రామాయణంలోని పాత్రల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామాయణం చిత్రపటంలో - శ్రీరాముడు, సీతమ్మ సింహాసనాన్ని అధిష్టించారు, ఋషి వశిష్ఠ, శ్రీరాముని సోదరులు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నలు చుట్టూ ఉండగా హనుమంతుడు రాముని పాదాల చెంత కూర్చున్నాడు.

హిందూ సాహిత్యంలోని రెండు ప్రధాన సంస్కృత ప్రాచీన ఇతిహాసాలలో రామాయణం ఒకటి. దీనిని వాల్మీకి మహర్షి రచించారు.[1] ఇందులో కనిపించే ముఖ్యమైన పాత్రల జాబితా ఇది.

(ఆంగ్ల అక్షర క్రమంలో..)

అగస్త్యుడు[మార్చు]

అగస్త్య మహర్షి పులస్త్య మహర్షి కుమారుడు.[2] విశ్రవ ఋషి సోదరుడు. అతను రావణునికి మేనమామ. అగస్త్యుడు, అతని భార్య లోపాముద్ర వనవాస సమయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులను కలుసుకున్నారు. వారికి దివ్యమైన విల్లు, బాణం ఇచ్చారు.

అహల్య[మార్చు]

బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. అహల్య మహర్షి గౌతమ మహర్షి భార్య. అనేక హిందూ గ్రంధాలు ఆమె దేవతల రాజు ఇంద్రుని చేత మోహింపబడిందని, ఆమె భర్త అనుమానం వల్ల శపించబడిందని, విష్ణువు అవతారంమైన శ్రీరాముడి పాద స్పర్శతో శాప విముక్తి పొందింది.

అకంపన[మార్చు]

అకంపన రావణుని మామ. సుమాలి, కేతుమతి దంపతుల పదిమంది కుమారులలో ఒకడు. అతనికి నలుగురు సోదరీమణులు ఉన్నారు. శూర్పణఖతో పాటు ఖర మరియు దూషణల మధ్య జరిగిన యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన వారిలో అతను ఒకడు. ఘోరమైన మారణహోమం నుండి తప్పించుకున్న తరువాత, అతను సీతను అపహరించడానికి రావణుడిని ప్రేరేపించాడు, తద్వారా పరోక్షంగా అతన్ని యుద్ధం వెనుక సూత్రధారులలో ఒకరిగా చేసాడు. ఆ తర్వాత హనుమంతుడుతో యుద్ధంలో ఆయన మరణించాడు.

అక్షయకుమార[మార్చు]

అక్షయకుమారుడు లంకాధిపతి రావణుడు, మండోదరి కుమారుడు. రామాయణ ఇతిహాసంలో ఒక శక్తివంతమైన రాక్షస యోధుడు, రావణుని సైన్యానికి ప్రధాన కమాండర్. అశోక వాటికలో జరిగిన యుద్ధంలో హనుమంతుడు చేత చంపబడ్డాడు.

అంగద[మార్చు]

అంగద వానరుడు, ఆయన వాలి, తారల కుమారుడు. శ్రీరాముడు తన భార్య సీతను కనుగొని, ఆమె అపహరణకర్త అయిన రారావణుడుతో పోరాడటానికి అంగద సహాయం చేశాడు.

అంజన[మార్చు]

అంజన హనుమంతుని తల్లి. పురాణాల ప్రకారం, అంజనా పుంజికస్తల అనే అప్సరస, ఆమె భూమిపై వానర యువరాణిగా జన్మించింది. వానర అధిపతి అయిన కేసరిని వివాహం చేసుకుంది. ఈమెకు వాయుదేవుడి అంశతో హనుమంతుడు జన్మించాడు.[3]

అతికాయ[మార్చు]

అతికాయుడు, రావణుడు, అతని రెండవ భార్య ధాన్యమాలిని కుమారుడు. వాయు సలహా మేరకు యుద్ధంలో లక్ష్మణుడు ఆయనను బ్రహ్మాస్త్రం ప్రయోగించి చంపాడు.[4]

భరతుడు[మార్చు]

భరతుడు, దశరథుని రెండవ కుమారుడు, కైకేయికి జన్మించాడు. శ్రీరాముని తమ్ముడు. అతను సీత బంధువు మాండవిని వివాహం చేసుకున్నాడు, అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.[5]

చంద్రభాగ[మార్చు]

చంద్రభాగ, జనకుని తమ్ముడు కుశధ్వజుని భార్య. చంద్రభాగకు ఇద్దరు కుమార్తెలు మాండవి, శ్రుతకీర్తిలు వరుసగా రాముని తమ్ముళ్లు భరత, శత్రుఘ్నలను వివాహం చేసుకున్నారు.

