మహబూబ్ అలీ ఖాన్

వికీపీడియా నుండి
(మహబూబ్ ఆలీ ఖాన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నవాబ్ మహబూబ్ ఆలీఖాన్
హైదరాబాదు రాజ్యం యొక్క 6వ నిజాం
మహబూబ్ ఆలీఖాన్
పరిపాలన18691911
పట్టాభిషేకముఫిబ్రవరి 5, 1884
జననంఆగష్టు 17, 1866
జన్మస్థలంపురానీ హవేలీ, హైదరాబాదు
మరణండిసెంబర్ 12, 1911
మరణస్థలంఫలక్‌నుమా ప్యాలెస్
సమాధిమక్కా మసీదు
ఇంతకు ముందున్నవారుఅఫ్జల్ ఉద్దౌలా
తరువాతి వారుమీర్ ఉస్మాన్ అలీ ఖాన్
Consortఅమత్ ఉజ్జహరా బేగమ్
రాజకుటుంబముపురానీ హవేలీ
తండ్రిఅఫ్జల్ ఉద్దౌలా

మహబూబ్ ఆలీఖాన్ హైదరాబాదును పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన 1869 నుండి 1911 వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.

అఫ్జల్ ఉద్దౌలా సా.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ అసఫ్ జాగా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా సాలార్ జంగ్, అమీర్ ఎ కబీర్ లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి సా.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై ముల్కీ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన మీర్ లాయిక్ ఆలీ ఖాన్, రాజా నరేంద్ర బహదూర్ లను సంయుక్త పాలకులుగా నియమించింది.[1]

మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన 1884, ఫిబ్రవరి 5 వ తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన లార్డు రిప్పన్ స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు.

ఇతడు రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను ప్రవేశపెట్టాడు. ఇతని పాలనలోనే చంద్రపూర్ నుండి విజయవాడ వరకు, బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి, రైలు మార్గం నిర్మించబడింది.

మహబూబ్ ఆలీఖాన్

ఇతడు పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు.

నిజాములు తమను తాము దాచడానికి కూడా పిలుస్తారు. దీనికి కారణం ఒక పాలకుడు రూపంలో, వారి ప్రజలు రాత్రి చీకట్లో ఏ పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు హామీ ఇవ్వగలరు.[2]

సతి ఆచారం ముగింపుకు సహకారం[మార్చు]

1876 నవంబరు 12 : నిజాం సతిని ఆపడానికి  కఠినమైన చేర్యాను సతీసహగమనం.[3]

ప్రజలు ఇతర పేర్లు[మార్చు]

అనేక సార్లు, పొరుగు గ్రామాలకు చెందిన పులులు స్థానిక రైతులకు ప్రాణనష్టం కావటానికి కారణమయ్యాయి, దీని వలన చాలామంది రైతులు ప్రాణాలను కోల్పోయారు. అందువల్ల, అనేక సార్లు మహబూబ్ అలీ ఖాన్ వారి రక్షణ కొరకు వస్తారు. మొత్తంమీద, అతను 33 పులులను చంపాడు. దీని కారణంగా అతను "తీస్ మేర్ ఖాన్" అని కూడా పిలువబడ్డాడు`[4][5]

హిందువులతో సంబంధం[మార్చు]

6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ కూడా 1908 మూసీ వరదలను తగ్గించడానికి నదీ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేశాడు.[6]

మానవాతీత వైద్యం అధికారాలు[మార్చు]

అతనికి  పాముకాటుకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక వైద్యశక్తి ఉంది . ఇది  ప్రజలలో ప్రసిద్ధి చెందింది,ఎవరైనా పాము కాటుకి గురి అయితే , చికిత్స కోసం అతని దగరికి  వెళ్ళవచ్చు. తత్ఫలితంగా,రాజు తన పాలనా కాలంలో తన నిద్ర నుండి అనేక సార్లు మేల్కొన్నాడు.[7]

ఆనాడు నిజాం రాజ్యమంత కలియ తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెట్టే క్రూర వన్య మృగలను సంహరించేవాడు అందులో భాగంగా అప్పటి మానుకోట నేటి మహబూబాబాద్ పట్టణంలోని శిఖర్ ఖాన్ గడ్డ ప్రాంతంలో విడిది చేసి బస చేసేవారు ప్రతి సంవత్సరం ఇలా హైదరాబాద్ ప్రాంతం నుంచి మహబూబాబాద్ (మానుకోట) కి రావడం వలన ఇప్పటికి మహబూబాబాద్ గా పేరుగాంచింది

