యాగా వేణుగోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమైన [[రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండ…
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమైన [[రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా[[ గవర్నరుగా ఐదేళ్ళు పనిచేసి [[2008]] [[ఆగస్టు]]లో పదవీవిరమణ చేసిన డా. వై.వి.రెడ్డి పూర్తి పేరు యాగా వేణుగోపాల్ రెడ్డి. రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నరైన వై.వి.రెడ్డి [[1964]] బ్యాచ్ కు చెందిన IAS ([[ఐ.ఏ.ఎస్]]) అధికారి. ఆయన ఉద్యోగ జీవితం దాదాపు పూర్తిగా ఆర్థిక, ప్రణాళికా రంగాల్లోనే సాగింది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమైన [[రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా]] గవర్నరుగా ఐదేళ్ళు పనిచేసి [[2008]] [[ఆగస్టు]]లో పదవీవిరమణ చేసిన డా. వై.వి.రెడ్డి పూర్తి పేరు యాగా వేణుగోపాల్ రెడ్డి. రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నరైన వై.వి.రెడ్డి [[1964]] బ్యాచ్ కు చెందిన IAS ([[ఐ.ఏ.ఎస్]]) అధికారి. ఆయన ఉద్యోగ జీవితం దాదాపు పూర్తిగా ఆర్థిక, ప్రణాళికా రంగాల్లోనే సాగింది.
==వ్యక్తిగత వివరాలు==
==వ్యక్తిగత వివరాలు==
[[1941]] [[ఆగస్టు 17]]న [[కడప]] జిల్లా [[పుల్లంపేట]] మండలం [[కొమ్మనవారిపల్లె]] గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి యాగా పిచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే అప్పటి ఉమ్మడి [[మద్రాసు రాష్ట్రం]]లో ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించాడు. [[నంద్యాల]] [[కలెక్టర్‌]]గా కూడా ఆయన పనిచేశాడు. ఆయన వృత్తిరీత్యా [[మద్రాసు]]లో స్థిరపడడం వల్ల వేణుగోపాల్‌రెడ్డి చదువంతా [[తమిళనాడు]]లోనే సాగింది.
[[1941]] [[ఆగస్టు 17]]న [[కడప]] జిల్లా [[పుల్లంపేట]] మండలం [[కొమ్మనవారిపల్లె]] గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి యాగా పిచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే అప్పటి ఉమ్మడి [[మద్రాసు రాష్ట్రం]]లో ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించాడు. [[నంద్యాల]] [[కలెక్టర్‌]]గా కూడా ఆయన పనిచేశాడు. ఆయన వృత్తిరీత్యా [[మద్రాసు]]లో స్థిరపడడం వల్ల వేణుగోపాల్‌రెడ్డి చదువంతా [[తమిళనాడు]]లోనే సాగింది.

11:39, 25 మే 2009 నాటి కూర్పు

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరుగా ఐదేళ్ళు పనిచేసి 2008 ఆగస్టులో పదవీవిరమణ చేసిన డా. వై.వి.రెడ్డి పూర్తి పేరు యాగా వేణుగోపాల్ రెడ్డి. రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నరైన వై.వి.రెడ్డి 1964 బ్యాచ్ కు చెందిన IAS (ఐ.ఏ.ఎస్) అధికారి. ఆయన ఉద్యోగ జీవితం దాదాపు పూర్తిగా ఆర్థిక, ప్రణాళికా రంగాల్లోనే సాగింది.

వ్యక్తిగత వివరాలు

1941 ఆగస్టు 17న కడప జిల్లా పుల్లంపేట మండలం కొమ్మనవారిపల్లె గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి యాగా పిచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించాడు. నంద్యాల కలెక్టర్‌గా కూడా ఆయన పనిచేశాడు. ఆయన వృత్తిరీత్యా మద్రాసులో స్థిరపడడం వల్ల వేణుగోపాల్‌రెడ్డి చదువంతా తమిళనాడులోనే సాగింది.

