జే.పంగులూరు: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB తో RETF మార్పులు, typos fixed: → (8), చేసినారు → చేసారు (3), చినారు → చారు (20) using AWB |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 104: | పంక్తి 104: | ||
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 261., ఎస్.టి.డి.కోడ్ = 08593. |
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 261., ఎస్.టి.డి.కోడ్ = 08593. |
||
==గ్రామ చరిత్ర== |
|||
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
|||
==గ్రామ భౌగోళికం== |
|||
===సమీప గ్రామాలు=== |
|||
===సమీప మండలాలు=== |
|||
==గ్రామానికి రవాణా సౌకర్యాలు== |
|||
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
||
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల=== |
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల=== |
||
పంక్తి 143: | పంక్తి 149: | ||
===శ్రీ పోలెరమ్మ దేవస్థానము=== |
===శ్రీ పోలెరమ్మ దేవస్థానము=== |
||
ముఖ్యంగా చెప్పాలంటె పడమటి బజారున వున్న పోలెరమ్మ దేవస్థానము యెంతో ప్రాముఖ్యం చెందినంది. ఇక్కడ అమ్మవారికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర వుంది, అమ్మవారికి ప్రతి ఆదివారం పూజలు భజనలు చేస్తూవుంటారు. గ్రామ ప్రజలు తమ తమ మొక్కులును వివిధ రూపాలలొ చెల్లిస్తూవుంటారు. ఫ్రతి సంవత్సరం జాతరలు చేస్తారు. |
ముఖ్యంగా చెప్పాలంటె పడమటి బజారున వున్న పోలెరమ్మ దేవస్థానము యెంతో ప్రాముఖ్యం చెందినంది. ఇక్కడ అమ్మవారికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర వుంది, అమ్మవారికి ప్రతి ఆదివారం పూజలు భజనలు చేస్తూవుంటారు. గ్రామ ప్రజలు తమ తమ మొక్కులును వివిధ రూపాలలొ చెల్లిస్తూవుంటారు. ఫ్రతి సంవత్సరం జాతరలు చేస్తారు. |
||
==గ్రామంలో ప్రధాన పంటలు== |
|||
==గ్రామంలో ప్రధాన వృత్తులు== |
|||
==గ్రామ ప్రముఖులు== |
|||
==గ్రామ విశేషాలు== |
==గ్రామ విశేషాలు== |
||
పంగులూరు గ్రామంలోని మేకల సీతారామిరెడ్డి క్రీడా అకాడమీలో 9 సంవత్సరాలుగా శిక్షణ పొందుచున్న క్రీడాకారుడు పాలపర్తి శ్రీను, 2016,ఫిబ్రవరిలో అసోం రాష్ట్రంలో నిర్వహించు అంతర్జాతీయ ఖో-ఖో పోటీలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైనాడు. ఇతడు 2015,నవంబరు-21 నుండి 27 వరకు మహరాష్ట్రలోని షోలాపూరులో నిర్వహించిన సీనియర్ ఖో-ఖో పోటీలలో పాల్గొని, తన అనన్య సామన్యమైన ప్రతిభ ప్రదర్శింనాడు. ఇతడు 2005-2006 నుండి జిల్లాస్థాయిలో 30సార్లు, రాష్ట్రస్థాయిలో 15 సార్లు మరియు జాతీయస్థాయిలో 15 సార్లు పాల్గొని బహుమతులు అందుకున్నాడు. [21] |
పంగులూరు గ్రామంలోని మేకల సీతారామిరెడ్డి క్రీడా అకాడమీలో 9 సంవత్సరాలుగా శిక్షణ పొందుచున్న క్రీడాకారుడు పాలపర్తి శ్రీను, 2016,ఫిబ్రవరిలో అసోం రాష్ట్రంలో నిర్వహించు అంతర్జాతీయ ఖో-ఖో పోటీలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైనాడు. ఇతడు 2015,నవంబరు-21 నుండి 27 వరకు మహరాష్ట్రలోని షోలాపూరులో నిర్వహించిన సీనియర్ ఖో-ఖో పోటీలలో పాల్గొని, తన అనన్య సామన్యమైన ప్రతిభ ప్రదర్శింనాడు. ఇతడు 2005-2006 నుండి జిల్లాస్థాయిలో 30సార్లు, రాష్ట్రస్థాయిలో 15 సార్లు మరియు జాతీయస్థాయిలో 15 సార్లు పాల్గొని బహుమతులు అందుకున్నాడు. [21] |
06:58, 27 సెప్టెంబరు 2016 నాటి కూర్పు
జే.పంగులూరు |
|
— మండలం — | |