దశరథుడు[మార్చు]

దశరథుడు అయోధ్యకు రాజు. అతనికి ముగ్గురు భార్యలు కౌసల్య, కైకేయి, సుమిత్ర. వీరికి నలుగురు పుత్రులు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు. కౌసల్య కుమారుడు రాముడు, సుమిత్ర కుమారులు లక్ష్మణ శతృఘ్నులు, కైకేయి కుమారుడు భరతుడు.[6] అలాగే దశరథుడికి శాంత అనే కూతురు కూడా ఉంది. ఒకసారి, కైకేయి ఒక యుద్ధంలో దశరథుడిని రక్షించింది, ప్రతిఫలంగా, ఆమె తన భర్త నుండి రెండు వరాలను పొందింది. మంథర చేత తారుమారు చేయబడిన ఆమె దశరథుడిని తమ కుమారుడైన భరతుడిని యువరాజుగా చేసి, రాముడిని పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసానికి పంపమని కోరింది. రాముడు వనవాసానికి వెళ్లాక దశరథుడు గుండె పగిలి చనిపోయాడు.

దేవాంతక[మార్చు]

దేవాంతకుడు రావణుని కుమారుడు. హనుమంతుని చేతిలో చంపబడ్డాడు.

ధాన్యమాలిని[మార్చు]

ధాన్యమాలిని రావణుని రెండవ భార్య. ఆమె మూలం తెలియదు కానీ కొన్ని కథలు ఆమెను మయుడు కుమార్తె, మండోదరి సోదరి అని సూచిస్తాయి. ఆమె అతికాయుడు తల్లి.[7]

ధూమ్రాక్ష[మార్చు]

ధూమ్రాక్షుడు, దేవాంతకుడు రావణుని కుమారుడు. హనుమంతుని చేతిలో చంపబడ్డాడు.

దూషణ[మార్చు]

దూషణ నరమాంస భక్షక రాక్షసుడు. అతను ఖర కవల సోదరుడు, రావణుని బంధువు, కైకసి సోదరి రాకా కుమారుడు. వారు దండక వనాన్ని పాలించే రాక్షసులు. లక్ష్మణుడు శూర్పణఖను ముక్కు, చెవులు కోసి అవమానించిన తరువాత, ఖర, దూషణలు లక్ష్మణుడు, శ్రీరాములపై యుద్ధానికి వెళ్లారు. ఈ పోరులో దూషణ రాముడి చేతిలో హతమయ్యాడు.[8]

గంగా[మార్చు]

గంగా ఒక దేవత. హిమవాన్ కుమార్తె. భగీరథుని కోరికపై, ఆమె ఒక నది రూపాన్ని ధరించి, మహాశివుని సహాయంతో భూమిపైకి ప్రవహిస్తుంది. గంగా నదిగా మారింది.

గుహుడు[మార్చు]

గుహుడు నిషాద రాజు. శ్రీరాముని భక్తుడు.[9] అరణ్యవాసమునకు పోవుచున్న సీతారామ లక్ష్మణులను గంగా నదిని దాటించాడు. శ్రీరాముని చూచుటకు వచ్చుచుండగా ఇతడు అడ్డగించెను. రాముని చూచుటకై పోవుచున్నానని చెప్పిన పిదపనే గంగానదిని దాటి పోనిచ్చెను.

హనుమంతుడు[మార్చు]

హనుమంతుడు ఒక దివ్య వానర సహచరుడు. సీతారాముల దాసుడు, శ్రీరాముని భక్తుడు. ఇతిహాసం ప్రధాన వ్యక్తులలో హనుమంతుడు ఒకడు. అతను బ్రహ్మచారి, చిరంజీవులలో ఒకడు. హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమంతుడు, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడుని ఆరాధిస్తారు.

హేమ[మార్చు]

ఇంద్రుని ఆస్థానంలో హేమ అప్సరస. మాయాసురుడు స్వర్గాన్ని సందర్శించినప్పుడు, అతను ఆమెను చూసి వివాహం చేసుకున్నాడు. వారికి మాయావి, దుందుభి అనే ఇద్దరు కుమారులు, మండోదరి అనే కుమార్తె ఉన్నారు. ఆమె తరువాత వారిని విడిచిపెట్టి స్వర్గానికి తిరిగి వెళ్ళింది.

ఇంద్రజిత్[మార్చు]

మేఘనాదుడు, రావణుడికి, మండోదరికి జన్మించిన కుమారుడు. అతను గొప్ప యోధుడు, భ్రాంతుల మాస్టర్ అని వర్ణించబడింది. అతన్ని ఇంద్రారి అని కూడా అంటారు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్దం వలే ఉండడం వల్ల వీనికి మేఘనాదుడు అని నామకరణం చేశారు. స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని జయించినందున ఇంద్రజిత్తు అయ్యాడు.

రామ రావణుల మధ్య జరిగిన మహాయుద్ధములో ఇంద్రజిత్తు చురుకైన పాత్రను పోషించాడు. ఇంద్రజిత్తు ఆ యుద్ధములో రామలక్ష్మణులను నాగపాశముతో బంధించాడు. అయితే గరుడుడు వారిని నాగాపాశమునుండి విడిపించాడు.

జాంబవంతుడు[మార్చు]

జాంబవంతుడు ఎలుగుబంట్ల రాజుగా అభివర్ణించారు. రాముడు రావణుడితో చేసిన పోరాటంలో అతనికి సహాయం చేయడానికి బ్రహ్మ సృష్టించాడు.

