Coordinates: 16°03′12″N 80°54′48″E / 16.053330°N 80.913299°E / 16.053330; 80.913299

పులిగడ్డ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పులిగడ్డ
—  రెవెన్యూ గ్రామం  —
పులిగడ్డ is located in Andhra Pradesh
పులిగడ్డ
పులిగడ్డ
అక్షాంశరేఖాంశాలు: 16°03′12″N 80°54′48″E / 16.053330°N 80.913299°E / 16.053330; 80.913299
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి మండలి లక్ష్మి
జనాభా (2011)
 - మొత్తం 3,350
 - పురుషులు 1,900
 - స్త్రీలు 1,450
 - గృహాల సంఖ్య 921
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08671

పులిగడ్డ, కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన అవనిగడ్డ నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రేపల్లె నుండి 7 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 921 ఇళ్లతో, 3350 జనాభాతో 1023 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1900, ఆడవారి సంఖ్య 1450. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 879 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 28. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589771[1].పిన్ కోడ్: 521130. సముద్రమట్టానికి 6 మీ.ఎత్తులో ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి అవనిగడ్డలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల అవనిగడ్డలోను, ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మచిలీపట్నంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చల్లపల్లిలోను, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

  • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, పల్లెపాలెం.
  • సి.బి.సి.ఎన్.సి.పాఠశాల, పాతకోట.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

పులిగడ్డలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పులిగడ్డలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జాతీయ రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

పులిగడ్డలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 549 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 8 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 4 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 26 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 42 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 99 హెక్టార్లు
  • బంజరు భూమి: 88 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 204 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 258 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 133 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

పులిగడ్డలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 12 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 121 హెక్టార్లు

దుర్గమ్మ చెరువు[మార్చు]

ప్రభుత్వ ఉపాధి హామీ పథకంలో భాగంగా, నీటి అవసరాలకోసం, భూగర్భ జలాల అభివృద్ధికోసం, ఈ చెరువులో, 2016, ఏప్రిల్-26వ తేదీనాడు, 1.7లక్షల రూపాయల అంచనా వ్యయంతో, పూడికతీత పనులు చేపట్టినారు. [19]

ఉత్పత్తి[మార్చు]

పులిగడ్డలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

కూరగాయలు, జామ, అరటి

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

ఇటుకలు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో అవనిగడ్డ, మోపిదేవి, మోపిదేవిలంక, మోదుమూడి, అశ్వారావుపాలెం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, భట్టిప్రోలు

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా మండలి లక్ష్మి 101 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉపసర్పంచిగా మురాల నాగశంకరరావు ఎన్నికైనారు. [2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:చోళరాజుల కాలంనాటి ఈ ఆలయంలో ఉగాది, దసరా, ధనుర్మాస ఉత్సవాలతోపాటు, స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుపుతారు. తిరుమల తరహాలో ఇక్కడ గూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కలియుగదైవం అయిన ఇక్కడి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొనడానికి, జిల్లా నలుమూలలనుండి భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ఆలయంలో నిర్మిస్తున్న నూతన రాజగోపురం, యాగశాల నిర్మాణం పూర్తయినది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రు.36.19 లక్షలు, గ్రామస్థుల విరాళం 6.25 లక్షల రూపాయలతో, నూతన రాజగోపురం, తలంబ్రాల కళ్యాణ మండపం, గర్భాలయ మరమ్మత్తు పనులు చేపట్టి పూర్తి చేశారు. నూతన రాజగోపురానికి శిల్పాలు అమర్చి, రంగులు దిద్దినారు. ఆలయం చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. [3]&[6]

