Coordinates: 16°10′11″N 80°53′00″E / 16.169649°N 80.883437°E / 16.169649; 80.883437

చినకళ్ళేపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చినకళ్ళేపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
చినకళ్ళేపల్లి is located in Andhra Pradesh
చినకళ్ళేపల్లి
చినకళ్ళేపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°10′11″N 80°53′00″E / 16.169649°N 80.883437°E / 16.169649; 80.883437
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ గుత్తికొండ రామారావు గారు (రాము)
జనాభా (2011)
 - మొత్తం 1,244
 - పురుషులు 616
 - స్త్రీలు 628
 - గృహాల సంఖ్య 394
పిన్ కోడ్ 521132
ఎస్.టి.డి కోడ్ 08671

చినకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఘంటసాల నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 394 ఇళ్లతో, 1244 జనాభాతో 326 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 616, ఆడవారి సంఖ్య 628. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 610 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 143. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589704[1].సముద్రమట్టానికి 11 మీ.ఎత్తులో ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి ఘంటసాలలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మొవ్వలోను, ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ మచిలీపట్నంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఘంటసాలలోను, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

చిన కల్లేపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

చిన కల్లేపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 60 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 265 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 265 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

చిన కల్లేపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 265 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

చిన కల్లేపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

అంగనవాడీ కేంద్రం:- ఈ గ్రామానికి చెందిన శ్రీ గుత్తికొండ గోపాలరావు, కోకిలాంబ దంపతులు, ఈ కేంద్రానికి మూడు సెంట్ల స్థలాన్ని వితరణగా అందించారు. [11]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామ పంచాయతీకి 2021 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో గుత్తికొండ రామారావు సర్పంచిగా గెలుపొందాడు. సంధోలు సత్యం, ఉపసర్పంచిగా ఎన్నికైనాడు. [2]
  2. 2014, ఆగస్టు-23వ తేదీన, ఈ గ్రామ పంచాయతీ 55వ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నది. [5]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ మందిరం[మార్చు]

వైశాఖ బహుళ పంచమి సందర్భంగా ఇక్కడ, 2014, మే-19, సోమవారం నాడు, ప్రత్యేక పూజలు చేసారు. ఒక ఆధ్యాత్మికరంగ కార్యక్రమం నిర్వహించారు. [3]

శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సహిత శ్రీ కోదండ రామాలయం[మార్చు]

