Coordinates: 16°44′48″N 77°29′44″E / 16.746631°N 77.495681°E / 16.746631; 77.495681

నారాయణపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నారాయణపేట, తెలంగాణ రాష్ట్రములోని నారాయణపేట జిల్లా, నారాయణపేట మండలానికి చెందిన గ్రామం/పట్టణం.[1][2]

నారాయణపేట
—  రెవిన్యూ గ్రామం  —
నారాయణపేట is located in తెలంగాణ
నారాయణపేట
నారాయణపేట
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°44′48″N 77°29′44″E / 16.746631°N 77.495681°E / 16.746631; 77.495681
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నారాయణపేట
మండలం దామరగిద్ద
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 509 407
ఎస్.టి.డి కోడ్
నారాయణపేటలోని భవానీమాత దేవాలయం
అనంతసేన స్వామి దేవాలయం, నారాయణపేట

ఇది హైదరాబాదుకు 168 కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. 2016 అక్టోబరు 11 న పునర్వ్యవస్థీకరించిన మహబూబ్ నగర్ జిల్లాలో చేరిన ఈ గ్రామం,[3]  2019 ఫిబ్రవరి 17 న నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసినపుడు, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[4] ఇది రెండవ గ్రేడు మున్సిపాలిటీగా కొనసాగుతోంది.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 97,838 - పురుషులు 48,769 - స్త్రీలు 49,069.అక్షరాస్యుల సంఖ్య 50110.[5]. పిన్ కోడ్: 509210.మండలంలో పట్టణ జనాభా 41539 కాగా, గ్రామీణ జనాభా 56235.

పురపాలక సంఘం[మార్చు]

పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో, మొట్టమొదటిసారిగా నారాయణపేట పురపాలక సంఘాన్ని1945-46లో ఏర్పాటుచేశారు. మధ్యలో కొంతకాలం నగరపంచాయతీగా కొనసాగి, ప్రస్తుతం రెండో గ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతోంది.

రవాణా సదుపాయాలు[మార్చు]

నారాయణపేట పట్టణానికి హైదరాబాదు నుండి మహబూబ్ నగర్ మీదుగా మంచి బస్సు సౌకర్యము ఉంది. రంగారెడ్డి జిల్లా తాండూరు నుండి కోస్గి, మద్దూరుల మీదుగా, కర్ణాటక రాష్ట్రం నుండి కూడా బస్సు సౌకర్యము ఉంది. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రస్థానమైననూ రైలు సౌకర్యం లేదు. సమీపంలోని రైలుస్టేషను దేవరకద్ర. ఇది నారాయణపేట నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాండూరు రైల్వే స్టేషను 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటకలోని యాద్గిర్ రైల్వే స్టేషను నారాయణపేట నుండి 51 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రత్యేకం[మార్చు]

ఇది పట్టు చీరలకు, బంగారు ఆభరణాల వ్యాపారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు జిల్లాలోనే ముఖ్య వ్యాపార కేంద్రంగా విలసిల్లిననూ, ప్రస్తుతం పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఈ పట్టణంలో ప్రసిద్ధి చెందిన కొండపల్లి చెరువు ఉంది.

విద్యాసంస్థలు[మార్చు]

శ్రీ సరస్వతి శిశుమందిర్, నారాయణపేట
  • ప్రభుత్వ పాఠశాలలు - 10
  • శ్రీ సరస్వతి శిశుమందిరాలు - 5
  • డిగ్రీ కళాశాలలు - 2
  • జూనియర్ కళాశాలలు - 5
  • ఇంజనీరింగ్ కళాశాలలు - 0
  • బిఇడి కళాశాలలు - 3
  • ఐ‌టిఐ - 1
  • వొకేషనల్ కళాశాలలు - 2

బ్యాంకులు[మార్చు]

అభివృద్ధి పనులు[మార్చు]

