కరణం మల్లేశ్వరి
![]() | ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
కరణం మల్లేశ్వరి | |
---|---|
![]() కరణం మల్లేశ్వరి | |
జననం | కరణం మల్లేశ్వరి జూన్ 1, 1975 / 1975, జూన్ 1 |
వృత్తి | క్రీడాకారిణి |
సురరిచితుడు | ![]() |
Medal record | |||
---|---|---|---|
Women’s Weightlifting | |||
ప్రాతినిధ్యం వహించిన దేశము ![]()
| |||
Olympic Games | |||
కాంస్యం | 2000 Sydney | – 69 kg
| |
Asian Games | |||
రజతం | 1998 Bangkok | – 63 kg
|
కరణం మల్లేశ్వరి భారతీయ క్రీడాకారిణి. శ్రీకాకుళానికి చెందిన ఈమె బరువులు ఎత్తడం ఆటలో ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది. 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలంపిక్స్ లో ఈమె వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారతదేశం తరపున కాంస్యపతకం సాధించింది.
బాల్యం[మార్చు]
ఈమె 1975 జూన్ 1 న జన్మించింది. చిత్తూరు జిల్లాకు చెందిన తవణంపల్లి గ్రామములో పుట్టిన మల్లీశ్వరి తండ్రి ఉద్యోగరీత్యా ఆమదాలవలసకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు.
విద్య, ఉద్యోగం[మార్చు]
క్రీడా జీవితం[మార్చు]
మల్లీశ్వరి అక్క నరసమ్మకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలంశెట్టి అప్పన్న శిక్షణ ఇచ్చేవారు . అక్క విజయాలను చూచిన మల్లీశ్వరి కూడా ఈ రంగం పై ఆసక్తి పెంచుకున్నారు . చివరకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు . చైనా దేశం లోని గ్యాంగ్ ఝూలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోతీల్లో 54 కిలోల విభాగంలో దేశానికి మూడు స్వర్ణపతకాలు తెచ్చారు. ఆ తరువాత టర్కీ రాజధాని ఇస్తాంహుల్ లో జరిగిన పోటేల్లో తన ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువుకావడంతో ఆ టైటిల్ ను మల్లీశ్వరికి ప్రధానము చేసారు . 1995 చైనాలో జరిగిన పోటల్లో వరుసగా 105,110, 113, కిలోల బరువులు ఎత్తి చైనా వెయిట్ లిఫ్టర్ - లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొటారు .
సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఆ విధంగా ఒలింపిక్ ఆటలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది,, మూడవ భారతీయ వ్యక్తి. (అంతకుముందు పతకాలు సాధించిన భారతీయులు - 1952 హెల్సింకీలో bantamweightwrestler ఖషబా జాదవ్, 1996 అట్లాంటాలో టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్)
వివాహం, సంతానం[మార్చు]
పతకాలు, పురస్కారాలు[మార్చు]
- 2000 - ఒలింపిక్ క్రీడలు - కాంస్య పతకం - 69 కిలోగ్రాముల విభాగంలో
- 1994 - ఇస్తాంబుల్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు - బంగారు పతకం
- 1995 - పూసాన్, కొరియా - ఆసియా ఛాంపియన్షిప్ పోటీలు
- 1995 - ఘుంగ్జౌ, చైనా - 54 కిలోల విభాగంలో మూడు బంగారు పతకాలు
- భారత ప్రభుత్వం అర్జున అవార్డు
- 1995 - రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బహుమతి
- 1999- పద్మశ్రీ పురస్కారం
ఒక సందర్భంలో ఆమె ఇలా అంది -
- భారత దేశానికి పతకాలు ఎందుకు రావని అడుగుతుంటారు. అది ఎయిర్-కండిషన్డ్ గదులలో కూర్చుని మాట్లాడినంత సులభం కాదు. ఆ ప్రయత్నంలో ఉన్న శ్రమ, వేదన మాకు తెలుస్తాయి.
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- వికీకరించవలసిన వ్యాసములు
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Infobox person using residence
- రాజీవ్ గాంధీ ఖేల్రత్న గ్రహీతలు
- 1975 జననాలు
- ఒలింపిక్ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ మహిళలు
- ఆదర్శ వనితలు
- అర్జున అవార్డు గ్రహీతలు
- జీవిస్తున్న ప్రజలు
- శ్రీకాకుళం జిల్లా మహిళా క్రీడాకారులు