ప్రకాశం పటంలో జే.పంగులూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో జే.పంగులూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°49′09″N 80°05′30″E / 15.819176°N 80.091605°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండల కేంద్రం | జే.పంగులూరు |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 44,753 |
- పురుషులు | 22,384 |
- స్త్రీలు | 22,369 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 58.88% |
- పురుషులు | 69.46% |
- స్త్రీలు | 48.37% |
పిన్కోడ్ | 523261 |
జే.పంగులూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 15°49′09″N 80°05′30″E / 15.819176°N 80.091605°E{{#coordinates:}}: cannot have more than one primary tag per page | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | జే.పంగులూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి దాచిన నీరజ |
జనాభా (2001) | |
- మొత్తం | 6,087 |
- పురుషుల సంఖ్య | 3,086 |
- స్త్రీల సంఖ్య | 3,142 |
- గృహాల సంఖ్య | 1,661 |
పిన్ కోడ్ | 523 261 |
ఎస్.టి.డి కోడ్ | 08593 |
జే.పంగులూరు(జనకవరం పంగులూరు), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము. [1] పిన్ కోడ్ నం. 523 261., ఎస్.టి.డి.కోడ్ = 08593.
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
1965 కి ముందు ఈ గ్రామములో ఉన్నత పాఠశాల లేదు. ఉన్నత విద్యకొరకు, ఈ గ్రామ విద్యార్ధులు, సమీప గ్రామాలయిన గంగవరం, పావులూరు, రావినూతల, తిమ్మసముద్రo గ్రామాలకు వెళ్ళవలసివచ్చేది. అందువలన ఈ గ్రామస్థులు గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటుకు నడుం బిగించారు. గ్రామానికి చెందిన దాతలు శ్రీ వసంత సుబ్బయ్య, బాపనయ్య, నారాయణ పాఠశాల భవన నిర్మానానికి అవసరమైన మూడు ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. వీరిలో దాత వసంత నారాయణ, భూమితోపాటు, ఆ రోజులలోనే, నాలుగువేల రూపాల నగదు గూడా అందజేసినారు. గ్రామస్థులంతా ఎవరికి తోచినవిధంగా వారు, విరాళాలనందించడంతో పాఠశాల నిర్మాణం పూర్తి అయినది. తొలి ప్రధానోపాధ్యాయులుగా శ్రీ చెన్నుపాటి నాగేశ్వరరావు పనిచేసారు. పాఠశాల ఏర్పడిన తరువాత రెండు సంవత్సరాలపాటు బోధన, బోధనేతర సిబ్బందికి జీతభత్యాలను గ్రామస్థులే సమకూర్చటం విశేషం. ఇప్పటి వరకు మొత్తం 4,100 మంది ఈ పాఠశాలలో విద్యనభ్యసించి వివిధ రంగాలలో రాణించుచున్నారు. వీరిలో కొంతమది దేశ,విదేశాలలో స్థిరపడినారు. ఈ పాఠశాల పూర్వవిద్యార్ధులు, 17 అక్టోబరు,2000 లో ఒక సంఘంగా ఏర్పడి పాఠశాల అభివృద్ధికి తోడ్పడుచున్నారు. వీరి కృషితో పాఠశాలలో సకల సౌకర్యాలు సమకూరినవి. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేయుచున్నారు. 50 సంవత్సరాల క్రితం ఒక చిన్న పూరిపాకలో ప్రారంభమయిన ఈ పాఠశాల, 2015,జూన్-6వ తేదీ శనివారం నాడు మరియు 7వ తేదీ ఆదివారం నాడు స్వర్ణోత్సవాలు జరుపుకున్నది. [12]&[14]
గ్రంథాలయo
ఈ పాఠశాలలో విద్యార్ధుల సౌకర్యార్ధం, దాతల సహకారంతో, ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రంథాలయ నిర్మాణానికి 2015,నవంబరు-2వ తేదీనాడు, దాతలు, గ్రామ పెద్దలు శంఖుస్థాపన నిర్వహించారు. ఈ గ్రంథాలయాన్ని, 2016,జనవరి-16న ప్రారంభించారు. చిన్నతనంలో మృతిచెందిన తమ కుమారుడు చి.గౌతం శాయిరాం ఙాపకార్ధం, శ్రీ చింతపల్లి శేషయ్య, రాధిక దంపతులు దీనిని నిర్మించారు. [22]
