్రముఖ పాత్ర వహించింది. ఈ గ్రామవాసులు అప్పటి నిజాం సైనికులను కూడా గడగడలాడించారు. నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడి అనేక మంది అమరులైనారు. వీరి స్మారకార్థం గ్రామంలో స్మారకస్థూపం కూడా నిర్మించారు.

భారతదేశానికి బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించిననూ తెలంగాణ ప్రజలు ఇంకనూ నిజాం నియంతృత్వ పాలనలో ఉన్నారు. 3 బాషా ప్రాంతాలుగా మొత్తం 16 జిల్లాలుగా ఉన్న నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి జరిగిన పోరాటమే తెలంగాణ విమోచనోద్యమం. తెలంగాణ విమోచనోద్యమం కోసం మహబూబ్ నగర్ జిల్లాలోనే అప్పంపల్లి సంఘటన అగ్రస్థానంలో నిలిచింది.[5] ఉద్యమ సమయంలో అప్పంపల్లి గ్రామంలో 1947, అక్టోబరు 7న జరిగిన పరిణామాలే అప్పంపల్లి సంఘటన గా చరిత్రలో నిలిచిపోయింది. ఆ రోజు ఆత్మకూరు, అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో తెలంగాణను భారతదేశంలో విలీనం చేయాలని బెల్లం నాగన్న నాయకత్వంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత, నర్వ తదితర గ్రామాలకు చెందిన రెండువేల ఉద్యమకారులు తెలంగాణ విమోచన కొరకు సత్యాగ్రహం చేశారు. ఈ సత్యాగ్రహాన్ని అణచివేయడానికి నిజాం సైనికులకు చేతకాలేదు. మహబూబ్ నగర్ నుంచి రిజర్వ్‌డ్ దళాలను రప్పించి సైనిక చర్య జరిపారు. బెల్లంనాగన్నతో పాటు, బలరాం గౌడు, నాగిరెడ్డి, తెలుగు ఆశన్న, రామచంద్రారెడ్డి, బుచ్చారెడ్డి[6] లను అరెస్టు చేయాలని నిజాం సైనికులు నిర్ణయించిననూ ప్రజలు ప్రతిఘటించడంతో తోకముడిచారు. ప్రజల్లో కటిక నాన్నమ్మ (నాగమ్మ) అనే మహిళ కారం పొడితో తిరుగబడింది. ఆ సాయంత్రం ఉద్యమకారులపై కాల్పులు జరిపడంతో 11 మంది ఉద్యమకారులు మరణించారు. వీరిలో మొదటి వీర మరణం చాకలి కుర్మన్నది. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.[7] అదే సమయంలో నెల్లికొండికి చెందిన కుక్కుల కిష్టన్న తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి తన ఘనకార్యాన్ని చాటి చెప్పాడు. అప్పటి తాలుకా గిర్దావర్, పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఇతన్ని అరెస్టు చేసి తీసుకువెళ్తుండగా ప్రజల ప్రతిఘటనకు భయపడి కిష్టన్నను వదిలి పారిపోయారు.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

కుక్కల కిష్టన్న:తెలంగాణ విమోచనోద్యమంలో అప్పంపల్లి సంఘటనగా పేరు పొందిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కిష్టన్న జైలుకు కూడా వెళ్ళినాడు. 1947. అక్టోబరు 7న అప్పంపల్లిలో విమోచనోద్యమానికి నాయకత్వం వహించి నిజాం సైనికులకు ముప్పుతిప్పలు పెట్టాడు. పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఏకం చేసి ఉద్యమాన్ని నిర్వహించి నిజాం పాలకులను గడగడలాడించాడు. జైలుశిక్ష కూడా పొందిన కిష్టన్న 1982లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013
  5. ఆంధ్రజ్యోతి దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2009
  6. ఆంధ్రజ్యోతి, ఈ- దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది: 06..03.2014
  7. సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 11, తేది 17.09.2008

వెలుపలి లింకులు[మార్చు]