గ్రామంలోని ఈ చిన్న ఆలయం, శిథిలావస్థకు చేరడంతో, దాత శ్రీమతి పొదిలి సరళాదేవి మరియూ వారి కుటుంబసభ్యులు, పునర్నిర్మాణం చేసారు. ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు, శ్రీ కోదండరామ, సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి వారల రాతి విగ్రహాలను, 2014 లో ఉచితంగా అందజేసినారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, ఏప్రిల్-2014లో విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఇపుడు తి.తి.దేవస్థానం వారు, కళ్యాణం, ఉత్సవాల సందర్భాలలో ఉపయోగించుటకై, శ్రీ కోదండరామ, సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి వారల పంచలోహ విగ్రహాలను 90% రాయితీతో అందజేసినారు. ఈ పంచలోహ విగ్రహాలను శ్రీరామనవమి సందర్భంగా, 2015, మార్చ్-28వ తేదీ శనివారం నాడు, సంప్రోక్షణచేసి, శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించెదరు. [8]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గొట్టిపాటి బ్రహ్మయ్యస్వాతంత్ర్య సమర యోధుడు.
  • గొట్టిపాటి బ్రహ్మయ్య: (1889-1984) రైతు పెద్ద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్.అను బిరుదులతో పేరు పొందిన స్వాతంత్ర్య సమర యోధుడు. ఆయన కృష్ణా జిల్లాలోని చినకళ్ళేపల్లి లో3.12.1889 న జన్మించారు. 1917లో, యుక్తవయసులోనే ఆయన గ్రంథాలయోద్యమము, వయోజన విద్యలపై దృష్టి సారించారు. జూలై 25, 1964 నుండి జూన్ 30, 1968 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షునిగా పనిచేసారు.
  • గీతామాత గుత్తికొండ కోకిలాంబ:ప్రముఖ సంఘసేవకురాలు, రెడ్ క్రాస్ మండల కార్యదర్శి.ఈమె వైజ్ మెన్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఎంపికైనారు. మదర్ థెరెస్సా పురస్కార గ్రహీత, రెడ్ క్రాస్ సొసైటీ మండల కార్యదర్శిగా, పలు సామాజికసేవలు అందిస్తున్నందుకు వీరిని ఈ పదవికి ఎంపికచేసారు. [4] తిరుపతికి చెందిన స్నేహా ఆర్ట్స్ ఎకాడమీ సంస్థవారి రాష్ట్రస్థాయి "సేవావసంతం" పురస్కారానికి ఎంపికైనారు. సామాజిక రంగాలలో విశిష్ట సేవలందించుచున్నందుకు, ఈ సంస్థవారు, రాష్ట్రవ్యాప్తంగా 15 మంది సంఘసేవకులకు ఈ పురస్కారాన్ని అందజేయగా, జిల్లా నుండి కోకిలాంబను ఎంపిక చేసారు. కోకిలాంబను చినకళ్ళేపలి గ్రామంలో, 2014, ఆగస్టు-31న, సన్మానించి, హైదరాబాదుకు చెందిన ఆల్ ది బెస్ట్ అకాడమీ డైరెక్టరు అయిన శ్రీ వి.ఎస్.ఎస్.నారాయణ, "సేవావసంతం" పురస్కారాన్ని అందజేసారు. [6] రాష్ట్రస్థాయి సేవాపురస్కారానికి ఎంపిక అయినారు. హైదరాబాదు నగరానికి చెందిన రూపిక ఆర్ట్స్ ఎకాడమీ అను సంస్థవారు, రాష్ట్రంలో సామాజికవిద్య, సాహిత్యం తదితర అంశాలలో సెవలందిస్తున్న పదిమంది ప్రముఖులను ఈ పురస్కారానికి ఎంపికచేయగా, ఆ పదిమందిలో వీరు ఒకరు. వీరికి ఈ పురస్కారాన్ని, త్వరలో హైదరాబాదులో అందజేసెదరు. [9] వైజ్ మన్ క్లబ్ కృష్ణా జిల్లా గ్రామీణ ఉత్తమ డైరెక్టరుగా ఎంపికైనారు. [10] వైజ్ మన్ క్లబ్ జిల్లా గ్రామీణ డైరెక్టరుగా, రెడ్ క్రాస్ మండల కార్యదర్శిగా పలు సామజికసేవలు అందించుచున్నందుకు, వీరిని ఇందిరాగాంధీ జాతీయ సద్భావనా పురస్కారానికి ఎంపికచేసారు. ఈమెను మహిళ విభాగంలో రాష్టంనుండి ఈ పురస్కారానికి ఎంపికచేసారు. [12] 2016, నవంబరు-30న, హైదరాబాదులోని రవీంద్రభారతిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నరు అయిన కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా భారత మహిళాజ్యోతి పురస్కారాన్ని అందజేసినారు. వైజ్ మెన్ క్లబ్ జిల్లా గ్రామీణ కార్యదర్శిగానూ మరియూ రెడ్ క్రాస్ మండల కార్యదర్శి గానూ వీరు చేయుచున్న పలున్ సామాజిక కార్యక్రమాలను గుర్తించిన హైదరాబాదులోని ఆల్ ది బెస్ట్ ఎకాడమీ అను సంస్థ వారు, వీరిని కృష్ణా జిల్లా నుండి ఎంపిక చేసారు. [13]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో అయినపూడి విజయకుమార్ అను ఒక ఆదర్శరైతు ఉన్నారు. ఇతను వ్యవసాయంలో రసాయనిక మందులు వాడితే ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని తెలుసుకుని. 6 సంవత్సరాల నుండి, తన పొలంలో, మహారాష్ట్రకు చెందిన పాలేకర్ విధానంలో, గో ఆధారిత జీవామృతంతో, నాణ్యమైన వరిపంటను పండిస్తున్నాడు. [7]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1378. ఇందులో పురుషుల సంఖ్య 673, స్త్రీల సంఖ్య 705, గ్రామంలో నివాసగృహాలు 387 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 326 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, ఆగస్టు-3; 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, మే-20; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014, ఆగస్టు-20; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగస్టు-23; 1వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, సెప్టెంబరు-1; 1వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, డిసెంబరు-19; 3వపేజీ. [8] ది హిందు ఆంగ్ల దినపత్రిక; 2015, మార్చ్-28; 2వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూన్-11; 1వపేజీ. [10] ఈనాడు కృష్ణా; 2015, జూలై-1; 3వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-3; 44వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-22; 44వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2016, డిసెంబరు-1; 2వపేజీ.