వృత్తి జీవితం

వేణుగోపాల్‌రెడ్డి IAS అధికారి కాకముందు 1961 నుంచి లెక్చరర్ గా పనిచేశాడు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో M.A., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D., నెదర్లాండ్స్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియల్ స్టడీస్ లో ఆర్థిక ప్రణాళిక (Economic Planning) లో డిప్లొమా చేశాడు. అవే కాకుండా శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయం (Doctor of Letters), మారిషస్ విశ్వవిద్యాలయం (Doctor of Civil Law) ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Department of Business Management)లోను, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (London School of Economics and Political Science - International Relations Department) లోనూ, Administrative Staff College of India లోనూ విజిటింగ్ ఫాకల్టీగా పనిచేసిన వై.వి.రెడ్డి హైదరాబాదులోని CESS (Center for Economic and Social Studies) లో Honorary Senior Fellow గా కొనసాగుతున్నాడు.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో (బ్యాంకింగ్) కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శి గా, వాణిజ్య మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శిగా, ఆపైన 1996 నుంచి ఏడేళ్ళు రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నరుగా సేవలందించాడు. రిజర్వ్ బ్యాంకు గవర్నరు కాకముందు ప్రపంచ బ్యాంకు సలహాదారుగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) బోర్డులో భారతదేశం తరపున ద్రవ్య వ్యవహారాల సలహాదారుగా పనిచేసిన రెడ్డి 2002లో IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమితుడయ్యాడు. ఆర్థికాభివృద్ధి పథంలో ఈయన సలహాలను వినియోగించుకున్న దేశాల్లో చైనా, బహ్రెయిన్, ఇథియోపియా, టాంజానియా, తదితర దేశాలున్నాయి.

ఆర్థికరంగ సంస్కరణలు, వాణిజ్యం, BoP (Balance of payments) మరియు ద్రవ్య మార్పిడి రేటు, విదేశీ వాణిజ్య ఋణాలు, కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, ప్రాంతీయ ప్రణాళిక, ప్రభుత్వరంగ సంస్కరణలు, తదితర రంగాలలో ఆయన కీలక భూమిక నిర్వహించాడు.

రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా బ్యాంకు వ్యవహారాల్లో పారదర్శకతను తీసుకువచ్చాడు. మన దేశ ఆర్థిక వ్యవస్థ 3.5 శాతం వృద్ధి రేటు నుంచి 8-9 శాతం వృద్ధిరేటును నమోదు చేసే స్థాయికి విస్తరించిన తరుణంలో ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లను తట్టుకొని ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా జాగ్రత్త వహించాడు. ద్రవ్యోల్బణాన్ని అదుపుచెయ్యడంలో గట్టిపట్టున రెడ్డి ఇటీవలి సంవత్సరాల్లో అంతర్జాతీయంగా రూపాయి మారకం రేటు పెరిగేలా చేయడంలో సఫలీకృతుడయ్యాడు. సెప్టెంబర్ 2008లో రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా పదవీ విరమణ చేసిన వై.వి.రెడ్డి ప్రస్తుత ఆర్థికమాంద్యం నుంచి బయటపడటానికి పలు దేశాల ప్రతినిధులు, ఎంతో అనుభవజ్ఞులైన ఆర్థిక బ్యాంకింగ్‌ నిపుణులతో ఐరాస ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ కమిటీ ఇప్పటికే ప్రాథమిక సిఫార్సులు చేసింది.

వై.వి.రెడ్డి ప్రస్తుత ఆర్థిక సంక్షోభంపై రాసిన పుస్తకం: 'ఇండియా అండ్‌ ద గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ క్రైసిస్‌'. ఈ పుస్తకంలో రెండు ప్రధానమైన అంశాలకు సమాధానం ఉంది. ఒకటి- మిగిలిన దేశాల కంటే భారత్‌ పరిస్థితి ఎందుకు మెరుగ్గా ఉంది. రెండు- ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది? దానిపై ఎవరేం చేస్తున్నారు? సంక్షోభాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకంలోని సమాచారం వీలు కల్పిస్తోంది.