జనకుడు[మార్చు]

జనకుడు, మిథిలా నగరానికి రాజు. రామాయణంలో సీతాదేవి తండ్రిగా ప్రసిద్ధుడు. ఊర్మిళలకు కూడా తండ్రి.[10]

జంబుమాలి[మార్చు]

లంక సైన్యాధిపతి ప్రహస్తుడు ఎనిమిది మంది కుమారులలో జంబుమాలి ఒకడు. అశోక వాటికలో జరిగిన యుద్ధంలో హనుమంతుడు చేత చంపబడ్డాడు.

జటాయువు[మార్చు]

రామాయణంలో, జటాయువు ఒక దైవిక పక్షి. అతను దశరథ మహారాజుకి స్నేహితుడు. జటాయువు సీతాదేవిని అపహరించే సమయంలో రక్షించడానికి ప్రయత్నించినప్పుడు రావణుడు చేత చంపబడ్డాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలోని ఏటపాక గ్రామంలో జటాయువు మందిరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో జటాయువు అంత్యక్రియలు శ్రీరాముడు పూర్తి చేశాడని స్థలపురాణం.

కబంధుడు[మార్చు]

కబంధుడు ఓ వికృతరూపము గల రాక్షసుడు., అతను శ్రీరాముడిచేత సంహరింపబడి, శాపం నుండి విముక్తి పొందుతాడు.

కైకసి[మార్చు]

కైకసి రామాయణంలో రాక్షస రాజు సుమాలి, కేతుమతిల కుమార్తె. ఈమె సోదరులు మారీచుడు, సుబాహుడు. ఆమె విశ్రవసుడి భార్య. ఆమె రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖలకు తల్లి.[11][12]

కైకేయి[మార్చు]

కైకేయి, దశరథ రాజు మూడవ భార్య, భరతుని తల్లి. తన దాసి అయిన మంథర మాట విని శ్రీరాముడిని 14 సంవత్సరాలు వనవాసానికి పంపమని, భరతునికి రాజ్యాభిషేకం జరిపించమని దశరథుని కోరుకుంటుంది. ఇందువలన సీతారాముల వనవాసానికి ప్రధాన కారకురాలయింది.

కౌసల్య[మార్చు]

కౌసల్య శ్రీరాముని తల్లి, దశరథుని ముగ్గురు భార్యలలో పెద్దది. అయోధ్య రాజ్యానికి మహారాణి. ఆమె మగథ సామ్రాజ్యపు(కోసల) రాకుమారి. ఆమె రాజుకు ఇష్టమైన భార్యగా వర్ణించబడింది.

ఖర[మార్చు]

ఖర నరమాంస భక్షక రాక్షసుడు. అతను దూషణ కవల సోదరుడు. రావణుని బంధువు, కైకసి సోదరి రాకా కుమారుడు. వారు దండక వనాన్ని పాలించే రాక్షసులు. లక్ష్మణుడు శూర్పణఖను ముక్కు, చెవులు కోసి అవమానించిన తరువాత, ఖర, దూషణలు లక్ష్మణుడు, శ్రీరాములపై యుద్ధానికి వెళ్లారు. ఈ పోరులో ఖర రాముడి చేతిలో హతమయ్యాడు.[13]

కుంభకర్ణుడు[మార్చు]

కుంభకర్ణుడు, రావణుని తమ్ముడైన ఒక రాక్షసుడు. అసాధారణ బలవంతుడు, మహాకాయుడు. కుంభకర్ణుడు విశ్రవుడు, కైకసిల రెండవ కుమారుడు. అతను మంచి స్వభావం గల గొప్ప యోధుడిగా వర్ణించబడ్డాడు. బ్రహ్మ వరం ఇచ్చినప్పుడు, అతను శాశ్వతమైన నిద్రను కోరుకుని మోసపోయాడు. ఆ తరువాత, సోదర ప్రేమతో రావణుడు ఆ వరాన్ని సవరించమని బ్రహ్మను వేడుకున్నాడు. దీనికి బ్రహ్మ కుంభకర్ణుడిని ఆరు నెలలు నిద్రపోయేలా, సంవత్సరంలో మిగిలిన ఆరు నెలలు మేల్కొని ఉండేలా చేసాడు. రావణుడు సీతాదేవిని అపహరించడాన్ని వ్యతిరేకించిన రాక్షసుల్లో ఇతను ఒకడు.

కుశుడు[మార్చు]

లవుడుతో పాటు కుశుడు సీతారాముల కుమారుడు. లవకుశలిద్దరు కవలపిల్లలు. అతను తన తండ్రి వలె నలుపు రంగు కలిగి ఉంటాడు.