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల
ఈ గ్రామములోని అంబేడ్కర్ కాలనీలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల 13,జనవరి-2014 నాటికి 60 వ వసంతంలోనికి అడుగిడనున్నది.[2]
శాఖా గ్రంథాలయం
గ్రామములోని మౌలిక సదుపాయాలు
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
- స్త్రీశక్తి భవనం:-25 లక్షల రూపాయల ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.నిధులతో చేపట్టిన ఈ భవన నిర్మాణానికి 2013 మధ్య కాలంలో శంఖుస్థాపన నిర్వహించారు. ఆ తరువాత నిధులు సరిపోక, 2015 మధ్యకాలం వరకు గూడా పూర్తి కాకపోవడంతో, మరియొక ఏడు లక్షల రూపాయలు మంజూరవడంతో ఇప్పుడు ఈ భవనం నిర్మాణం పూర్తి చేసారు. జనవరిలో ఈ భవనం ప్రారంభోత్సవం నిర్వహించగానే, ఇంతవరకు అద్దె భవనంలో కొనసగుచున్న వెలుగు కార్యాలయాన్ని ఈ భవనంలోనికి తరలించెదరు. [20]
- అన్నగారి సంత:- పంగులూరు గ్రామములోని వ్యవసాయ మర్కెట్ కమిటీ ఆవరణలో ఈ సంతను, 2015,అక్టోబరు-9వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభించెదరు. ఈ సంతను ప్రతి శుక్రవారం నిర్వహించెదరు. [15]
- బ్యాంకులు:- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కోడ్ నం. 6979., ఫోన్ నం. 08593/258229.
- త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములో, నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ సాయినాధ శుద్ధజల కేంద్రాన్ని, 2016,ఫిబ్రవరి-10న ప్రారంభించారు. ఈ కేంద్రంలో 20 లీటర్ల శుద్ధిచేసిన త్రాగునీటిన నాలుగు రూపాయలకే అందజేసెదరు. [23]
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
వెంకటాయకుంట:- 12.96ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంట, పంగులూరు గ్రామ దక్షిణ ప్రాంత రైతుల కల్పతరువు. ఈ కుంటలో ఇటీవల నీరు-చెట్టు పథకం ద్వారా పూడిక తీత పనులు నిర్వహించారు. [19]
గ్రామ పంచాయతీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలొ శ్రీమతి దాచిన నీరజ, సర్పంచిగా ఎన్నికైనారు. ఈమె 25-11-2013న మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనారు.[3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ తేనె అంకమ్మ తల్లి ఆలయo
పంగులూరి గ్రామ దేవత శ్రీ తేనె అంకమ్మ తల్లి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని, 27 నవంబరు 2013 బుధవారం నాడు, వేదపండితులు, 11 మందిఋత్విక్కులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. విగ్రహ దాత శ్రీ గన్నవరపు హనుమంతరావు ఆధ్వర్యంలో, భక్తులకు అన్నసంతర్పణ జరిగినది.[4]
శ్రీ గంగా భాగీరథీ సమేత శ్రీ భీమలింగేశ్వరస్వామి వారి ఆలయo
పంగులూరు గ్రామములోని శ్రీ భీమలింగేశ్వరస్వామి వారి ఆలయ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక కళ్యాణమంటపం నిర్మించుచున్నారు. గ్రామస్థులు రు.10 లక్షలు చెల్లించారు. దేవస్థానంవారు రు. 81 లక్షలు విడుదల చేశారు. 2014, ఫిబ్రవరికి నిర్మాణం పూర్తి అగును.[5] ఈ గ్రామములోని భీమలింగేశ్వరస్వామి ఆలయానికి 52.25 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. ఆదాయం=రు.1.5 లక్షలు., ఈ ఆలయ ప్రస్తుత పరిస్థితి ఏమీ బాగోలేదు. పురాతన రథం శిధిలమైనది. రథశాల గతంలో కూలిపోయినది. ఈ పరిస్థితికి స్పందించిన దాతలు, ఆలయప్రాంగణంలో రు. 20 లక్షల వ్యయంతో, నూతనంగా భోజనశాల మరియూ వాహనశాల నిర్మించి ఆలయ కమిటీవారికి అప్పగించారు.
