హిమాచల్ ప్రదేశ్
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
హిమాచల్ ప్రదేశ్ | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
షిమ్లా - 30°04′N 77°07′E / 30.06°N 77.11°E |
పెద్ద నగరం | షిమ్లా |
జనాభా (2001) - జనసాంద్రత |
6,077,248 (20th) - 109/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
55,673 చ.కి.మీ (17th) - 12 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[హిమాచల్ ప్రదేశ్ |గవర్నరు - [[హిమాచల్ ప్రదేశ్ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1971-01-25 - ఆచార్య దేవ్ వ్రత్ - వీరభద్ర సింగ్ - Unicameral (68) |
అధికార బాష (లు) | హిందీ, పహాడీ |
పొడిపదం (ISO) | IN-HP |
వెబ్సైటు: himachal.nic.in |
హిమాచల్ ప్రదేశ్ (हिमाचल प्रदेश) వాయువ్య భారతదేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి తూర్పున టిబెట్ (చైనా), ఉత్తరాన, వాయువ్యమున జమ్మూ కాశ్మీరు, నైఋతిన పంజాబ్, దక్షిణాన హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఆగ్నేయాన ఉత్తరాఖండ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్ విస్తీర్ణము 55,658 చ.కి.మీలు (21,490 చ.కి.మైళ్లు), 1991 జనాభా ప్రకారం రాష్ట్రం జనాభా 5,111,079. 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభాగంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది. 1971, జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రంగా అవతరించింది.
రాష్ట్ర రాజధాని షిమ్లా. ధర్మశాల, కాంగ్రా, మండి, కుల్లు, చంబా, డల్హౌసీ, మనాలీ ఇతర ముఖ్య పట్టణాలు. రాష్ట్రంలో చాలా ప్రాంతం పర్వతమయం. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన శివాలిక్ పర్వతశ్రేణులు ఉన్నాయి. శివాలిక్ శ్రేణి ఘగ్గర్ నది జన్మస్థలం. రాష్ట్రంలోని ప్రధాన నదులు సట్లెజ్ (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉంది), బియాస్ నది. సట్లెజ్ నది మీద కంద్రౌర్, బిలాస్పూర్ వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి.
జిల్లాలు[మార్చు]
సంస్కృతి[మార్చు]
కాంగ్రి, పహారీ, పంజాబీ, హిందీ, మండియాలీ రాష్ట్రంలో ప్రధానంగా మట్లాడే భాషలు. హిందూ, బౌద్ధ, సిక్కు రాష్ట్రంలోని ప్రధాన మతాలు. రాష్ట్రంలోని పశ్చిమ భాగంలోని ధర్మశాల, దలైలామా, అనేక టిబెట్ శరణార్ధులకు ఆవాసం.
రాజకీయాలు[మార్చు]
2003 రాష్ట్ర శాసనసభలో భారత జాతీయ కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షం.
రవాణా, సమాచార ప్రసరణ[మార్చు]
రోడ్లు ప్రధాన రవాణా మార్గాలు. రోడ్లు కురుచగా మెలికలు తిర్గుతూ తరచూ ఊచకోతలు, భూమి జారడాల మధ్య ఉండటం వలన ప్రయాణం చాలా మెల్లగా సాగుతుంది. ఋతుపవనాల కాలంలో పరిస్థితి మరింత భయానకంగా ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న హిమాచల్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ రాష్ట్రమంతటా బస్సులు నడుపుతుంది. దాదాపు అన్ని ప్రాంతాలకు టెలిఫోన్, మొబైల్ ఫోన్ సౌకర్యాలు ఉన్నాయి.
పర్యాటక ప్రాంతాలు[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
- హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు
- బాబా కాన్సీరామ్ - ఇతను భారతీయ కవి, భారత స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త.
మూలాలు[మార్చు]
- వర్మ, వి. 1996. గద్దీస్ ఆఫ్ ధౌళాధర్: ఏ ట్రాన్స్ హ్యూమన్ ట్రైబ్ ఆఫ్ ద హిమాలయాస్'. ఇండస్ పబ్లిషింగ్ కం., న్యూఢిల్లీ.
- హందా, ఓ. సీ. 1987. బుద్ధిష్ట్ మొనాస్టరీస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్'. ఇండస్ పబ్లిషింగ్ కం., న్యూఢిల్లీ. ISBN 81-85182-03-5.