లక్ష్మణుడు[మార్చు]

లక్ష్మణుడు దశరథ రాజు మూడవ కుమారుడు. రాముని సవతి సోదరుడు. అతను శత్రుఘ్న కవల సోదరుడు, ఇద్దరూ రాణి సుమిత్రకు జన్మించారు. తన సోదరుడికి చాలా అంకితభావంతో ఉన్నాడు. అతను సీతాదేవి చెల్లెలు ఊర్మిళను వివాహం చేసుకున్నాడు. సీతారాముల వనవాస సమయంలో అతను పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్రపోకుండా కాపాడినట్లు చెప్పబడింది.

లవుడు[మార్చు]

కుశుడుతో పాటు లవుడు సీతారాముల కుమారుడు. లవకుశలిద్దరు కవలపిల్లల్లో పెద్దవాడు. అతను తన తల్లివలె గోధుమ రంగునుకలిగి ఉంటాడు.

మాల్యవంతుడు[మార్చు]

మాల్యవంతుడు, దేవాసుర భయంకరుడయిన సుకేశుని ముగ్గురు కుమారులలో ఒకడు. అతనికి మాలి, సుమాలి అనే సోదరులున్నారు. అతను ధర్మ వర్తనుడు. అతను సుందరిని వివాహం చేసుకున్నాడు. వీరికి వజ్రముష్టి, విరూపాక్ష, దుర్ముఖ, సుప్తఖ్న, యజ్ఞకోశ, మత్త, ఉన్మత్త అనే కుమారులతో పాటు కుమార్తె నల ఉంది. రావణుడు సీతాదేవిని అపహరించడాన్ని వ్యతిరేకించిన రాక్షసుల్లో ఇతను కూడా ఒకడు.

మాండవి[మార్చు]

మాండవి, రాజు కుశధ్వజుడు, రాణి చంద్రభాగల కుమార్తె. శ్రీరాముని తమ్ముడు భరతుని భార్య.[14] వారికి తక్ష, పుష్కల అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు శ్రుతకీర్తి అనే చెల్లెలు కూడా ఉంది.

మండోదరి[మార్చు]

మండోదరి రావణుడి పెద్ద భార్య. ఈమె మహా పతివ్రత. ఆమె మాయాసుర కుమార్తె, ఆమె తల్లి హేమ అనబడే దేవకన్య. మండోదరికి ఇంద్రజిత్తు, అక్షయకుమారుడు అనే ఇద్దరు కుమారులున్నారు. సీతాదేవిని రావణుడు అపహరించడాన్ని వ్యతిరేకించిన వారిలో ఆమె ఒకరు.

మంథర[మార్చు]

మంథర, దశరథుని భార్య కైకేయి సేవకురాలు. ఆమె కపటబుద్ధితో వాక్చాతుర్యం కలిగిన మహిళ. శ్రీరాముని పట్టాభిషేకం జరుగబోతున్న వార్త విని పట్టణమంతా కోలాహలంగా ఉన్న సమయంలో మంథర కైకేయి మనసు విరిచి, దశరథుడు కైకేయికి ఇచ్చిన వరాలను గుర్తుచేసి, భరతునకు పట్టాభిషేకం చేయవలసిందిగా కోరమని, శ్రీరాముడిని వనవాసానికి పంపవలసిందిగా కోరుటకు ఇది సరియైన అవకాశమని కైకేయికి నూరిపోసింది. ఈ విధంగా మంథర తన కుయుక్తులతో కైకేయి మనసు విరిచి, శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు రాజ్యం విడిచి, అరణ్యవాసం చేయటానికి ప్రధాన కారణంగా చరిత్రలో ఆమె నిలిచిపోయింది.[15]

మారీచుడు[మార్చు]

మారీచుడు, రాక్షస రాజైన సుందుడు, తాటకి దంపతుల కుమారుడు. అతను సుబాహుడు అన్న. మిక్కిలి జిత్తుల మారి. అతను బంగారు జింక రూపాన్ని ధరించి శ్రీరాముడి భార్య సీతాదేవిని అపహరించడంలో కీలకపాత్ర పోషిస్తాడు.

నల[మార్చు]

రావణుడితో యుద్ధ సమయంలో శ్రీరాముడికి సహాయం చేసిన వానరుడు నల. ఆయన రామసేతు ఇంజనీర్‌గా గుర్తింపు పొందాడు. నీల అతని కవల సోదరుడు[16]

నరాంతక[మార్చు]

నరాంతక రావణుని కుమారుడు. అతడు అంగదుడు చేత చంపబడ్డాడు.

నీల[మార్చు]

రావణుడితో రాముడు చేసిన యుద్ధంలో వానర సైన్యానికి నీల సేనాధిపతి. అతని కవల సోదరుడు నలతో పాటు, అతను కూడా రామసేతును నిర్మించిన ఘనత పొందాడు.

నిర్వాణి[మార్చు]

నిర్వాణి ఒక యక్షిణి. ఆమె యక్ష రాజు సుకేతుని మేనకోడలు.

