అనకాపల్లి జిల్లా
అనకాపల్లి జిల్లా | |
---|---|
జిల్లా | |
![]() శారదానది పై వంతెన | |
![]() | |
నిర్దేశాంకాలు: 17°41′N 83°00′E / 17.69°N 83.00°ECoordinates: 17°41′N 83°00′E / 17.69°N 83.00°E | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా కేంద్రం | అనకాపల్లి |
పరిపాలనా విభాగాలు |
|
విస్తీర్ణం | |
• Total | 4,292 km2 (1,657 sq mi) |
జనాభా వివరాలు (2011)[1] | |
• Total | 17,27,000 |
• సాంద్రత | 400/km2 (1,000/sq mi) |
భాషలు | |
• ఆధికార | తెలుగు |
కాలమానం | UTC+05:30 (IST) |
జాలస్థలి | anakapalli |
అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా పాత విశాఖపట్నం జిల్లా లోని భాగాలతో 2022లో కొత్తగా ఏర్పరచిన జిల్లా. జిల్లా కేంద్రం అనకాపల్లి. ఈ జిల్లాలోని బొజ్జన్నకొండ ప్రముఖ బౌద్ధ పర్యాటక ఆకర్షణ.
చరిత్ర[మార్చు]
ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత గజపతులు, కాకతీయులు, కుతుబ్ షాహి రాజులు పాలించారు. సుమారు 1450 ప్రాంతంలో ఆర్కాటు నవాబు అధీనంలో ఉండేది. బొజ్జన్నకొండపై లభించిన చారిత్రక ఆధారాల ప్రకారం శాతవాహనులు, విష్ణుకుండిన, గజపతి, విజయనగర రాజులు, గోల్కొండ సామంత రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. జిల్లా ముఖ్యపట్టణమైన అనకాపల్లికి అనియాంకపల్లి, అనేకఫల్లె, విజయపురి, వెనియాపాలి, కనకపురి, బెల్లంపట్నం, అనేక పేర్లు ఉన్నాయి. ఇది పవిత్ర శారదా నది ప్రక్కన ఉంది. భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో మహాత్మాగాంధీ, బి.ఆర్.అంబేద్కర్ అనకాపల్లిని సందర్శించారు.[2]
2022 ఏప్రిల్ 4న పాత విశాఖపట్నం జిల్లా భాగంతో అనకాపల్లి జిల్లాను కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు.[1]
భౌగోళిక స్వరూపం[మార్చు]
అనకాపల్లి జిల్లా శారదా నది తీరాన ఉంది. ఇది సముద్ర మట్టానికి 26 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం తూర్పు కనుమలు విస్తరించిన భాగంలో ఉంది.జిల్లాకు ఉత్తరాన అల్లూరి సీతారామరాజు, తూర్పున విశాఖపట్నం, విజయనగరం, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమాన అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలున్నాయి.
జిల్లా విస్తీర్ణం 4,292 చ.కి.మీ.[1]
జనగణన వివరాలు[మార్చు]
జిల్లా పరిధిలో జనాభా మొత్తం 17.270 లక్షలు మంది ఉన్నారు.[1]
పరిపాలనా విభాగాలు[మార్చు]
జిల్లాలో అనకాపల్లి రెవెన్యూ, నర్సీపట్నం రెవెన్యూ డివిజను అనే రెండు డివిజన్లున్నాయి. ఈ రెవెన్యూ డివిజన్లను 24 మండలాలుగా విభజించారు.[1] [3]
మండలాలు[మార్చు]
నగరాలు, పట్టణాలు[మార్చు]
జిల్లా కేంద్రం అనకాపల్లి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. జిల్లాలో ఎలమంచిలి, నర్సీపట్నం మునిసిపాలిటీలు, బౌలువాడ, చోడవరం, నక్కపల్లె, పాయకరావుపేట జనగణన పట్టణాలున్నాయి.
రాజకీయ విభాగాలు[మార్చు]
అనకాపల్లి జిల్లాలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం అనకాపల్లి లోకసభ నియోజకవర్గం. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[4]
శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]
- అనకాపల్లి
- ఎలమంచిలి
- చోడవరం
- నర్సీపట్నం
- పాయకరావుపేట (ఎస్.సి)
- పెందుర్తి (పాక్షికం) (మిగతా భాగం విశాఖపట్నం జిల్లాలో కలదు)
- మాడుగుల
పర్యాటక ఆకర్షణలు[మార్చు]
- బౌద్ధస్థూపాలు: శంకరం గ్రామంలో తూర్పున ఉన్న బొజ్జన్నకొండ, పశ్చిమాన లింగాలకొండ ఉన్నాయి. ఈ కొండలలో అనేక ఏకశిలా స్థూపాలు, రాతి గుహలు, చైత్యాలు మఠాలు ఉన్నాయి.[5]
దేవాలయాలు[మార్చు]
- కాకతాంబిక ఆలయం:ఈ కాలంలో ఈ దేవతను నూకాలమ్మ లేదా నూకాంబిక అని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది. ఉగాదికి ముందుగా వచ్ఛు దినమైన క్రొత్త అమావాస్య' నాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.[6] నూకాంబిక అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది.[7]
- గౌరమ్మ గుడి: మరొక ప్రసిధ్ద ఆలయం. జనవరి మాసాంతంలో ఇక్కడ 10 రోజుల సంబరం జరుగుతుంది.
వ్యవసాయం[మార్చు]
ఈ ప్రాంతంలో వరి, చెరకు, కొబ్బరి ముఖ్యమైన పంటలు.
పరిశ్రమలు[మార్చు]
- జిల్లాలో అనకాపల్లి బెల్లం పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో ఇది అతి పెద్ద బెల్లం ఉత్పత్తి, వ్యాపార కేంద్రం. మొత్తం దేశంలో రెండవ స్థానంలో ఉంది. తుమ్మపాలలో అనకాపల్లి సహకార చక్కెర కర్మాగారం ఉంది.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ "జిల్లా గురించి". Anakapalli District, Government of Andhra Pradesh. Retrieved 2022-06-10.
- ↑ "GO issued for creation of Anakapalle revenue division". The Hindu. Viskhapatnam. 4 April 2013. Retrieved 21 November 2015.
- ↑ "District-wise Assembly-Constituencies". ceoandhra.nic.in.
- ↑ "The Hindu". Archived from the original on 2007-03-11. Retrieved 2008-03-18.
- ↑ "The Hindu". Archived from the original on 2004-09-17. Retrieved 2008-03-18.
- ↑ "నూకాంబిక జాతర ఏర్పాట్లు పక్కాగా ఉండాలి". andhrajyothy. 2022-03-29. Archived from the original on 2022-03-28. Retrieved 2022-03-28.