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. శుక్ల త్రయోదశి నాడు ఈ ఉత్సవాలు ప్రారంభమగును. చతుర్దశి నాడు స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. పౌర్ణమి నాడు మద్యాహ్నం అన్నసంతర్పణతో ఉత్సవాలు సమాప్తమవుతవి. ఈ ఆలయంలో 2014,మే-12, సోమవారం నాడు దాతలు సమకూర్చిన నాగేంద్రస్వామివారి విగ్రహం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి విగ్రహం, ధ్యానపరమేశ్వరమూర్తి విగ్రహాలను ఆవిష్కరించారు. [8]&[10]
ఈ ఆలయంలో 2016,మే నెల (వైశాఖమాసం) లో, ఈ ఆలయ 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించుచున్నారు. [24]
ఈ ఆలయప్రాంగణంలో 2015,నవంబరు-28వ తేదీ శనివారం ఉదయం 9-50 గంటలకు, శ్రీ అభయంజనేయస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని దాతలు శ్రీ వల్లభనేని రవికుమార్, మాధవీలత దంపతులు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా, 27వతేదీ శుక్రవారంనాడు, నిత్యపూజ, వాస్తుపూజ, హోమపూజ, పర్యగ్నీకరణం, నవగ్రహ మండపారధన తదితర పూజధికాలను, శైవాగమ పండితుల పర్యవేక్షణలో నిర్వహించారు. [17]&[18]
శ్రీ రుక్మిణీ సత్యభా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం
ఈ ఆలయం శిధిలావస్థలో ఉన్నది. ధ్వజస్థంభం ఒరిగిపోయినది. పునర్నిర్మాణం అవసరం. ఈ పరిస్థితికి స్పందించిన దాతలు, ప్రధానాలయంపైన ఉన్న, శిధిలమైన పురాణకకథలకు సంబంధించిన, 24 బొమ్మలకు, రు. రెండు లక్షల వ్యయంతో మరమ్మత్తు చేయించి, రంగులద్దించారు.[6] [9] + [10]
ఈ ఆలయంలో జీవధ్వజ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,జూన్-4వ తేదీ గురువారం నుండి ప్రారంభమైనవి. ఈ సందర్భంగా ఉదయం, ఆలయంలో భగవత్ ప్రార్ధన, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ద్వాదశసూక్త పారాయణం, వాస్తుహోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అంకురారోపణ, నవగ్రహ ఆరధన, అగ్నిప్రతిష్ఠపన నిర్వహించారు. 5వ తేదీ శుక్రవారంనాడు, హోమాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆరవ తేదీ శనివారంనాడు, నూతన జీవ ధ్వజస్థంభం, గ్రామంలో ప్రతిష్ఠించనున్న సీతలాంబ అమ్మవారి ప్రతిరూపం, ఆంజనేయ, గరుడ మూర్తులకు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ప్రతిష్ఠా మూర్తులకు మేళతాళాల నడుమ గ్రామోత్సవం నిర్వహించగా, గ్రామస్థులు అడుగడుగునా నీరాజనాలు పట్టినారు. ఈ వేడుకల నేపథ్యంలో పంగులూరు గ్రామములో పండుగ వాతావరణం నెలకొన్నది. బంధుమిత్రుల రాకతో, గ్రామస్థుల ఇళ్ళలో సందడి నెలకొన్నది. 7వ తేదీ ఆదివారంనాడు, ఈ ఆలయంలో జీవధ్వజస్థంభం, సీతలాంబా అమ్మవారిప్రతిష్ఠా కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అంధకళాకారుల సంగీత విభావరి, ఆహుతులను ఆకట్టుకున్నది. ఈ ప్రతిష్ఠోత్సవాల సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు. [13]&[14]
శ్రీ రామాలయం
పంగులూరు గ్రామంలోని బ్రాహ్మణ వీధిలోని రామాలయంలోనూ మరియూ ఎస్.సి.కాలనీలోని రామాలయం వద్ద, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అదికసంఖ్యలో పాల్గొనెదరు. [7]
శ్రీ రేణుకమ్మ తల్లి ఆలయం
పంగులూరు గ్రామం నడిబొడ్డున ఉన్న ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక కొలువులు, 2014, ఆగష్టు-20, బుధవారం తో ముగిసినవి. రాష్ట్రం నలుమూలల నుండి 'బాచిన" వంశస్థులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మద్యాహ్నం ఆలయంలో భారీగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. [11]
శ్రీ పోలెరమ్మ దేవస్థానము
ముఖ్యంగా చెప్పాలంటె పడమటి బజారున వున్న పోలెరమ్మ దేవస్థానము యెంతో ప్రాముఖ్యం చెందినంది. ఇక్కడ అమ్మవారికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర వుంది, అమ్మవారికి ప్రతి ఆదివారం పూజలు భజనలు చేస్తూవుంటారు. గ్రామ ప్రజలు తమ తమ మొక్కులును వివిధ రూపాలలొ చెల్లిస్తూవుంటారు. ఫ్రతి సంవత్సరం జాతరలు చేస్తారు.
