ఉప్పలూరు (కంకిపాడు)
ఉప్పలూరు (కంకిపాడు) | |
— రెవిన్యూ గ్రామం — | |
ఉప్పలూరు రైలు స్టేషన్ నామఫలకం | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కంకిపాడు |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీమతి నెర్సు రాజ్యలక్ష్మి |
జనాభా (2011) | |
- మొత్తం | 5,105 |
- పురుషులు | 2,511 |
- స్త్రీలు | 2,594 |
- గృహాల సంఖ్య | 1,394 |
పిన్ కోడ్ | 521151 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
ఉప్పులూరు, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 151., ఎస్.టి.డి.కోడ్ = 08676
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 24 మీ. ఎత్తు Time zone: IST (UTC+5:30
సమీప గ్రామాలు[మార్చు]
ఈ గ్రామానికి సమీపంలో గూడవల్లి, ఈడుపుగల్లు, పునాదిపాడు, గంగూరు, తెన్నేరు గ్రామాలు ఉన్నాయి.
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
రైలు వసతి[మార్చు]
- విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77206 (ఆదివారం తప్ప)
- గుంటూరు - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57381
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212
- విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77201
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77207
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
బ్యాంకులు[మార్చు]
బ్యాంక్ ఆఫ్ బరోడా.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]
76 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ కేంద్ర భవన నిర్మాణం పూర్తి అయి, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ భవనం ప్రారంభమయినచో, ఉప్పలూరు, వేల్పూరు, మంతెన, తెన్నేరు, ఈడుపుగల్లు, మారేడుమాక తదితర గ్రామాలవారికి లబ్ధిచేకూరగలదు. [8]
పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం[మార్చు]
ఉప్పలూరు గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం, 1950లో స్థాపించబడింది. ఈ సంఘం 25 సంవత్సరాలుగ, లాభాలబాటలో పయనించుచున్నది. ప్రస్తుతం 530 మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ కంప్యూటరు ద్వారా వెన్నశాతం రీడింగు, పాల పరిమాణం నిర్ధారణ చేస్తున్నారు. నెలకు రెండుసార్లు, చెల్లింపులు చేస్తున్నారు. సక్రమ నిర్వహణద్వారా ఈ సంఘం వలన, పశుపోషకులకు చాలా మేలు జరుగుచున్నది. పశువుల భీమ పథకం అమలుచెయుచున్నారు. పశువుల దాణా వగైరాలు ప్రభుత్వ ధరలకే అందించుచున్నారు. ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించుచున్నారు. పశువులకు సమతుల్యాహారం అందించడంలో సహాయపడుచున్నారు. శాస్త్రీయ పద్ధతులలో పశుపోషణకై అవగాహన సదస్సులు నిర్వహించుచున్నారు. [3]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
ఈ గ్రామ పంచాయతీకి జూలై 2013 లో జరిగిన ఎన్నికలలో శ్రీమతి నెర్సు రాజ్యలక్ష్మి సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ బందెల సుబ్బారావు ఎన్నికైనారు. [2]&[4]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ సీతారామాలయం[మార్చు]
ఉప్పలూరు పాత హరిజనవాడలో ఉన్న ఈ ఆలయాన్ని, 200 సంవత్సరాల క్రితం దళితుల ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ ఆలయానికి చెందిన భజనబృందం, జిల్లాలోని నలుమూలలలోనూ ప్రదర్శనలిచ్చేవారు. పౌరాణిక రూపాలతో, శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వంటి పౌరాణిక కార్యక్రమాలు ప్రదర్శించేవారు. ఈ ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన ఈ ఆలయం, శిథిలావస్థకు చేరుకున్నది. దీనిని ఎలాగైనా పునర్నిర్మించాలనే పట్టుదలతో గ్రామస్థులు, ముఖ్యంగా దళితులు నిర్ణయించారు. గ్రామస్థులు, ప్రవాసాంధ్రులు వారి శక్తిమేరకు విరాళాలందించారు. రు. 20 లక్షల అంచనా వ్యయంతో ఈ ఆలయనిర్మాణం పూర్తిచేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఈ ఆలయానికి కావలసిన శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివారల నూతన విగ్రహాలు అందించారు. భద్రాచలం తరహాలోనే ఇక్కడ గూడా సీతా, రామ, లక్ష్మణ విగ్రహాలు ఏర్పాటుచేసారు. ఈ అలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,జూన్-8వతేదీ బుధవారంనాడు వేకువఝామునే, స్వామివారి సుప్రభాతసేవతో వైభవంగా ప్రారంభమైనవి. ఆరోజున నూతన విగ్రహాలకు గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. 9వ తేదీ మంగళవారం ఉదయం సుప్రభాతసేవ నిర్వహించారు. తదుపరి విశేషపూజలు నిర్వహించారు. 10వ తేదీ బుధవారం వేకువఝామున సుప్రభాతసేవ, మండపరాధన, మూర్తిహోమం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివారల శిలా విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవం ఘనంగా నిర్వహించారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణగావించారు. [6]&[7]
శ్రీ షిర్డీసాయి మందిరం[మార్చు]
ఈ మందిరం ఎదుట దాతల ఆర్థిక సహకారంతో ఒక విశాలమైన మండపం నిర్మించారు. దీనితో కళ్యాణోత్సవం, భజనలు, అన్నప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలు నిర్వహించడానికి సౌకర్యం ఏర్పడినది. [10]
శ్రీ భోగమల్లేశ్వర స్వామివారి ఆలయం[మార్చు]
ఈ ఆలయానికి 9 ఎకరాల మాన్యం భూమి ఉంది. [8]
శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]
ఈ ఆలయానికి 8.55 ఎకరాల మాన్యం భూమి ఉంది. [8]
- శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, శ్రీ భోగమల్లేశ్వరస్వామివారి ఆలయాలకు కలిపి, ఉమ్మడిగా, 10.27 ఎకరాల మాన్యం భూమి ఉంది. [8]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
ప్రముఖులు[మార్చు]
ఈ గ్రామంలో జన్మించిన వీరు, 1934-37 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ధర్మశాస్త్రంలో బి.య్యే.ఆనర్స్ చదివినారు. అనంతరం 1937-38 లో, రీసెర్చ్ స్కాలర్ షిప్పు పొందినారు. ఆ రోజులలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు-5వ తేదెనాదు భారతదేశంలో ఆచరించే గురువుల దినోత్సవానికి కారకులైన శ్రీ సర్వేపల్లి గారితో, అనుబంధం కలిగిన ఏకైక ఉపాధ్యాయులు ప్రస్తుతం శ్రీ రాధాకృష్ణమూర్తి కావడం విశేషం. వీరు 1939 నుండి 2 సంవత్సరాలు ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో అసిస్టెంట్ లెక్చరరుగా, లెక్చరరుగా తర్కశాస్త్ర బోధనలో గడిపినారు. మరోదశాబ్ద కాలం, ఎస్.ఆర్.ఆర్. & సి.వి.ఆర్.కళాశాలలో దర్శనశాస్త్ర, మానసిక శాస్త్ర బోధనతోపాటు, విభాగాధిపతిగా కొనసాగినారు. అప్పుడు కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు వీరి సహోపాధ్యాయులు. 1968లో ధరణికోటలోని శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాలలో ప్రిన్సిపాలుగా బాధ్యతలు చేపట్టినారు. 1974 లో విజయవాడలో ఏర్పాటు చేసిన సిద్ధార్ధ ఆర్ట్స్ కళాశాలలో ఫౌండర్ ప్రిన్సిపాలుగా బాధ్యతలు చేపట్టినారు. రాష్ట్రానికి చెందిన ఎందరో అధికార, రాజకీయ ప్రముఖులు వీరి శిష్యులు. శ్రీ నందమూరి తారకరామారావు, శ్రీ చనుమోలు వెంకటరావు, శ్రీ పాలడుగు వెంకటరావు, ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి, ప్రముఖ మానసిక శాస్త్రవేత్త శ్రీ కోనేరు రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదనపు డి.జి.పి.శ్రీ సురేంద్రబాబు, జార్జియా దేశంలో భారత దేశ రాయబారి శ్రీ టి. సురేశ్ బాబు, ఇలా ఎందరో ప్రముఖులు ఉన్నారు. విజ్ఞానం పంచే గురువు నిరంతరం విద్యార్థుల సేవలో నిస్వార్ధంగా గడపాలని చెప్పే శ్రీ రాధాకృష్ణమూర్తి, 1983 నుండి ఇటీవలి వరకు, పోరంకిలోని వికాసవిద్యానవనం పాఠశాలకు అధ్యక్షులుగా కొనసాగినారు. గురువృత్తికి వన్నెలద్దిన కొందరిలో వీరొకరు. వీరి ప్రస్తుత వయస్సు 98 సంవత్సరాలు. [9].వీరు 2017,జూన్-9న విజయవాడలో ఆనారోగ్యంతో కన్నుమూసినారు. [11]
గ్రామ విశేషాలు[మార్చు]
- శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దడానికై, ఉప్పలూర్ గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. [5]
- ఉప్పలూరు గ్రామ పరిధిలో మన్నేరు వాగు ఉంది.
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 5,105 - పురుషుల సంఖ్య 2,511 - స్త్రీల సంఖ్య 2,594 - గృహాల సంఖ్య 1,394;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5130.[2] ఇందులో పురుషుల సంఖ్య 2575, స్త్రీల సంఖ్య 2555, గ్రామంలో నివాసగృహాలు 1264 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 675 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Uppaluru". Archived from the original on 29 నవంబర్ 2019. Retrieved 18 June 2016. Check date values in:
|archive-date=
(help); External link in|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.
బయటి లింకులు[మార్చు]
[2] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,ఆగస్టు-5; 1వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-8; 12వపేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,నవంబరు-2; 2వపేజీ [5] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2015,మార్చి-15; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,మే-24; 22వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,జూన్-11; 21వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,జూన్-13; 22వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-5; 10వపేజీ. [10] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,మార్చి-24; 2వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2017,జూన్-10; 14వపేజీ.