Jump to content

గులేబకావళి కథ

వికీపీడియా నుండి
గులేబకావళి కథ
(1962 తెలుగు సినిమా)
నిర్మాణం నందమూరి త్రివిక్రమరావు
కథ సముద్రాల
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
నాగరత్నం,
ఋష్యేంద్రమణి,
పి.హేమలత,
ఛాయాదేవి,
బాలసరస్వతి,
రాజనాల,
మిక్కిలినేని,
పద్మనాభం,
నల్ల రామమూర్తి,
లంక సత్యం,
బాలకృష్ణ,
పేకేటి శివరాం
సంగీతం జోసెఫ్ & విజయా కృష్ణమూర్తి
నేపథ్య గానం పి.సుశీల,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.జి.కృష్ణవేణి,
ఎస్.జానకి
గీతరచన సి.నారాయణరెడ్డి
సంభాషణలు సముద్రాల
ఛాయాగ్రహణం రవికాంత్ నగాయిచ్
నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్
విడుదల తేదీ జనవరి 5, 1962
భాష తెలుగు

గులేబకావళి కథ 1962 సంవత్సరంలో విడుదలైన జానపద తెలుగు వెండితెఱ చలనచిత్రం. ఇందులో నందమూరి తారక రామారావు, జమున ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై నందమూరి త్రివిక్రమరావు నిర్మించాడు. సముద్రాల కథ, మాటలు అందించాడు. జోసెఫ్, విజయా కృష్ణమూర్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ద్వారా సి. నారాయణ రెడ్డి సినీ గేయ రచయితగా తన ప్రస్థానం ప్రారంభించాడు. ఆయన రాసిన నన్ను దోచుకుందువటే అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.[1]

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

పాటలీపుత్ర మహారాజు అయిన మిక్కిలినేనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య "ఋష్యేంద్రమణి" ఒక సిద్ధుని వరంచేత గర్భవతి అవుతుంది. పెద్ద భార్య కలిగే సంతానం/బిడ్డ వల్ల తనకు చూపు పోతుందని జోతీష్యులు ద్వారా తెలుసుకున్న మహారాజు ఆమెను అడవులకు పంపిస్తాడు. అక్కడ ఆమెకు జన్మించిన కుమారుడు విజయుడు (రామారావు), కోయగూడెంలో పెరిగి పెద్దవాడవుతాడు. రెండవ భార్య"ఛాయాదేవి" ద్వారా ముగ్గురు కొడుకులు కలుగుతారుం.

రెండవ భార్యకు తమ్ముడు వక్రకేతు (రాజనాల) మహారాజుకు భావమరిది రాజ్యాధికారం కోసం ఎత్తులు వేస్తుంటాడు, తన పన్నాగాయాలతో అక్క కొడుకులను మూర్కులుగా పెంచుతాడు అలాగే మహారాజుకు కంటిచూపు లేకుండా చేస్తాడు. అయితే ఔషదా గుణములున్న 'గులేబకావళి' పుష్పం తెచ్చి కన్నులకు తాకిస్తే కంటిచూపు వస్తుందని రాజావైద్యులు ద్వారా తెలుసుకున్న మహారాజు, ఆ పుష్పం తెచ్చి తనకు కంటిచూపు ఇచ్చినవారికి తన రాజ్యం ఇస్తాను అని తెలపడంతో, పుష్పం తేవడానికి తన చిన్న భార్యచే కలిగిన మూర్ఖులైన తన ముగ్గురు కొడుకులు బయలుదేరతారు అలాగే తన పెద్ద భార్య విజయుడు కూడా ప్రయాణమవుతాడు.