నూతన రాజగోపురాన్ని 3 అంతస్తులతో నిర్మించారు. రాజగోపురంపై శిఖరాలతోపాటు వివిధ రకాల ఆకృతులు గలిగిన, శిల్పకళ ఉట్టిపడేలాగా శిల్పాలను అమర్చి రంగులు దిద్దినారు. ఆలయంలో నూతన తలంబ్రాల కళ్యాణమండపం నిర్మించి రంగులద్దినారు. ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మించి, ముందుభాగాన శిల్పాలను ఏర్పాటుచేసారు. చోళరాజుల కాలంనాటి ఈ ఆలయంలో ప్రతి శనివారం భక్తులు స్వామివారిని దర్శించుకొనడానికి బారులు తీరుతారు. ఆలయంలో ఉగాది ఉత్సవాలు పెద్దయెత్తున నిర్వహించడం ఆనవాయితీ. [16]

నూతన రాజగోపుర ప్రతిష్ఠా మహోత్సవాలు, 2016, ఫిబ్రవరి-23వ తేదీ మాఘ బహుళ పాడ్యమి మంగళవారం నుండి ప్రారంభించి, 25వ తేదీనాడు ప్రతిష్ఠించారు. 23వ తేదీ సాయంత్రం విష్వక్సేనపూజ, దీపారాధన, దీక్షా, మృత్య సంగ్రహణం, అంకురార్పణ, కర్పూర నీరాజనం, 24వ తేదీనాడు పంచగవ్యారాధన, పంచగవ్యప్రాశన, అగ్నిప్రతిష్ఠ, వాస్తుహోమం, 25వ తేదీనాడు అగ్నిగుండంలో ఉత్తహోమాలు, రత్నన్యాసం, యంత్రప్రతిష్ఠాపన, రాజగోపుర, ప్రతి శిఖర ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. [18]

గ్రామదేవత శ్రీ పోలాశమ్మ అమ్మవారి ఆలయం:పులిగడ్డ గ్రామంలో వేంచేసియున్న గ్రామదేవత శ్రీ పోలాశమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం (మే నెలలో) వైశాఖ శుక్ల పౌర్ణమి నుండి ప్రారంభం చేసెదరు. ఈ కార్యక్రమానికై ఆలయం ముంగిట, భక్తుల సౌకర్యార్ధం, చలువ పందిళ్ళు వేయుదురు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించెదరు. పౌర్ణమి రోజు ఉదయం 6 గంటలకు అమ్మవారు అఖండ నదీ స్నానానికి తరలి వెళ్ళెదరు. అనంతరం పోతురాజు సంబరం నిర్వహించెదరు. సాయంత్రం మూడు గంటల నుండి అమ్మవారికి గ్రామోత్సవం ప్రారంభించి, మరుసటిరోజు (బహుళ పాడ్యమి) కి అమ్మవారు ఆలయ ప్రవేశం అనంతరం గుడి సంబరం జరుపుతారు. అనంతరం ఆషాఢమాసంలో బహుళ పక్షంలో ఆదివారంనాడు, అమ్మవారి నెలసంబరం నిర్వహించెదరు. [4]&[12]

శ్రీ అంకమ్మ అమ్మవారి ఆలయం, గౌడపాలెం:పులిగడ్డ గ్రామ శివారు, గౌడపాలెంలో వేంచేసియున అంకమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు, 2015, మే నెల-10వతేదీ, ఆదివారంనాడు వైభవంగా ప్రారంభమైనవి. అమ్మవారి శిలాప్రతిమలను కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేయించి, మేళతాళాలతో ఆలయానికి తీసికొనివచ్చి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. సోమవారం నాడు, అమ్మవారికి నైవేద్యాలు, మొక్కుబడులు, గుడిసంబరాలు నిర్వహించెదరు. [10]

శ్రీ రామాలయం, పల్లెపాలెం:పులిగడ్డ గ్రామశివారు పల్లెపాలెంలోని మత్స్యకారుల కాలనీలో, శిథిలమైన పురాతన రామాలయం స్థానంలో నూతన ఆలయం నిర్మించడానికి గ్రామస్థులు ముందుకు వచ్చారు. 2016 జూలైలో రానున్న కృష్ణా పుష్కరాలలోగా నూతన ఆలయాన్ని ప్రారంభించే దిశగా ముందుకు సాగుచున్నారు. ఈ క్రమంలో, 2015, నవంబరు-13వ తేదీ శుక్రవారంనాడు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. [14]&[15]

