Coordinates: 18°26′52″N 83°39′42″E / 18.447858°N 83.661733°E / 18.447858; 83.661733

రాజాం (రాజాం మండలం)

వికీపీడియా నుండి
(రాజాం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాజాం
బొబ్బిలి యుద్ధం గాథకు చెందిన వీరుడు తాండ్ర పాపారాయుడు ఈ ప్రాంతానికి చెందినవాడు
బొబ్బిలి యుద్ధం గాథకు చెందిన వీరుడు తాండ్ర పాపారాయుడు ఈ ప్రాంతానికి చెందినవాడు
రాజాం is located in Andhra Pradesh
రాజాం
రాజాం
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
Coordinates: 18°26′52″N 83°39′42″E / 18.447858°N 83.661733°E / 18.447858; 83.661733
Countryభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం
Government
 • Typeనగరపంచాయతీ
 • Bodyరాజాం నగరపంచాయతీ, SUDA
Area
 • Total32.75 km2 (12.64 sq mi)
Elevation61 మీ (200 అ.)
Population
 (2011)[3]
 • Total42,197
 • Density1,300/km2 (3,300/sq mi)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
532127
టెలిఫోన్ కోడ్+91–8941
Vehicle RegistrationAP30 (Former)
AP39 (from 30 January 2019)[4]

రాజాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా, రాజాం మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. జిల్లా కేంద్రం నుండి 51 కి.మీ దూరంలో వుంది. దీని పరిపాలన నగరపంచాయతీ చేనిర్వహించబడుతుంది. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం లో విజయనగర మహారాజైన విజయరామరాజుని చంపిన బొబ్బలి సర్దారైన తాండ్ర పాపారాయుడు ఈ ఊరికి సంబంధం కలిగినవాడు.

చరిత్ర[మార్చు]

బొబ్బిలి యుద్ధం గాథకు చెందిన వీరుడు తాండ్ర పాపారాయుడు ఈ ప్రాంతానికి చెందినవాడు. ఇటీవల తాండ్ర పాపారాయుడుకి చెందిన ఒక ఆభరణం ఇక్కడ బయట పడింది. పూర్వ కాలంలో తాండ్ర పాపారాయుడు ఉపయోగించిన భవనాన్ని నేడు తహసీల్దారు కార్యాలయంగా వాడుతున్నారు.

ఒకప్పుడు వైజాగ్, బొబ్బిలి వైపుగా కేంద్రీకృతమైన పట్టణం పాలకొండ, శ్రీకాకుళం వైపుగా అభివృద్ధి చెందింది. 2022 ఏప్రిల్ 4 న రాజాం శ్రీకాకుళం జిల్లా నుండి విజయనగరం జిల్లాకు మారింది. [5]

భౌగోళికం[మార్చు]

దీని అక్షాంశ రేఖాంశాలు 18.28N 83.40E.[6]. సముద్రమట్టం నుండి ఎత్తు 41 మీటర్లు. (137 అడుగులు)

గణాంకాలు[మార్చు]

2011 జనగణన ప్రకారం జనాభా 42,197.

పరిపాలన[మార్చు]

రాజాం నగరపంచాయతీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది. రాజాం నగర పంచాయితీలో అత్యంత ప్రముఖమైన, అతి నివాసయోగ్యమైన ప్రాంతం ఈశ్వరి నారాయణ కాలనీ, బాబా నగర్ కాలనీల సముదాయము. నగర పంచాయితీ పరిధిలో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించి ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలిచింది. పురపాలికగా మారిన తర్వాత అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టబడ్డాయి

రవాణా సౌకర్యాలు[మార్చు]

దగ్గరలోని రైల్వే స్టేషన్లు - గంగువారిసిగడాం, చీపురుపల్లి

విద్య[మార్చు]

ఇక్కడ జియంఆర్ఐటి సాంకేతిక కళాశాల (GMRIT) ఉంది.

వైద్యం[మార్చు]

ఒక సామాజిక ఆరోగ్యకేంద్రం ఉంది. ఈ 60 పడకల ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ద్వారా నడుపబడుతుంది.[7] ఇక్కడ జియమ్ఆర్-కేర్ హాస్పిటల్ అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలతో ఉంది. త్వరలో ఈ ఆసుపత్రికి అనుసంధానంగా రాజాంలో జియమ్ఆర్ వైద్య కళాశాల నెలకొల్పుతున్నారు.

పరిశ్రమలు[మార్చు]

రాజాం పట్టణం జనపనార మిల్లులకు, ఇనుప కర్మాగారాలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో అత్యధికంగా జనప నార ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ప్రతి గురువారం జరిగే సంతలో చుట్టుపక్కల చాలా మండలాల నుండి ప్రజలు వస్తారు.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

  • నవ దుర్గ ఆలయం: దేశంలో అత్యంత అరుదైన ఆలయం.
  • పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం: అమ్మవారి వార్షిక యాత్రా మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి.
  • శ్రీ హనుమాన్ దేవాలయం,చీపురుపల్లి రోడ్డు: చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, రాజాం ప్రజానీకం మంగళ, శనివారాల్లో ఎక్కువగా ఇక్కడకు వస్తారు.

ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "STATISTICAL INFORMATION OF ULBs & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. p. 1. Retrieved 24 April 2019.
  2. "Elevation for Rajam". Veloroutes. Retrieved 12 August 2014.
  3. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 20 July 2014.
  4. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
  5. "List of 26 districts formed in Andhra Pradesh". thehansindia.
  6. Falling Rain Genomics.Razam
  7. "APVVP.Hospitals". Archived from the original on 2008-01-08. Retrieved 2008-04-28.

వెలుపలి లంకెలు[మార్చు]