మార్గమద్యలో యుక్తమతి (జమున) అనే వగలాడి వేసిన పావుల పందెంలో విజయుడి అన్నలు ముగ్గురు ఓడిపోయి బందీలవుతారు. విజయుడు మారువేషంలో పందెంలో పాల్గొని ఆమెను ఓడిస్తాడు. ఫలితంగా ఆమె తన మనస్సును విజయునికి అర్పించి బందీలుగా ఉన్న వారిని విడుదల చేస్తుంది. విజయుడు గులేబకావళి పుష్పాన్ని సాధించి తెస్తుండగా సోదరులు కూయుక్తితో దానిని తస్కరించి విజయుడిని బావిలో పడవేసి రాజ్యానికి చేరతారు, రాజ్యానికి వచ్చిన అన్నల పెట్టెలో పుష్పానికి బదులు చీపురు కట్ట వుండటం చూసి ఆశ్చర్యపోతారు. బావిలోంచి బయటపడ్డ విజయుడు ఒక తాపసి సహాయంతో తిరిగి గులేబకావళి పుష్పాన్ని సాధించడమే కాక ఆ పుష్పవృక్షాన్ని రక్షిస్తున్న గందరవ్వుని కుమార్తె అయిన 'కావళి'ని పెళ్ళిచేసుకొంటాడు. విజయుడు సమయానికి వచ్చి తండ్రికి చూపు తెప్పించడమే గాక వక్రకేతుతో పోరాడి అతన్ని అంతమొందిస్తాడు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు / ఎన్.టి.రామారావు
  • కథ, మాటలు:సముద్రాల
  • సంగీతం: జోసెఫ్, కృష్ణమూర్తి
  • గీత రచయుతలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల,శిష్ట్లా జానకి, బి.వసంత, పులపాక సుశీల, బి.గోపాలం
  • ఛాయా గ్రహణం: రవికాంత్ నగాయిచ్
  • ఎడిటింగ్: ఎస్.పి.ఎస్.వీరప్ప, జి.శివమూర్తి
  • నిర్మాత:నందమూరి తారక రామారావు
  • నిర్మాణ సంస్థ:నేషనల్ ఆర్ట్ థియేటర్
  • విడుదల:05:01:1962.

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు సంగీతదర్శకత్వం జోసెఫ్ కృష్ణమూర్తి వహించగా, పాటలన్నీ సి.నారాయణ రెడ్డి రాశారు. జోసెఫ్ కృష్ణమూర్తికి సంగీత దర్శకునిగానూ, సినారెకు గేయ రచయితగానూ ఇదే తొలిచిత్రం.[2]

  1. అంబా జగదంబా నా ఆర్తినే ఆలించవా.. ఏడి నా కన్నయ్య - పి. లీల
  2. అనురాగపయోనిధి ఓ జననీ నీ పదమేనమ్మి ( పద్యం) - ఘంటసాల . రచన: సముద్రాల జూనియర్
  3. ఈ ఆటలింక సాగవు మాముందు దొరబాబులంతా బందీలికముందు - ఎస్. జానకి బృందం
  4. ఉన్నది చెబుతా వింటారా నే నన్నది ఔనని అంటారా - బి.వసంత బృందం
  5. ఒంటరినై పోయాను ఇక ఇంటికి ఏమని పోను - ఘంటసాల
  6. ఓ మదనా సుందరా నా దోరా నామది నిన్నుగని పొంగినదిరా - పి.సుశీల
  7. కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై ఎగసిపోదునో చెలియా - ఎస్.జానకి, ఘంటసాల
  8. - రచన: సి.నారాయణ రెడ్డి; గానం: ఘంటసాల, పి.సుశీల
  9. మాతా జగన్మాతా ఓ మాతా జగన్మాతా నీకన్నా లోకంలో నాకెవరు - ఘంటసాల
  10. సలామాలేకుం సాహెబుగారు బలే షోకుగా వచ్చారా - ఎస్. జానకి, ఘంటసాల బృందం
  11. విన్నావా తత్వం గురుడా కనుగొన్నావా సత్యమ నరుడో నరుడా - బి. గోపాలం

ఇతర విశేషాలు

[మార్చు]
  • ఈ చిత్రకథను మూకీ చిత్రంగా ఒకసారి (1924), హిందీలో రెండు సార్లు (1932, 1963), తమిళంలో రెండు సార్లు (1935 1955), పంజాబీలో ఒకసారి (1939), తెలుగులో రెండు సార్లు (1938, 1962) లో నిర్మించారు.

వనరులు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.

మూలాలు

[మార్చు]
  1. "Telugu Cinema Etc - Idlebrain.com". www.idlebrain.com. Retrieved 2021-08-09.
  2. "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015. "నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన

బయటి లింకులు

[మార్చు]