నర్సంపేట్
నర్సంపేట్, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లా, నర్సంపేట మండలానికి చెందిన నగర పంచాయితీ.
?నర్సంపేట్ తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°55′35″N 79°53′49″E / 17.926394°N 79.896941°ECoordinates: 17°55′35″N 79°53′49″E / 17.926394°N 79.896941°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 11.52 కి.మీ² (4 చ.మై)[1] |
జిల్లా(లు) | వరంగల్ జిల్లా |
భాష(లు) | తెలుగు |
పురపాలక సంఘం | నర్సంపేట్ నగర పంచాయితీ |
ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 175 కి.మీ.దూరంలో ఉంది. వరంగల్ జిల్లా కేంద్రానికి 40కి.మి.ల దూరంలో ఉంటుంది.తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో నర్సంపేట్ ఒకటి.
విషయ సూచిక
నగర పంచాయితీగా ఏర్పాటు[మార్చు]
లోగడ గ్రామ పంచాయితీగా ఉన్న నర్సంపేట్ 2011 సంవత్సరంలో ది.03.09.2011 నుండి నగర పంచాయితీగా ఏర్పడింది.[2]
పౌర పరిపాలన[మార్చు]
ఈపట్టణంలోని పరిపాలన వార్డుల సంఖ్య మొత్తం 20.దీని అధికార పరిధి 11.52 kమీ2 (4.45 sq mi).[1]
పట్టణ జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 36,241 - పురుషుల సంఖ్య 18,502 - స్త్రీల సంఖ్య 17,739 - గృహాల సంఖ్య 8,726.
నర్సంపేట సమాచారం[మార్చు]
పూర్వం ఈ పట్టణాన్ని పాఖాల తాలూకాలో ఓ గ్రామముగా భావించారు, కాల క్రమేన పెద్ద గ్రామంగా, పట్టణంగా రూపాంతరం చెందింది. ఇటివల చేసిన జిల్లాల విభజనలో నర్సంపేట్ డివిజన్ వరంగల్ రూరల్ జిల్లాలోకి వెళ్ళింది. దీంతో జిల్లాలో పెద్ద నగరంగా అవతరించింది. ఒక విధంగా జిల్లా కేంద్రంగా మారబోతుంది. డివిజన్ కేంద్రమైన నర్సంపేట్ పరిధిలోనికి చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి,నర్సంపేట్,నెక్కొండ మండలాలు వస్తాయి. ప్రస్తుతం సుమారు 50వేల జనాభాతొ దినదినాభివృద్ధి చెందుతుంది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నర్సంపేట్ ను పురపాలక (నగర పంచాయతి) గా గుర్తించింది. ఈ పట్టణంలో బస్సు డిపో ఉండగా ఆర్థికంగా ముందుకు సాగుతుంది.ఈ ప్రాంతం నుండి హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, నిజామబాద్, ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల,భద్రాచలం,గోదావరిఖని,నిర్మల్, రామగుండం, కొత్తగూడెం వంటి ప్రాంతాలకు మరియు బాసర, యాదగిరి,వేములవాడ,శ్రీశైలం,కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రలకు రోడ్డు రవాణ ఉంది. మహారాష్ర్ట లోని సిరొంచ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట (తిరుపతి)కి వెళ్లే జాతీయ రహదారి - 365 నర్సంపేట్ డివిజన్ లోని మల్లంపల్లిలో ప్రారంభమై నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాలతో పాటు నర్సంపేట్ అర్బన్, రూరల్ మండలాలు, ఖానాపురం, మహబూబాబాద్ జిల్లా గూడురు, మహాబూబాబాద్ అర్బన్, రూరల్, మర్రిపేడల మీదుగా వెల్తుంది. నర్సంపేట్ సిటికి ముందు హనుమాన్ తండా వద్ద టోల్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నారు. నర్సంపేట్ నగరానికి 9కిలోమీటర్ల దూరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాఖాల సరస్సు మరియు దట్టమైన అభయారణ్యం ఉంది. ఈ సరస్సు చందాలు అటవి అందాలు ఎంతో భాగుంటాయి. పట్టణం లోని మాధన్నపేట సరస్సు కూడా చూడదగిన ప్రదేశం. తెలంగాణ రాష్ట్రంలోనే శబరిగా పేరుగాంచిన శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయము ఇక్కడ గలదు. ప్రతి యేటా శబరిలో నిర్వహించిన మాదిరిగా ఇక్కడ కూడా పంబారట్టు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలోనే అతి పేద్ద పైలాన్ ఇక్కడ ఉంది. నర్సంపేట్ పట్టణంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. బాలాజి ఇన్ స్టూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్సు, జయముఖి ఇన్ స్టూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్సు, మహేశ్వరం శివాని గురుకులం, సిద్దార్ద గురుకులంతో పాటు మరిన్ని విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసి, బీఈడి,పీజి, డిగ్రి, జునియర్,ఐటిఐ కళాశాలలున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన యువత, ఉద్యోగ,వ్యాపార,కార్మిక రంగాలకు చెందిన వారు నర్సంపేట్ డివిజన్ ఐక్య కార్యాచరణ సమితి (జేఎసి) ఆధ్వర్యంలో ముందుండి పొరాడారు. సుమారు రెండు సంవత్సరాలు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రీలే నిరాహార దీక్షలు చేసి తెలంగాణ ఉద్యమములో ఈ ప్రాంతాన్ని ముందుందని నిరూపించారు. ఉద్యమ సమయానా పట్టణానికి చెందిన రాజ్ కుమార్ చారి అనే ఉద్యమ కారుడు తన ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకొని అసువులు భారాడు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు రాస్తారోకో, దర్నా,వంటావార్పు, ముట్టడి వంటి అనేక ఉద్యమాలు జరిగాయి.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
- ↑ G.O.Ms.No.402 (MA & UD ) Department of Andhra Pradesh.Dated:03.09.2011