శ్రీ కనకదుర్గాదేవి ఆలయం

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ చారిత్రిక విశేషాలు[మార్చు]

పురాతన ఎత్తిపోతల పథకo[మార్చు]

పులిగడ్డ గ్రామ శివారు పాతకోటలో, బ్రిటిషుకాలంలో 1904లో నిర్మించిన పురాతన ఎత్తిపోతల ప్రాచీన కట్టడం ఒకటి ఉంది. దివిసీమలో సాగునీరు అందించడం కోసం, బ్రిటిష్ పాలకులు కరవుకాలువను త్రవ్వి, ఎత్తిపోతలద్వారా కృష్ణానదిలోని నీటిని కాలువలోనికి మళ్ళించి, పంటలు పండించడానికి ఏర్పాటుచేసారు. నీటిని లిఫ్టు చేయడానికి వినియోగించడానికి ఉపయోగించిన ఇనుముగానీ, షట్టర్లుగానీ నేటికీ తుప్పుపట్టలేదంటే, నాటి ఇంజనీర్ల నైపుణ్యం, నాణ్యతా ప్రమాణాలు నేటి ఇంజనీర్లకు ఆదర్శవంతంగా ఉన్నాయి. 1936లో క్యాంప్ బెల్ ఆక్విడెక్ట్ నిర్మాణం తరువాత, ఈ ఎత్తిపోతల పథక వినియోగాన్ని నిలిపివేసినారు. [17]

ఇది పాతబడిపోయి, శిథిలమయ్యే ప్రమాదం ఉండటంతో, దీనిని పురావస్తు శాఖవారు తమ అధీనంలోనికి తీసుకొని, ఫిబ్రవరి-2014లో రు. 22.5 లక్షల వ్యయంతో ఈ కట్టడానికి పరిరక్షణ పనులు చేపట్టినారు. కట్టడం కుడి, ఎడమలలో పూడిక తీయించారు. కట్టడం షట్టర్లను తిరిగి పనిచేసే స్థితికి తెచ్చారు. కట్టడం చుట్టూ సిమెంటుదిమ్మలు పాతి, రంగులద్ది, ఫెన్సింగు వేసి, ముందుభాగంలో నాపరాయి పరచి, సందర్శకులు వీక్షించేటట్లుగా గేటును ఏర్పాటు చేసారు. ప్రస్తుతం గూడా ఈ పథకం పనిచేయడం విశేషం. కాలువలో నీరు ఎక్కువగా ఉండి, గట్లు తెగిపోయేటట్లుగా ఉంటే, దివి ప్రధాన కాలువకు ఉన్న షట్టరు తెరిచి, నీటిని కృష్ణానదిలోనికి వదలివేయడానికి, ఈ షట్టరును వినియోగించెదరు. ఇటువంటి అపురూపమైన కట్టడం, పురావస్తుశాఖవారు తమ ఆధీనంలోనికి తీసుకొని పరిరక్షించి, భావితరాలకు ఒక గొప్ప అపురూపమైన కట్టడంగా చూపించటానికి చేసిన ప్రయత్నం జిల్లాకే వన్నె తెచ్చే విధంగా ఉంది. [5]&[11]

క్యాంప్ బెల్ ఆక్విడక్ట్[మార్చు]

ఈ గ్రామంలో, 1936లో, దివిసీమకు నీరందించటానికి, నాటి పాలకులు కృష్ణా నదిపై "క్యాంప్ బెల్ ఆక్విడక్ట్" (అక్కిలేరు) ను నిర్మించారు. ఇది ప్రత్యేకతను సంతరించుకొనుచున్నది. సాగునీరు అందించే నీటి ప్రాజెక్టుగా, దివిసీమను సస్యశ్యామలంగా చేయడంతోపాటు, రహదారిగా గూడా ఉపయోగపడుచున్నది. [8]