పరశురాముడు[మార్చు]

పరశురాముడు, విష్ణువు ఆరవ అవతారం. సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, శ్రీరామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. శ్రీరాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. ఇది పూర్తయినప్పుడు, అతడు శ్రీరాముడు విష్ణువు అవతారమని అంగీకరింస్తాడు.[17][18]

ప్రహస్తుడు[మార్చు]

ప్రహస్తుడు, సుమాలి, కేతుమతిల కుమారుడు. రావణుడికి మామ, లంక సైన్యానికి ప్రధాన కమాండర్.[19] ప్రహస్తుడు సుగ్రీవ సైన్యంలోని అనేకమంది యోధులను చంపాడు. శ్రీరాముడి సైన్యానికి నిజమైన ముప్పు అని కూడా ప్రహస్తుడు నిరూపించాడు. చివరికి లక్ష్మణుని చేతిలో చంపబడ్డాడు.[20]

రాముడు[మార్చు]

శ్రీరాముడు పురాణ కథానాయకుడు, హిందూ దేవతలలో ప్రముఖుడు. అతను త్రేతాయుగములోని విష్ణువు అవతారం. అతను కోసల రాజ్యానికి చెందిన దశరథ రాజు, అతని పెద్ద భార్య కౌసల్య కుమారుడు. అతను న్యాయం, ధర్మంల స్వరూపుడిగా పరిగణించబడ్డాడు. అతను మిథిలా యువరాణి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. లంకలో రావణుడి బారి నుండి ఆమెను రక్షించడానికి అతను చేసిన ప్రయత్నాలను రామాయణం వివరిస్తుంది.

రావణుడు[మార్చు]

రావణుడు రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడు. అతను విశ్రవుడు, కైకసిల కుమారుడు, లంకకు రాక్షసరాజు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు కలవాడు అయినా ధర్మాన్ని పాటించక పోతే అన్ని వ్యర్థమే అనడానికి అతను ఒక ఉదాహరణగా నిలిచాడు. శ్రీరాముడి భార్య సీతాదేవిని అతను అపహరించడం అనేది ఇతిహాసం సంఘర్షణకు దారితీసిన ముఖ్య ఘటన.

ఋష్యశృంగుడు[మార్చు]

ఋష్యశృంగుడు ఒక మహర్షి. దశరథమహారాజు అశ్వమేథ యాగము, పుత్రకామేష్టి యాగములకు అతను నాయకత్వం వహించాడు. ఋష్యశృంగుడి దేవాలయం, కర్ణాటక రాష్ట్రం శృంగేరికి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో ఉంది. శృంగేరికి ఆ పేరు ఋష్యశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా ప్రతీతి.

రుమ[మార్చు]

రుమ సుగ్రీవుని భార్య. ఆమె ప్రస్తావన ఇతిహాసంలోని కిష్కింధ కాండలో వచ్చింది. రుమ, సుగ్రీవుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ రుమ తండ్రి అంగీకరించలేదు. అందుకే, సుగ్రీవుడు హనుమంతుని సహాయంతో ఆమెను అపహరించి వివాహం చేసుకున్నాడు.[21] [22] [23]

సంపాతి[మార్చు]

సంపాతి ఒక గ్రద్ద పాత్ర. అతను జటాయువుకు అన్న. శ్రీరాముడికి మద్దతుదారు. తన దివ్యదృష్టితో సీతమ్మను గుర్తించి, ఆమె లంకలో ఉందని రాముడికి తెలియజేశాడు.

శాంత[మార్చు]

శాంత, దశరథుడు, అతని పెద్ద భార్య కౌసల్యల కుమార్తె. అయితే, ఆమెను అంగ రాజు రోమపాద దత్తత తీసుకున్నాడు. ఆమెకు ఋష్యశృంగ మహర్షితో వివాహం జరిగింది.

శబరి[మార్చు]

శబరి, శ్రీరాముని భక్తురాలు. ఆయన దర్శనానికై జీవితాంతం భక్తితో వేచియుండి చివరికి రామ దర్శనం పొందిన ధన్యజీవి. తన గురువు మాతంగ శ్రీరాముడిని పూజించమని ఆదేశించడంతో, ఆమె అతని కోసం చాలా సంవత్సరాలు వేచి ఉంది. సీత అపహరణ తర్వాత శబరి చివరకు రాముడిని కలుసుకుంది. సుగ్రీవుడు, హనుమంతుడిని కనుగొనడంలో ఆమె శ్రీరాముడికి సహాయం చేసింది. శ్రీరాముడు ఒకే ఒక్కసారి ఒకరి ఎంగిలి తిన్నాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. అదే శబరి ఎంగిలి![24]  

శత్రుఘ్నుడు[మార్చు]

శతృఘ్నుడు దశరథ రాజు చిన్న కుమారుడు. అతను రాణి సుమిత్రకు జన్మించాడు. లక్ష్మణునికి కవల సోదరుడు. అతను సీతాదేవి బంధువు శ్రుతకీర్తిని వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

శివుడు[మార్చు]

శివుడు, విష్ణు బ్రహ్మలతో పాటు హిందూమతంలోని అత్యున్నత త్రిమూర్తులలో భాగం. శ్రీరాముడు, రావణుడు ఇద్దరూ శివ భక్తులలో గొప్పవారె. అలాగే, ఇతిహాసం హనుమంతుడిని శివుని అవతారాలలో ఒకటిగా వివరిస్తుంది. ఆయన భార్య పార్వతి.

