ఎలమంచిలి మండలం
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 17°32′56″N 82°51′00″E / 17.549°N 82.85°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
మండల కేంద్రం | ఎలమంచిలి |
విస్తీర్ణం | |
• మొత్తం | 117 km2 (45 sq mi) |
జనాభా వివరాలు (2011)[3] | |
• మొత్తం | 70,553 |
• సాంద్రత | 600/km2 (1,600/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1065 |
ఎలమంచిలి మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అనకాపల్లి జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
మండలం లోని పట్టణాలు[మార్చు]
- ఎలమంచిలి - (జనగణన పట్టణం)
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- కొక్కిరాపల్లి
- తురంగలపాలెం
- జంపపాలెం
- సోమలింగపాలెం
- కట్టుపాలెం
- ఎర్రవరం
- రేగుపాలెం
- బయ్యవరం
- ఏటి కొప్పాక
- పద్మనాభరాజు పేట
- పులపర్తి
- కృష్ణాపురం
- తెరువుపల్లి
ఆర్ధిక స్థితిగతులు[మార్చు]
వ్యవసాయ రంగం: ప్రజల ప్రధాన వృత్తి మంది వ్యవసాయం, పాడి పశువుల పెంపకం. మండలం పూర్తిగా వర్షాధారిత ప్రాంతం. సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం కారణంగా నైరుతి ఋతుపవనాల వల్ల 72% వర్షపాతం, ఈశాన్యరుతుపవనాల వల్ల 13% వర్షపాతాన్ని మండలం పొందుతున్నది. వార్షిక సరాసరి వర్షపాతం 1200 మిమీగా నమోదు అవుతున్నది. నేలలు వదులుగా ఉండే ఎర్ర మట్టినేలలు. ఇసుకపాలు ఎక్కువ. నీరు ఇంకి పోయే స్వభావం కలవి. పంటపొలాల విస్తీర్ణం 6842 హెక్టార్లు. పెదపల్లి ప్రాంతంలో 365 హెక్టార్ల విస్తీర్ణం గల అడవి ఉంది. ఖరీఫ్ సీజన్లో పల్లపుభూములలో ఆహార పంటగా వరి పండిస్తారు. వాణిజ్యపంటగా చెరకు వేస్తారు.కొన్నిగ్రామాలలో పొగాకు కూడా పండిస్తారు. మెట్టభూముల్లో చోళ్ళు (రాగులు), గంటెలు, నువ్వులు, వేరుశనగ పంటలు వేస్తారు. మిరప, కందుల పంటలు అక్కడక్కడ కనిపిస్తాయి. వంగ, బీర, ఆనప, టమోటా వంటి కూరగాయలను కూడా పండిస్తున్నారు. మండలంలోని కొక్కిరాపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుత్వం వారి "నూనె గింజల" పరిశోధనాకేంద్రం ఉంది. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుభందమైన ఈ కేంద్రంలో నువ్వుల విత్తనాల పై పరిశోధనలు జరుగుచున్నవి. రైతులకు వ్యవసాయం తర్వాత ప్రధాన ఆదాయ వనరు గేదెల పెంపకం ద్వారా పాల ఉత్పత్తి. తరచు సంభవించే వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలకు గ్యారంటీ లేదు. మండలం లోని కొన్ని గ్రామాలను ఆనుకొని శారద, వరాహ నదులు ప్రవహిస్తున్నప్పటికి వాటి వల్ల ప్రయోజనం తక్కువ ఉంది.
పారిశ్రామిక రంగం: మండలంలో ఏటి కొప్పాక గ్రామంలో సహకార చక్కెర కర్మాగారం 1933 సం.లో ఏర్పాటయింది. ఇది రాష్ట్రంలో సహకారరంగంలో ఏర్పడిన మొట్టమొదటి చక్కెర కర్మాగారం. రేగుపాలెం వద్ద 2009 లో సిమెంట్ కర్మాగారం ఏర్పాటయింది. యలమంచిలికి దగ్గరగా ఉన్న అచ్యుతాపురం ఎస్.ఇ.జెడ్ లో నిర్మించబడిన బ్రాండిక్స్ దుస్తుల కర్మాగారం 22 వేల మంది గ్రామీణ యువతీ, యువతులకు ఉపాధి కల్పిస్తుంది. విశాఖపట్నంలో పనిచేసే చిరుద్యోగులు యలమంచిలిని తమ నివాస ప్రాంతంగాఎంచుకోవడం వల్ల గృహనిర్మాణ రంగం ముందంజలో ఉంది. .
మూలాలు[మార్చు]
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015