ప్రజాసాహితి

వికీపీడియా నుండి
ప్రజాసాహితి
రకము మాసపత్రిక
ఫార్మాటు

యాజమాన్యం
సంపాదకులు కొత్తపల్లి రవిబాబు
స్థాపన 1977
విజయవాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా
వెల భారతదేశం రూపాయలు:10.00
ప్రధాన కేంద్రము విజయవాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా
ISSN మూస:ISSN search link

వెబ్‌సైటు: [1]

కేవలం సాహిత్య ప్రయోజనాన్ని అన్ని కోణాల్లోనూ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న తెలుగు పత్రికల్లో ఒక పత్రిక “ప్రజాసాహితి”. రంగనాయకమ్మ ప్రారంభించిన ఈ పత్రికను కొన్నేళ్ల తరువాత జనసాహితి సాహిత్య సంస్థకు అప్పగించిన తరువాత కొత్తపల్లి రవిబాబు ప్రధాన సంపాదకులుగా పత్రికను నడుపుతున్నారు. పి. ఎస్. నాగరాజు సంపాదకులుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఉద్యమ కృషిలో కొనసాగే పత్రికలు నిరాటంకంగా రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటినన్నింటిని అధిగమిస్తూ గత 32 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంచికా ఆ నెల మొదటివారంలోనే పాఠకునికి అందజేయడం ఈ పత్రిక సాధించిన ఒక విజయం. [1]


ఈ పత్రిక మరో విశేషమైన విషయమేమిటంటే కనీసం ప్రతి మూడు నెలలకొకసారైనా ఒక ప్రత్యేక సంచికను సమగ్రంగా తీసుకురావడం. ప్రపంచంలో ఎక్కడెక్కడి దేశాల్లో వస్తున్న ప్రగతిశీల, అభ్యుదయ, విప్లవ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్న పత్రికగా “ప్రజాసాహితి”కున్న ఖ్యాతినికూడా పేర్కొనితీరాలి. కథ, కవిత, వ్యాసం, సీరియల్, బాల సాహిత్యం, పుస్తక సమీక్షలు, చర్చలు, ఇలా ఒకటేమిటి సమస్త సాహిత్య ప్రక్రియల్లోనూ రచనలు మనకిందులో పలకరిస్తాయి. మన ఆలోచనను పెంచుతాయి. ఒక మాటలో చెప్పాలంటే సాహిత్య ప్రయోజనాన్ని నెరవేరుస్తాయి.


ఈ పత్రిక సంవత్సర చందా వంద రూపాయలు మాత్రమే.

  • చిరునామా: ప్రజాసాహితి, మైత్రి బుక్ హౌస్,జలీల్ వీధి, ఆరండల్ పేట, కారల్మార్క్స్ రోడ్, విజయవాడ – 2. ISSN 0971-278X

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లంకెలు


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె