బి.డి. జెట్టి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వ్యాసం విస్తరణ,మూలాలు లంకె కూర్పు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి యర్రా రామారావు, పేజీ బసప్ప దానప్పజత్తి ను బి.డి. జెట్టి కు తరలించారు: మరింత మెరుగైన పేరు |
(తేడా లేదు)
|
03:30, 20 ఏప్రిల్ 2020 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బి.డి.జత్తి గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. 1974 సంవత్సరం ఆగస్టు 24 న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న ఫకృద్దీన్ అలీ అహ్మద్ హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి, శ్రీమతి సంగమ్మ'లు. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జత్తి 1912, 24 ఆగస్టున జన్మించాడు.బసప్పజత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్టంలో హైదరాబాదు నందు 1975 ఏప్రియల్ 12 నుండి జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు బి.డి జెట్టి ముఖ్యఅతిధిగా అప్పటి ఉపరాష్ట్రపతి హోదాలో హాజరయ్యాడు.ఆనాటి సభలలో తెలుగు ప్రసంగాన్ని కన్నడభాశలో రాసుకుని ప్రసగించాడు.[1]
జెట్టి నిర్వహించిన పదవులు
- ఆనాటి బొంబాయి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
- మైసూరు రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసాడు.
- కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నరుగా 1968 నుండి 1972 వరకూ సమర్ధవంతంగా పనిచేసాడు.
- 1972 నుండి 1974 ప్రాంతములో ఒడిషా గవర్నరుగా ఉన్నాడు.
మరణం
2002 జూన్ 2 న లో చనిపోయాడు.