శ్రుతకీర్తి[మార్చు]

శ్రుతకీర్తి కుశధ్వజుడు, చంద్రభాగల కుమార్తె. కుశధ్వజుడు జనకుని తమ్ముడు. ఆమెకు మాండవి అనే అక్క కూడా ఉంది. ఆమెను శ్రీరాముని సోదరుడు శతృఘ్నుడు వివాహం చేసుకున్నాడు.

శూర్పణఖ[మార్చు]

శూర్పణఖ రామాయణంలోని ముఖ్యమైన పాత్రలలో ఇది ఒకటి. ఆమె విశ్రవసుడు, కైకసిల కుమార్తె, రావణుని చెల్లెలు.[25] ఆమె పంచవటి అరణ్యాన్ని సందర్శించినప్పుడు శ్రీరాముడిని కలుసుకుంది. అతని యవ్వన సౌందర్యానికి తక్షణమే ముగ్ధురాలైంది. శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు. శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోసివేస్తాడు. రావణాసురుడు రామునిపై పగబట్టడానికి ఇది కూడా ఒక కారణమని చరిత్రకారులు చెపుతారు.

సీతాదేవి[మార్చు]

సీతావేవి రామాయణంలో ప్రధానమైన స్త్రీ. వేదవతి పునర్జన్మ, సీతను మిథిలా రాజు జనకుడు తన సొంత కుమార్తెగా పెంచాడు. ఆమె అయోధ్యలోని రాముడిని వివాహం చేసుకుంది. అతని వనవాసం సమయంలో అతనితో కలిసి వచ్చింది. ఆమె తన సద్గుణం, అందానికి ప్రసిద్ధి చెందింది. ఆమె శ్రేయస్సు దేవత లక్ష్మిదేవి అవతారంగా పరిగణించబడుతుంది. జానకి, మైధిలి, వైదేహి, రమ అని కూడా ఆమెకు పేర్లు. ఆమెను సీతమ్మ తల్లిగా వివిధ రచనలలోను, కీర్తనలలోను ప్రస్తావిస్తారు[26].

సుబాహుడు[మార్చు]

సుబాహుడు ఒక రాక్షసుడు. అతను, అతని తల్లి తాటకి కలిసి మునులను, ముఖ్యంగా విశ్వామిత్రుడిని, వారి యజ్ఞాలను రక్త మాంసపు ముద్దలతో విఘాతం చేయడంలో ఎనలేని ఆనందాన్ని పొందారు. విశ్వామిత్రుడు ఈ తెగుళ్లను వదిలించుకోవడానికి సహాయం కోసం దశరథుడిని సంప్రదించాడు. దశరథుడు తన ఇద్దరు కుమారులు, రామలక్ష్మణులను విశ్వామిత్రునితో అడవికి పంపించాడు. సుబాహుడు, అతని సోదరుడు మారీచుడు వచ్చి మళ్ళీ యజ్ఞాలపై మాంసాన్ని, రక్తాన్ని వేయడానికి ప్రయత్నించినప్పుడు శ్రీరాముడు తన బాణంతో సుబాహుని చంపాడు.[27] అది చూసీన మారీచుడు లంకకు పారిపోయి, అక్కడ ఒక ఋషిగా తన జీవితాన్ని కొనసాగించాడు.

సుగ్రీవుడు[మార్చు]

వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వానరవీరులు. వీరి పాత్రలు రామాయణం కిష్కింధకాండములో వస్తాయి. సుగ్రీవుడు కిష్కింధ రాజ్యానికి వానర పాలకుడిగా విజయం సాధించాడు. రుమ అతని భార్య. అతను సూర్యుని ఆధ్యాత్మిక కుమారుడు. సుగ్రీవుడు తన భార్య సీతావేవిని రావణుని చెర నుండి విడిపించాలనే తపనతో శ్రీరాముడికి సహాయం చేశాడు.

సుకేతుడు[మార్చు]

సుకేతుడు వెయ్యి ఏనుగులతో సమానమైన బలంతో వారసుడి కోసం యజ్ఞం చేసిన యక్షుడు. కర్మకాండ తర్వాత అతనికి తాటకి అనే కూతురు పుట్టింది.

సుమాలి[మార్చు]

సుమాలి రాక్షస రాజు సుకేశ, గంధర్వ యువరాణి దేవవతి కుమారుడు. అతనికి మాల్యవాన, మాలి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. సుమాలి కేతుమతిని వివాహం చేసుకున్నాడు, అతనికి ప్రహస్త, అకంపన, వికట, కాళికాముఖ, ధూమ్రాక్ష, దండ, సుప్రస్వ, సంహ్రాది, ప్రఘాస, భాస్కర్ణ. ఇలా పది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు రాక, పుష్పోత్కట, కైకసి, కుంభనాశి ఉన్నారు. అతని కుమార్తెలలో ఒకరైన కైకసి విశ్రవ ఋషిని వివాహం చేసుకుంది, తరువాత రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖకు జన్మనిచ్చింది.