కొండారెడ్డి పల్లి చెరువు ప్రవేశం
కొండారెడ్డి పల్లి చెరువు
  • 2022 మే 9: టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో 20కోట్ల రూపాయలతో నిర్మించనున్న గోల్డ్‌ సోక్‌ మార్కెట్‌, 4 కోట్ల రూపాయలతో నిర్మించే కొండారెడ్డిపల్లి మినీ ట్యాంక్‌ బండ్‌, 1.20 కోట్ల రూపాయలతో ఆరో వార్డులో నిర్మించనున్న పార్కు, టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో బీసీ కాలనీ పార్కు వద్ద 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న గోల్డ్‌ సోక్‌ మార్కెట్‌, పట్టణ క్రీడాకారుల కోసం 6.65 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మినీ స్టేడియం, ఎర్రగుట్ట వద్ద 2 కోట్ల రూపాయలతో నిర్మించే జిల్లా గ్రంథాలయం భవన నిర్మాణం, రజకుల కోసం 1 కోటి రూపాయలతో నిర్మించే ఆధునిక లాండ్రీ, 12 కోట్ల రూపాయలతో పట్టణంలో నిర్మించనున్న సీసీ రోడ్లు, బారంబావి సమీపంలో 87.45 లక్షల రూపాయలతో మిషన్‌ వస్ర్తాలయ పథకం కింద నిర్మించనున్న చైల్డ్‌ హోం, 1 కోటి రూపాయలతో చేపట్టే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులకు 2022 మే 9న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశాడు. పాత బస్టాండ్‌ వద్ద 1.35 కోట్ల రూపాయలతో నిర్మించిన నాన్‌వెజ్‌ మార్కెట్‌ ను, 1.10 కోట్ల రూపాయలతో పేరపళ్ల రోడ్డులో నిర్మించిన వృద్ధాశ్రమం, సింగారం వద్ద మిషన్‌ భగీరథ పంప్‌ హౌస్‌, సబ్‌ స్టేషన్‌ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌. రాజేందర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యేడా. సి లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే వి.ఎం. అబ్రహం, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి, సురభి వాణీ దేవి, కార్పోరేషన్ చైర్మన్లు రమావత్ వల్యా నాయక్, అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఇంతియాజ్ ఇసాక్ ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6][7]
  • 2022 జూన్ 6: తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు 2022 జూన్ 6న 56 కోట్ల‌ రూపాయలతో నిర్మించనున్న 390 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి, 1.25 కోట్ల‌ రూపాయలతో ఏర్పాటుచేయనున్న టీ డ‌యాగ్నోస్టిక్ నిర్మాణాల‌కు శంకుస్థాప‌న చేసి, 5.98 కోట్ల రూపాయలతో ఎర్రగుట్ట నుండి ఎక్లాస్ మీదుగా తెలంగాణ - కర్ణాటక సరిహద్దు వరకు నిర్మించిన 5.5 కిలోమీటర్ల రోడ్డు, 100 బెడ్ మాడ్యులర్ చిల్డ్రన్ దవాఖానలో రూ. కోటి 25 లక్షల వ్యయంతో కొత్త‌గా ఏర్పాటు చేసిన డ‌యాల‌సిస్ యూనిట్‌ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఎస్. రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ వనజ, కలెక్టర్ హరిచందన, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[8][9]
  • 2023 జనవరి 24: 80 ల‌క్ష‌ల రూపాయలతో ఏర్పాటుచేసిన సీనియ‌ర్ సిటిజెన్స్ కోసం పార్కు, 6 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రెటేడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్‌, 57 లక్షల రూపాయలతో నిర్మించిన సఖీ కేంద్రం, కోటి రూపాయలతో నిర్మించిన దోభీ ఘాట్ ప్రారంభోత్సవం... 62.10 కోట్ల రూపాయలతో నిర్మించే జిల్లా క‌లెక్ట‌రేట్ కార్యాలయం, 38.50 కోట్ల రూపాయలతో నిర్మించే ఎస్పీ కార్యాల‌యం,10 కోట్ల రూపాయలతో రామాల‌యం, 2 కోట్ల రూపాయలతో మైనార్టీ సోద‌రుల కోసం ఈద్గా నిర్మాణానికి 2023 జనవరి 24న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్‌ అలీ, ఇతర మంత్రులు కలిసి శంకుస్థాప‌న‌లు చేశారు.[10]

ప్రధాన సంఘటనలు[మార్చు]

  • 2005, ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు మావోయిస్టుల తూటాలకు స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, మక్తల్ శాసనసభ్యుడు అయిన చిట్టెం నర్సిరెడ్డితో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు[11]. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరణించినవారిలో నర్సిరెడ్డితో పాటు పురపాలక సంఘం కమీషనర్ రాంమోహన్, నర్సిరెడ్డి కుమారుడు చిట్టెం వెంకటేశ్వరరెడ్డి కూడా ఉన్నారు.
  • 2000 అక్టోబరు 16 లో సినియర్ జర్నలిస్ట్ కొటకొండ యెడ్ల విజయరాజు అధ్వర్యంలో వార్తతరంగాలు తెలుగు దినపత్రిక ప్రారంబించడము జరిగింది. అప్పటి మంత్రి యెల్కొటి యల్లారెడ్ది, మాజీ ఎమ్మెల్యే చిట్టం నర్సిరెడ్డి, కొదంగల్ యెమ్మెల్యే సుర్యనారాయణ, బిజెపి నాయకుడు నాగురవు నామజి, అప్పటి మునిసిపల్ చైర్మన్ గడ్డం సాయిబన్న తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
  3. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  4. "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
  5. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  6. telugu, NT News (2022-05-09). "నారాయణపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-05-09. Retrieved 2022-05-09.
  7. "మంత్రి కేటీఆర్‌ పర్యటనకు ఏర్పాట్లు". EENADU. 2022-05-09. Archived from the original on 2022-05-09. Retrieved 2022-05-09.
  8. telugu, NT News (2022-06-06). "ఆ రెండు పార్టీలు అధికారంలోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేదు : మంత్రి హ‌రీశ్‌రావు". Namasthe Telangana. Archived from the original on 2022-06-06. Retrieved 2022-06-06.
  9. Telugu, ntv (2022-06-06). "Harish Rao: నారాయ‌ణ‌పేట‌లో ప‌ర్య‌ట‌న‌.. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపన". NTV. Archived from the original on 2022-06-06. Retrieved 2022-06-06.
  10. "KTR Narayanpet Tour 184.42 కోట్ల అభివృద్ధి పనులు". ETV Bharat News. 2023-01-24. Archived from the original on 2023-01-24. Retrieved 2023-01-24.
  11. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 10, తేది 15-08-2008

వెలుపలి లంకెలు[మార్చు]