వేలేరుపాడు మండలం
వేలేరుపాడు | |
— మండలం — | |
పశ్చిమ గోదావరి పటములో వేలేరుపాడు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో వేలేరుపాడు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°38′20″N 81°24′16″E / 17.638787°N 81.404343°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండల కేంద్రం | [[వేలేరుపాడు]] |
గ్రామాలు | 21 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 22,882 |
- పురుషులు | 11,007 |
- స్త్రీలు | 11,975 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 36.67% |
- పురుషులు | 43.70% |
- స్త్రీలు | 29.93% |
పిన్కోడ్ | {{{pincode}}} |
వేలేరుపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ప్రసిద్డ పుణ్యక్షేత్రమయిన భద్రాచలం నుంచి 60 కి.మీ దూరంలో ఉంది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ముంపులో నీటమునిగే ఖమ్మం జిల్లా లోని ఏడు మండలాలను ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లోకి బదలాయించారు.ఆ సమయంలో ఈ మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసింది. వేలేరుపాడు ఏజెన్సీ మండలం. ఈ మండలంలోని డెబ్బై శాతానికి పైగా జనాభా గిరిజనులే.ఈ ప్రాంతం గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధి చెందింది.[1]. వేసవిలో మండలంలోని కట్కూరు, పేరంటాలపల్లి గ్రామాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మండలంలోని రుద్రమకోటలోని శివాలయం కాకతీయుల కాలం నాటిదిగా చెబుతారు.మండలంలోని కట్కూరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం పాపికొండలకు లాంచీ సౌకర్యం ఉంది.OSM గతిశీల పటము
చరిత్ర[మార్చు]
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను...ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం (భద్రాచలం మినహా మండలంలోని అన్ని గ్రామాలు), కూనవరం, చింతరు, వరరామచంద్రాపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.
గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 22,882 - పురుషులు 11,007 - స్త్రీలు 11,975
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- రుద్రంకోట
- రేపాకగొమ్ము
- తాటుకూరు
- శ్రీరాంపురం
- భూదేవి పేట
- తిరుమలాపురం
- నార్లవరం
- కోటూరు
- చిగురుమామిడి
- సిద్దారం
- టేకూరు
- కాటుకూరు
- కాచారం
- కోయిడ
- టేకుపల్లి
- కాకిస్నూరు
- పారెంటపల్లి
- మేడపల్లి
- కోయమాదారం
- లచ్చపేట
- గుండ్లవాయి
- రాళ్లపూడి
- రామవరం
- శివకాశిపురం
- పోలవరం ఆర్డినెంస్ తో రుద్రమకోట, పాతపుచిరాల, పూచిరాల కాలనీ, లచ్చిగూడెం, రేపాకగొమ్ము, నడిమిగొమ్ము, మద్దిగట్ల, వేలేరుపాడు, నాగులగూడెం, తాట్కూరుగొమ్ము, భూదేవిపేట, శ్రీరాంపురం, జగన్నాధపురం, చాగరపల్లి, కొర్రాజులగూడెం, తిర్లాపురం, కన్నాయిగుట్ట, పాతనార్లవరం, నార్లవరం కాలనీ, చిగురుమామిడి, కోయిద, బోళ్ళపల్లి, ఎడవల్లి, బుర్రెడ్డిగూడెం, కాటుకూరు, టేకూరు, కాచారం, తాళ్ళగొంది, పునుగొంది, టేకుపల్లి, పేరంటాలపల్లి, చిట్టంరెడ్డిపాలెం, బుర్రతోగు, పడమటి మెట్ట, తూర్పుమెట్ట, కాకిస్నూరు గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లాలో కలిశాయి[2]
మూలాలు[మార్చు]
- ↑ హిందూ లో ఆర్టికల్
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-03-29. Retrieved 2019-11-08.
వెలుపలి లంకెలు[మార్చు]