అక్షాంశ రేఖాంశాలు: 31°20′N 76°45′E / 31.33°N 76.75°E / 31.33; 76.75

బిలాస్‌పూర్ రాష్ట్రం (1950-1954)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bilaspur State
Former state
1950–1954
Etymology: from a Fisher-woman named “Bilasa”[1]
The map of India showing Bilaspur State
Location of Bilaspur State in India
Coordinates: 31°20′N 76°45′E / 31.33°N 76.75°E / 31.33; 76.75
Country India
RegionNorth India
Before wasKahlur
Capital
and largest city
Bilaspur, Himachal Pradesh
Government
విస్తీర్ణం
 • Total1,401 కి.మీ2 (541 చ. మై)
జనాభా
 (1951)
 • Total1,26,099[2]
Time zoneUTC+05:30 (IST)
Preceded by
Succeeded by
Kahlur
Himachal Pradesh

బిలాస్‌పూర్ రాష్ట్రం 1950 నుండి 1954 వరకు బిలాస్‌పూర్ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఉండేది.బిలాస్‌పూర్ సంస్థానం నుండి 1948లో అదే పేరుతో ఏర్పడిన ప్రావిన్స్ తరువాత ఈ రాష్ట్రం స్థాపించబడింది.[3]

అప్పటి వరకు చీఫ్ కమిషనర్ నియంత్రణలో ప్రత్యేక సంస్థగా ఉన్న 31వ రాష్ట్రం బిలాస్‌పూర్,1954 జూలై 1న హిమాచల్ ప్రదేశ్‌లో విలీనం చేసారు, తద్వారా రాష్ట్రానికి మరో జిల్లాను జోడించబడింది.

బిలాస్‌పూర్‌ను మొదటినుండి హిమాచల్ ప్రదేశ్‌లో విలీనం చేయకుండా ప్రత్యేక రాష్ట్రంగా చేయడానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో కొనసాగుతున్న భాక్రా డ్యామ్ నిర్మాణం ఒక కారణం.ఇది చాలామందిని స్థానభ్రంశం చేసే విస్తృతమైన వరదలకు కారణమవుతుందని అంచనా వేసారు,ఆ తర్వాత వారు నష్టపరిహారం పొందడంతోపాటు ఇతర ప్రాంతాలకు తరలించాలి. బిలాస్‌పూర్‌ను హిమాచల్‌ప్రదేశ్‌ కిందకు చేర్చకుండా విడిగా పరిష్కరించటానికి వీలుగా బిలాస్‌పూర్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. [4]

చరిత్ర

[మార్చు]

బిలాస్‌పూర్ రాష్ట్రం బిలాస్‌పూర్ పూర్వపు ప్రిన్స్లీ స్టేట్ భూభాగం నుండి ఏర్పడింది. ఇది 1948 అక్టోబరు 12న కహ్లూర్ అకా బిలాస్‌పూర్ పూర్వపు పాలకుడు రాజా ఆనంద్ చంద్ చేరడం ద్వారా భారతదేశం ఆధిపత్యం క్రింది ఒక భాగమైంది.

రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో 1950 జనవరి 26న బిలాస్‌పూర్ రాష్ట్రం అని పేరు పెట్టబడిన క్లాస్ "సి" రాష్ట్రంగా స్థాపించబడే వరకు బిలాస్‌పూర్ రాష్ట్రంఒక ప్రావిన్స్ క్లాస్ "సి" రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉన్నాయి.[3] [5]

అస్థిరత

[మార్చు]

'హిమాచల్ ప్రదేశ్, బిలాస్‌పూర్ (కొత్త రాష్ట్రం) చట్టం, 1954' ఆమోదించిన తరువాత [6] పార్లమెంటు చట్టం ద్వారా బిలాస్‌పూర్ రాష్ట్రం 1954 జూలై 1న రద్దు అయింది. దానితో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 106,848 హెక్టార్లు విస్తీర్ణంతో బిలాస్‌పూర్ జిల్లాగా విలీనం అయింది.[3] [7]

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లెఫ్టినెంట్ గవర్నరు కింద మరొక భాగం - C రాష్ట్రం. ప్రారంభంలో ఇది 36 మంది సభ్యుల శాసనసభను కలిగి ఉంది. శాసనసభకు మొదటి సారి ఎన్నికలు 1952లో జరిగాయి. 1954లో బిలాస్‌పూర్ హిమాచల్ ప్రదేశ్‌లో విలీనమైనప్పుడు, దాని శాసనసభ సభ్యుల బలం 41కి పెరిగింది. [8]

ప్రధాన కమిషనర్లు

[మార్చు]
  1. రాజా ఆనంద్ చంద్ అక్టోబర్ 1948 నుండి ఏప్రిల్ 1949 వరకు [3] [5]
  2. శ్రీచంద్ ఛబ్రా, ఏప్రిల్ 1949 నుండి నవంబర్ 1953 వరకు
  3. కె.ఎస్. హిమ్మత్‌సిన్హ్జీ, నవంబర్ 1953 నుండి జూలై 1954 వరకు [3]

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "History | District Bilaspur | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-04-24.
  2. "Census of India 1951 - Bilaspur State" (PDF). 1952. Retrieved 26 June 2022.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Bilaspur State : Chief Commissioners
  4. Mamgain, M.D. (1975). Himachal Pradesh District Gazetteers: Bilaspur. p. 1. Retrieved 8 April 2023.
  5. 5.0 5.1 Social, cultural, and economic history of Himachal Pradesh By Manjit Singh Ahluwalia
  6. The Himachal Pradesh and Bilaspur (New State) Act, 1954
  7. Bilaspur History Archived 20 నవంబరు 2011 at the Wayback Machine
  8. "1 Vidhan Sabha". Archived from the original on 30 August 2011. Retrieved 12 September 2011.