సబ్ డివిజన్ కార్యాలయభవనo[మార్చు]

ఈ గ్రామంలో నీటిపారుదలశాఖ సబ్ డివిజన్ కార్యాలయభవనాన్ని బ్రిటిషు కాలంలో, 1910 లో నిర్మించారు. భవన నిర్మాణ వ్యయం=రు. 11,800. ఆ భవనం శిథిలమవడంతో, డెల్టా ఆధునికీకరణ పనులలో భాగంగా, నూతన కార్యాలయాన్ని నిర్మించి రంగులద్దినారు. ఈ కార్యాలయంలోనికి సబ్-డివిజన్ కార్యాలయంతోపాటు, ప్రధాన పనుల కార్యాలయాన్ని గూడా ఏర్పాటు చేస్తున్నారు. [7]&[8]

అతిధి గృహం[మార్చు]

ఈ గ్రామంలో నీటిపారుదలశాఖ అతిథి గృహం, 1906లో, రు. 9,800-00 ల వ్యయంతో నిర్మాణమయినది. [8]

దివిటీ స్థంభం[మార్చు]

పులిగడ్డ నీటిపారుదలశాఖ అతిథిగృహం సమీపంలో కృష్ణా నది కరకట్టకు ఆనుకుని 1903 వ సంవత్సరంలో నిర్మించిన దివిటీస్తంభం (వెలుగులు విరజిమ్మే కాగడాలు పెట్టే ఎత్తయిన దిమ్మ) నేటికీ చెక్కుచెదరక వీక్షకులను అబ్బురపరచుచున్నవి. కృష్ణానది పాయలో నీటిమట్టం, కొలతలు తీసికొనడానికి, కృష్ణానదికి ఇరువైపులా కరకట్ట వెంబడి, ఐదు మైళ్ళు (8 కి.మీ) కు ఒకటి చొప్పున వీటిని నిర్మించారు. వరదలు వచ్చిన సందర్భాలలో ఈ స్థూపాలపై దివిటీలు పెట్టి కాపలాలు కాసేవారని, నీటి ప్రవాహం, వేగం, నీటిమట్టాలను బట్టి ప్రజలకు వరద హెచ్చరికలు చేసేవారని తెలియుచున్నది. [9]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన సింగోతు విజయకుమార్, 2015, సెప్టెంబరు-9 నుండు 13 వరకు, కొత్తఢిల్లీలోని ఎన్.ఎస్.గేట్ వే క్రికెట్ మైదానంలో నిర్వహించు జాతీయస్థాయి 20-20 క్రికెట్ జట్టులో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టులో పాల్గొనడానికి అర్హత సంపాదించాడు. [13]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3215. ఇందులో పురుషుల సంఖ్య 1793, స్త్రీల సంఖ్య 1422, గ్రామంలో నివాస గృహాలు 746 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1023 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, ఆగస్టు-1; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జనవరి-9; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014, మే-14; 5వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూలై-7; 1వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూలై-31; 3వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగస్టు-9; 3వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగస్టు-15; 2వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, సెప్టెంబరు-30; 2వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే-11; 1వపేజీ. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూన్-2; 1వపేజీ. [12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూన్-22; 1వపేజీ. [13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, ఆగస్టు-31; 2వపేజీ. [14] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, సెప్టెంబరు-24; 1వపేజీ. [15] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-14; 39వపేజీ. [16] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-7; 39వపేజీ. [17] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-8; 40వపేజీ. [18] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఫిబ్రవరి-21&26. [19] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఏప్రిల్-27; 3వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=పులిగడ్డ&oldid=4130759" నుండి వెలికితీశారు