సుమంత్రుడు[మార్చు]

సుమంత్రుడు అయోధ్య ఆస్థానంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. అతను అయోధ్య పాలకులకు అత్యంత విధేయుడు. దశరథ రాజుకు అతను అత్యంత విశ్వసనీయుడు. దశరథుడు, దుర్వాసుడు మధ్య జరిగిన సంభాషణ నుండి అతను విన్న వాటితో సహా రాజ కుటుంబానికి సంబంధించిన అనేక రహస్యాలు అతనికి తెలుసు. వనవాసంలో శ్రీరాముడికి సహాయం చేశాడు.

సుమిత్ర[మార్చు]

సుమిత్ర అయోధ్య రాజు దశరథుని రెండవ భార్య. ఆమె కాశీరాజ్యపు రాకుమారి. పుత్రకామేష్టి యాగం చేసిన తరువాత యజ్ఞఫలం మూలంగా ఆమెకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అను కవలలు జన్మించారు.

సునయన[మార్చు]

సునయన మిథిలా రాణి, జనక రాజు భార్య. సీతాదేవి, ఊర్మిళల తల్లి.

తార[మార్చు]

తార వాలి భార్య. ఆమె అంగదుడు తల్లి. ఆమె కిష్కింధ రాణి, పంచకన్యలలో ఒకరిగా పరిగణించబడుతుంది.

తాటకి[మార్చు]

తాటకి ఒక అందమైన స్త్రీ, ఆమె ఒకసారి అగస్త్య మహర్షిని మోహింపజేయడానికి ప్రయత్నించి రాక్షసిగా రూపాంతరం చెందింది. జీవుల రక్తాన్ని తాగేది, ఆమె చూసిన ప్రతిదాన్ని చంపేది. శ్రీరాముడు సంహరించి ఆమెకు శాపవిముక్తి కలిగించాడు.

త్రిజట[మార్చు]

రావణుడు,తన భర్త శ్రీరాముడికి నమ్మకంగా ఉంటూ తనని మొండిగా కాదంటున్న సీతాదేవికి కాపలాగా ఉండే రాక్షసనులకి ఎలాగైనా ఆమెను తనతో పెళ్ళికి ఒప్పించమని ఆజ్ఞాపించాడు. రావణుడు వెళ్లిన తరువాత, ఎలాగైనా సీతాదేవి నిర్ణయాన్ని మార్చుకోమని రాక్షసులు ఆమెను వేధించడం మొదలుపెడతారు. అయితే వృద్ధురాలైన త్రిజట జోక్యం చేసుకుని, రావణుని మరణాన్ని, రాముడి విజయాన్ని చూపిన తన కల గురించి వివరిస్తుంది.[28]

త్రిశిరుడు[మార్చు]

త్రిశిరుడు రావణుని కుమారుడు. హనుమంతుని చేతిలో చంపబడ్డాడు.

ఊర్మిళ[మార్చు]

ఊర్మిళ జనకుడు, సునయనల చిన్న కుమార్తె, సీతాదేవికి చెల్లెలు. ఆమె లక్ష్మణుడిని వివాహం చేసుకుంది. వీరికి అంగద, చంద్రకేతు అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

వాలి[మార్చు]

వాలి కిష్కింధకు వానర రాజు. ఆయన సుగ్రీవునకు అన్న. మహా బలవంతుడు.

వశిష్ఠ మహర్షి[మార్చు]

వశిష్ఠుడు గొప్ప ఋషి. మహాతపస్సంపన్నుఁడు. సప్త ఋషులలో వసిష్ఠ మహర్షి కూడా ఒకడు. ఆయన దశరథ రాజు గురువు.

విభీషణుడు[మార్చు]

విభీషణుడు రావణుడి తమ్ముడు. స్వతహాగా రాక్షసుడైనప్పటికీ, విభీషణుడు శ్రేష్ఠమైన స్వభావం కలవాడు. రావణుడు సీతను అపహరించినప్పుడు, ఆమెను తన భర్త రాముడి వద్దకు చేరచమని రావణుడికి సలహా ఇచ్చాడు. రావణుడు అతని సలహాను ఖాతరు చేయకపోవడంతో, విభీషణుడు శ్రీరాముడి సైన్యంలో చేరాడు. శ్రీరామరావణ యుద్ధంలో శ్రీరాముడికి రావణుడి ఆయువు పట్టు చెప్పి అన్న మరణానికి కారణం అయ్యాడు. రావణుడి తర్వాత లంకా సామ్రాజ్యానికి ఆయన రాజు అయ్యాడు.[29]

విద్యుత్జిహ్వ[మార్చు]

విద్యుత్జిహ్వ దుష్టబుద్ధిగల రాక్షసుడు, రావణుని సోదరి శూర్పణఖ భర్త.

