మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం
(మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
తెలంగాణ లోని 17 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]
- డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- నర్సంపేట శాసనసభ నియోజకవర్గం
- ములుగు శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- పినపాక శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- ఇల్లందు శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- భద్రాచలం శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
ఎన్నికైన సభ్యులు[మార్చు]
లోక్సభ | పదవి కాలం | పేరు | పార్టీ | |
---|---|---|---|---|
2వ లోక్సభ | 1957-62 | ఇటిక్యాల మధుసూదన్ రావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
3వ లోక్సభ | 1962-67 | |||
2వ లోక్సభ | 1962-67 | ఆర్. సురేంద్రరెడ్డి | ||
15వ లోక్సభ | 2009-14 | బలరాం నాయక్ | ||
16వ లోక్సభ | 2014-19 | సీతారాం నాయక్ | తెలంగాణ రాష్ట్ర సమితి | |
17వ లోక్సభ | 2019- ప్రస్తుతం | మాలోత్ కవిత |
2009 ఎన్నికలు[మార్చు]
2009లో మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడ్గా ఆవిర్భవించింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోరిక బలరాంనాయక్, మహాకూటమి సీపీఐ నుంచి కుంజా శ్రీనివాసరావు, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డీటీ నాయక్ పోటీపడ్డారు. 2009లో ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పోరిక బలరాంనాయక్కు 3,94,447 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి సీపీఐ కుంజా శ్రీనివాసరావుకు 3,25,490 ఓట్లు లభించాయి. పీఆర్పీ అభ్యర్థి డీటీ నాయక్కు 1,45,299 ఓట్లు లభించాయి. బలరాంకు 68,957 ఓట్ల మెజార్టీ లభించింది.[1]
మూలాలు[మార్చు]
- ↑ Andhrajyothy (15 March 2024). "తీన్మార్". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.