సి.డి.దేశ్ముఖ్
Sir Chintaman Dwarakanath Deshmukh CIE, ICS | |||
![]() C. D. Deshmukh | |||
పదవీ కాలము May 29, 1950[1]–1957 | |||
ప్రధాన మంత్రి | Jawaharlal Nehru | ||
---|---|---|---|
ముందు | John Mathai | ||
తరువాత | T. T. Krishnamachari | ||
పదవీ కాలము 1943–49 | |||
ముందు | James Braid Taylor | ||
తరువాత | Benegal Rama Rau | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | Nate, Mahad, Raigad, Maharastra | 14 జనవరి 1896||
మరణం | 2 అక్టోబరు 1982 | (వయస్సు 86)||
జాతీయత | Indian | ||
పూర్వ విద్యార్థి | University of Cambridge | ||
మతం | Hindu |
సి.డి.దేశ్ముఖ్ (జనవరి 14, 1896 - అక్టోబరు 2, 1982) పూర్తి పేరు చింతమన్ ద్వారకానాథ్ దేశ్ముఖ్ (Chintaman Dwarakanath Deshmukh). వీరు భారతీయ రిజర్వ్ బాంక్ మూడవ గవర్నర్, స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్. ఇతడు 1943, ఆగష్టు 11 నుంచి 1949, జూన్ 30 వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్మూఖ్ భారత దేశానికి ఆర్థిక మంత్రిగా నియమితులైనాడు.
జననం[మార్చు]
1896, జనవరి 14 న జన్మించాడు. 1920లో రోసినా ఆర్థర్ విల్కాక్స్ అనే ఆంగ్ల వనితను వివాహమాడాడు. 1949లో తొలి భార్య మరణించింది. వీరి కుమార్తె ప్రిమ్రోజ్ ఇంగ్లాండులో నివసిస్తుంది.[2] ఆ తరువాత 1953లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలైన దుర్గాబాయి దేశ్ముఖ్ను వివాహం చేసుకున్నాడు.
ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడైన దేశ్ముఖ్ కు 1939 నుంచే రిజర్వ్ బ్యాంక్తో సంబంధం ఉంది. 1941లో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ గా నియమించబడ్డాడు. August, 1943. ఆ తర్వాత జేమ్స్ టేలర్ నుంచి 3 వ గవర్నర్ గా బాధ్యతలు పొందినాడు. దేశ్ముఖ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక పరిణామాలు సంభవించాయి. జూలై 1944లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సమావేశంలో అతడు కూడా భారత దేశం తరఫునన పాల్గొన్నాడు. ఈ సమావేశమే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (International Monetary Fund-IMF), ప్రపంచ బ్యాంకు (International Bank for Reconstruction and Development-IBRD) ఏర్పడడానికి కారణమైంది. ఈ రెండు సంస్థల లోనూ దేశ్ముఖ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా పదేళ్ళ పాటు పనిచేశాడు. 1950లో పారిస్లో జరిగిన ఈ రెండు సంస్థల వార్షిక సంయుక్త సమావేశంలో ఇతడు చైర్మెన్ గా వ్యవహరించాడు.[3]
అవార్డులు[మార్చు]
- 1952లో దేశ్ముఖ్ విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయపు జేసస్ కళాశాల నుంచి గౌరవ ఫెలోగా ఎన్నికయ్యడు.
- 1959లో ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగ్సేసే అవార్డును పిలిప్పీన్స్కు చెందిన జోస్ అగ్విలార్ తో కల్సి సంయుక్తంగా పొందినాడు.
- 1975లో భారత ప్రభుత్వం చే పద్మ విభూషణ పురస్కారం పొందినాడు.
మరణం[మార్చు]
1982, అక్టోబరు 2న మరణించారు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-22. Retrieved 2014-01-12.
- ↑ "BIOGRAPHY of Chintaman Dwarkanath Deshmukh". Archived from the original on 2008-10-17. Retrieved 2013-04-16.
- ↑ "Chintaman Deshmukh Memorial Lectures". Reserve Bank of India. Retrieved 2006-12-08. CS1 maint: discouraged parameter (link)
- CS1 maint: discouraged parameter
- రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- భారతీయ ఆర్థిక శాస్త్రవేత్తలు
- ఆర్థిక శాస్త్రవేత్తలు
- 1896 జననాలు
- పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు
- 1982 మరణాలు