విశ్రవుడు[మార్చు]

విశ్రవుడు అగస్త్య మహర్షి సోదరుడు, బ్రహ్మదేవుని మనుమడు పులత్స్య కుమారుడు. విశ్రవకు రెండుసార్లు పెళ్లయింది. అతని మొదటి భార్య ఇలావిద, వారికి కుబేరుడు అనే కుమారుడు ఉన్నాడు. అతని రెండవ భార్య ఒక రాక్షస యువరాణి కైకసితో అతనికి ముగ్గురు కుమారులు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడుతో సహా ఒక కుమార్తె శూర్పణఖ ఉంది.

విశ్వామిత్రుడు[మార్చు]

విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజుగా ఉన్న మహర్షి. సుదీర్ఘ ధ్యానం ద్వారా, అతను అనేక ఆధ్యాత్మిక శక్తులను పొందాడు. అతను రాక్షసుడిని ఓడించడానికి, శివుడి ధనుస్సును ఎత్తడానికి శ్రీరాముడిని ఎంచుకున్నాడు. శ్రీరామునకు గురువుగానే కాక గాయత్రీ మంత్ర సృష్టి కర్తగా, హరిశ్చంద్రుని పరీక్షించినవానిగా, త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవానిగా, శకుంతలకు తండ్రి అవడం వల్ల భరతునకు తాతగా గుర్తిస్తారు.

మూలాలు[మార్చు]

  1. Lecture 34: Rewritings / Retellings of Indian Epics II: Ramayana
  2. Wendy Doniger (1981). The Rig Veda: An Anthology : One Hundred and Eight Hymns, Selected, Translated and Annotated. Penguin Books. pp. 167–168. ISBN 978-0-14-044402-5.
  3. www.wisdomlib.org (2019-01-28). "Story of Añjanā". www.wisdomlib.org. Retrieved 2022-11-23.
  4. Nāyuḍū, Su Śaṅkara Rājū; Shankar Raju Naidu, S. (1971). "A Comparative Study of Kamba Ramayanam and Tulasi Ramayan".
  5. "Mandavi: "I Am Bharata's Wife And The Loneliest Woman In The Kingdom"". Bonobology.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-10. Retrieved 2020-05-24.
  6. Goldman, Robert P. (1984). The Rāmāyaṇa of Vālmīki: An Epic of Ancient India. Vol. I: Bālakāṇḍa. Princeton University Press. pp. 136–161.
  7. www.wisdomlib.org (2019-01-28). "Story of Atikāya". www.wisdomlib.org (in ఇంగ్లీష్). Retrieved 2022-11-05.
  8. A Classical Dictionary of Hindu Mythology & Religion by John Dowson
  9. Das, Keshav (1988). Ramayana at a glance. Motilal Banararsidass Publications. p. 75.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-10. Retrieved 2008-03-11.
  11. "Kaikasi". rsvidyapeetha.ac.in. Retrieved 2020-04-15.[permanent dead link]
  12. "Know interesting things about Ravana". News Track (in ఇంగ్లీష్). 2020-04-16. Retrieved 2020-07-02.
  13. Khara's Death
  14. "Mandavi: "I Am Bharata's Wife And The Loneliest Woman In The Kingdom"". Bonobology.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-10. Retrieved 2020-05-24.
  15. "Manthara's Anger - Ayodhya Storybook". sites.google.com. Archived from the original on 2020-10-12. Retrieved 2020-07-14.
  16. "Adam's bridge". Encyclopædia Britannica. 2007. Archived from the original on 12 October 2007
  17. The Book of Avatars and Divinities (in ఇంగ్లీష్). Penguin Random House India Private Limited. 2018-11-21. p. 82. ISBN 978-93-5305-362-8.
  18. Valmiki; Ralph, T. H. The Ramayana. Amazon Digital Services. p. 1787.
  19. History Of Ancient India (a New Version) : From 7300 Bb To 4250 Bc.
  20. Rao, Desiraju Hanumanta. "Valmiki Ramayana - Yuddha Kanda - Sarga 58". www.valmikiramayan.net. Retrieved 2017-01-02.[permanent dead link]
  21. Sanskrit-English Dictionary by Monier-Williams, (c) 1899
  22. Valmiki Ramayana translated by Ralph T. H. Griffith (1870–1874). Book IV.
  23. Ramayana. William Buck, B. A. van Nooten, Shirley Triest. University of California Press, 2000. ISBN 0520227034, 9780520227033
  24. "శబరి (For Children) | teluguglobal.in". www.teluguglobal.in. Retrieved 2020-07-15.
  25. "Shurpanakha - Sister of Ravana - Indian Mythology". www.apamnapat.com. Archived from the original on 2021-06-19. Retrieved 2020-07-19.
  26. మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. జనకుని కూతుర జనని జానకమ్మ - రామదాసు కీర్తన.
  27. "Subahu - Asura Slain by Rama". Indian Mythology. Archived from the original on 2022-10-21. Retrieved 2022-10-21.
  28. Bulcke pp. 104–5
  29. "Demon king Ravana's brother Vibhishana is immortal – Here's why". zeenews.india.com. Zee News. Archived from the original on 1 నవంబరు 2016. Retrieved 18 October 2016.