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
పంగులూరు గ్రామంలోని మేకల సీతారామిరెడ్డి క్రీడా అకాడమీలో 9 సంవత్సరాలుగా శిక్షణ పొందుచున్న క్రీడాకారుడు పాలపర్తి శ్రీను, 2016,ఫిబ్రవరిలో అసోం రాష్ట్రంలో నిర్వహించు అంతర్జాతీయ ఖో-ఖో పోటీలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైనాడు. ఇతడు 2015,నవంబరు-21 నుండి 27 వరకు మహరాష్ట్రలోని షోలాపూరులో నిర్వహించిన సీనియర్ ఖో-ఖో పోటీలలో పాల్గొని, తన అనన్య సామన్యమైన ప్రతిభ ప్రదర్శింనాడు. ఇతడు 2005-2006 నుండి జిల్లాస్థాయిలో 30సార్లు, రాష్ట్రస్థాయిలో 15 సార్లు మరియు జాతీయస్థాయిలో 15 సార్లు పాల్గొని బహుమతులు అందుకున్నాడు. [21]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,228.[7] ఇందులో పురుషుల సంఖ్య 3,086, మహిళల సంఖ్య 3,142, గ్రామంలో నివాస గృహాలు 1,661 ఉన్నాయి.
మండలంలోని గ్రామాలు
- అలవాలపాడు
- ఆరికట్లవారిపాలెం
- రామకూరు
- కొండ మంజులూరు
- నార్నె వారి పాలెం
- బైట మంజులూరు
- ముప్పవరం
- కొండమూరు
- కోటపాడు
- బుధవాడ
- కల్లంవారి పాలెం
- జనకవరo
- జే.పంగులూరు
- రేణింగవరం
- కాశ్యపురం
- తూర్పు తక్కెళ్లపాడు
- తూర్పు కొప్పెరపాడు
- చందలూరు(జే.పంగులూరు)
- నూజెండ్లపల్లి
- చినమల్లవరం
- జాగర్లమూడివారిపాలెం
- భగవాన్ రాజు పాలెం
మూలములు
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ ఈనాడు ప్రకాశం/అద్దంకి; జనవరి-7,2014; 2వ పేజీ.
- ↑ ఈనాడు ప్రకాశం/అద్దంకి, 26 నవంబరు,2013. 1వ పేజీ.
- ↑ ఈనాడు ప్రకాశం/అద్దంకి,28-11-2013,3వ పేజీ.
- ↑ ఈనాడు,ప్రకాశం/అద్దంకి,డిసెంబరు-21,2013.3వ పేజీ.
- ↑ ఈనాడు ప్రకాశం/అద్దంకి; జనవరి-4,2014;1వపేజీ.
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు
[7] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,ఏప్రిల్-9; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,మే-13; 5వపేజీ. [10] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జులై-10; 1వపేజీ. [11] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,ఆగష్టు-22; 1వపేజీ. [12] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మార్చి-16; 2వపేజీ. [13] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-5; 3వపేజీ. [14] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,జూన్-8; 1వపేజీ. [15] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,అక్టోబరు-9; 2వపేజీ. [16] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,నవంబరు-3; 3వపేజీ. [17] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,నవంబరు-26; 3వపేజీ. [18] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,నవంబరు-28&30; 2వపేజీ. [19] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,డిసెంబరు-3; 3వపేజీ. [20] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,డిసెంబరు-26; 2వపేజీ. [21] ఈనాడు ప్రకాశం; 2016,జనవరి-5; 7వపేజీ. [22] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,జనవరి-15; 3వపేజీ. [23] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,ఫిబ్రవరి-11; 2వపేజీ. [24] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,మే-22; 2వపేజీ.