నిర్మాణాలు[మార్చు]

The Nizam VI riding an elephant in a procession - 1895
The Nizam VI riding an elephant in a procession - 1895
  1. మహబూబ్ మాన్షన్ - 1902వ సంవత్సరంలో మలక్‌పేటలో ఈ రాజభవనం నిర్మించబడింది.[8]
  2. సైఫాబాద్ ప్యాలెస్ - 1888వ సంవత్సరంలో సైఫాబాద్ లో ఈ రాజభవనం నిర్మించబడింది.[9]
  3. విక్టోరియా మెమోరియల్ హోం - 1901వ సంవత్సరంలో 70 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాదులోని సరూర్‌నగర్‌ లో విక్టోరియా మెమోరియల్ హోంను నిర్మించాడు.[10][11] కానీ ఈ భవనం తనకు కలిసిరాకపోవడంతో అప్పటి బ్రిటీషు రెసిడెంటు కోరిక ప్రకారం బ్రిటన్ రాణి విక్టోరియా పేరుతో అనాథశరణాలయంగా మార్చాడు.
  4. హైదరాబాద్ రేస్ క్లబ్ - 1868లో 135 ఏకరాల్లో హైదరాబాదులోని మలక్‌పేట్ లో నిర్మించాడు.[12][13]
  5. ఫిరంగి నాలా: తాగు, సాగునీటిని అందించే ఉద్దేశ్యంతో 1872లో షాబాద్‌ మండలం చందన్‌వల్లి గ్రామానికి తూర్పున చేవెళ్ళ, మొయినాబాద్‌ మండలాల సరిహద్దుల్లో ‘ఈసీ’ నదిపై సర్వే నంబర్‌ 160లో సుమారు రెండు ఫర్లాంగుల పొడవున 48 మీటర్ల వెడల్పు, 85 కిలోమీటర్ల పొడవుతో ఈ నాలా (కాలువ) ను తవ్వించాడు.[14][15]

సేవా కార్యక్రమాలు[మార్చు]

  1. మహబూబ్ కళాశాల నిర్వహణకు ఆర్థిక సహాయాన్ని అందించేవాడు

మూలాలు[మార్చు]

  1. http://www.rajadeendayal.com/nizams.html
  2. "Picturing the 'Beloved'".
  3. "Letters leave a rich legacy of rulers".
  4. "Staying at Falaknuma is like holding a mirror up to our past".
  5. https://gulfnews.com/news/asia/india/hyderabad-remembers-mahbub-ali-pasha-1.1889879
  6. "Grandson reveals Mir Osman Ali's connect with his Hindu employees". The Times of India. 29 July 2019.
  7. https://www.thehindu.com/society/history-and-culture/Mahboob-Ali-Pasha-Legend-with-a-lavish-lifestyle/article17138528.ece
  8. Rohit P S. "A mansion goen to the dogs". Times of India. Retrieved 28 January 2019.
  9. సాక్షి, ఫీచర్స్ (5 October 2014). "సైఫాబాద్ ప్యాలెస్". Archived from the original on 3 March 2019. Retrieved 3 March 2019.
  10. TNN 24 Feb 2013, 02.17AM IST (24 February 2013). "Manmohan Singh in Hyderabad today – Times Of India". The Times of India. Archived from the original on 20 అక్టోబరు 2013. Retrieved 12 April 2019.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  11. Special Correspondent (23 February 2013). "Manmohan to visit Hyderabad blast site today". The Hindu. Retrieved 12 April 2019.
  12. http://www.financialexpress.com/news/a-social-do/126061/0
  13. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-17. Retrieved 2019-04-17.
  14. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (16 December 2014). "'ఫిరంగి' కలేనా?". www.andhrajyothy.com. Archived from the original on 29 June 2020. Retrieved 29 June 2020.
  15. డైలీహంట్, ఈనాడు (30 October 2017). "ఫిరంగి పునరుద్ధరణ.. చెరువులకుఆలంబన". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 29 June 2020. Retrieved 29 June 2020.

బాహ్య లింకులు[మార్చు]

ఆధార గ్రంథాలు[మార్చు]

  • ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర, పి.వి.కె. ప్రసాదరావు, ఎమెస్కో బుక్స్, విజయవాడ, 2007.