Coordinates: 17°31′23″N 81°14′38″E / 17.523°N 81.244°E / 17.523; 81.244

వేలేరుపాడు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°31′23″N 81°14′38″E / 17.523°N 81.244°E / 17.523; 81.244
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంవేలేరుపాడు
Area
 • మొత్తం415 km2 (160 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం22,882
 • Density55/km2 (140/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1079


వేలేరుపాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండలం పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్సుకు ముందు ఖమ్మం జిల్లా పరిధిలో ఉంది.[3] ప్రసిద్డ పుణ్యక్షేత్రమయిన భద్రాచలం నుంచి 60 కి.మీ దూరంలో ఉంది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ముంపులో నీటమునిగే ఖమ్మం జిల్లా లోని ఏడు మండలాలను ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లోకి బదలాయించారు.ఆ సమయంలో ఈ మండలం ఏలూరు జిల్లాలో కలిసింది. వేలేరుపాడు ఏజెన్సీ మండలం. ఈ మండలంలోని డెబ్బై శాతానికి పైగా జనాభా గిరిజనులే.ఈ ప్రాంతం గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధి చెందింది.[4] వేసవిలో మండలంలోని కట్కూరు, పేరంటాలపల్లి గ్రామాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మండలంలోని రుద్రమకోటలోని శివాలయం కాకతీయుల కాలం నాటిదిగా చెబుతారు.మండలంలోని కట్కూరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం పాపికొండలకు లాంచీ సౌకర్యం ఉంది.OSM గతిశీల పటము

చరిత్ర[మార్చు]

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం (భద్రాచలం మినహా మండలంలోని అన్ని గ్రామాలు), కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం, మండలాలతోపాటు బూర్గంపాడు మండలం లోని ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.[5][6]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 22,882 - పురుషులు 11,007 - స్త్రీలు 11,975

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. చిగురుమామిడి
  2. గుండ్లవాయి
  3. కాచారం
  4. కాకిస్నూరు
  5. కాటుకూరు
  6. కోయిదా
  7. కోటూరు
  8. కోయమాదారం
  9. మేడపల్లి
  10. నార్లవరం
  11. పేరాంటాలపల్లి
  12. రాళ్లపూడి
  13. రామవరం
  14. రుద్రంకోట
  15. రేపాకగొమ్ము
  16. సిద్దారం
  17. టేకుపల్లి
  18. టేకూరు
  19. తాటుకూరు
  20. తిరుమలాపురం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. ఖమ్మం జిల్లా జనగణన కరపుస్తకం, గ్రామ, పట్టణ ప్రాథమిక జనగణన సారాంశం - 2011 (PDF), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q55972923, archived from the original (PDF) on 23 September 2015
  3. "Villages & Towns in Velairpadu Mandal of Khammam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-04-15.
  4. హిందూ లో ఆర్టికల్
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-03-29. Retrieved 2019-11-08.
  6. "List of seven mandals to be included in AP". web.archive.org. 2020-11-01. Archived from the original on 2020-11-01. Retrieved 2021-10-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు[మార్చు]