Coordinates: 18°34′00″N 83°22′00″E / 18.5667°N 83.3667°E / 18.5667; 83.3667

బొబ్బిలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొబ్బిలి
బొబ్బిలిలోని సంగీత కచేరీ మండపం
బొబ్బిలిలోని సంగీత కచేరీ మండపం
బొబ్బిలి is located in Andhra Pradesh
బొబ్బిలి
బొబ్బిలి
ఆంధ్రప్రదేశ్ లో బొబ్బిలి స్థానం,
Coordinates: 18°34′00″N 83°22′00″E / 18.5667°N 83.3667°E / 18.5667; 83.3667
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం
Government
 • Typeపురపాలక సంఘం
 • Bodyబొబ్బిలి పురపాలక సంఘం, బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ
 • శాసనసభ్యుడుసంబంగి వెంకట చిన అప్పల నాయుడు
Area
 • Total25.60 km2 (9.88 sq mi)
Elevation
103 మీ (338 అ.)
Population
 (2011)[2]
 • Total56,819
 • Density2,200/km2 (5,700/sq mi)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్
535558
ప్రాంతీయ ఫోన్ కోడ్91–8944
వాహనాల నమోదు కోడ్AP35 (Former)
AP39 (from 30 January 2019)[3]
లింగనిష్పత్తి1:1 /

బొబ్బిలి (వినండి: //), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని పట్టణం, అదే పేరుతో గల ఒక మండలానికి కేంద్రం.ఇది బొబ్బిలి పురపాలక సంఘం ప్రధాన పరిపాలన కేంద్రం.

చరిత్ర[మార్చు]

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తాండ్ర పాపారాయుడు విగ్రహం

బొబ్బిలికి, పొరుగున ఉన్న విజయనగరానికి మధ్య నిరంతర శతృత్వం ఉండేది. విజయనగర రాజు బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలిపై దాడి చేసాడు. బొబ్బిలి వెలమ, తెలగ, బొందిలి వీరులు మరణించగా, స్త్రీలు ఆత్మ త్యాగం చేసారు. యుద్ధం ముగిసాక, విజయరామరాజు తన గుడారంలో నిదుర పోతుండగా, బొబ్బిలి రాజు బావమరిది యైన తాండ్ర పాపారాయుడు అతడిని హతమార్చాడు.

బొబ్బిలి రాజు రంగారాయుని కుమారుడు, పసి బాలుడు చిన్న రంగారావు బుస్సీకి చిక్కాడు. ఆ బాలుడినే బొబ్బిలి రాజుగా బుస్సీ పట్టాభిషేకం చేసాడు. అయితే అతని పసితనాన్ని అవకాశంగా తీసుకుని బంధువులు రాజ్య పీఠాన్ని ఆక్రమించుకున్నారు. విజయనగరం రాజుతో సంధి కుదిరినా అది తాత్కాలికమే అయింది. ఇద్దరి మధ్యా మళ్ళీ ఘర్షణలు మొదలవటంతో బొబ్బిలి రాజు పారిపోయి నిజాము రాజ్యంలో తలదాచుకున్నాడు. 1794లో బ్రిటిషు వారు మరల చిన్న రంగారావును మళ్ళీ పీఠంపై కూర్చోబెట్టారు. 1801 లో అతని కుమారుడితో బ్రిటిషువారు శాశ్వత సంధి ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజా అనే బిరుదును వంశపారంపర్య చిహ్నంగా గుర్తించారు. మహారాజ బిరుదును చిన్న రంగారావు ముని మనుమడైన సర్ వేంకటాచలపతి రంగారావుకు వ్యక్తిగత హోదాగా సమర్పించారు.

1901 గణాంకాలు[మార్చు]

బ్రిటిషు వారి ఇంపీరియల్ గెజెట్ ప్రకారం బొబ్బిలి వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి అప్పటి విశాఖపట్నం జిల్లాలో ఉండేది. 1901లో దీని జానాభా 17,387. బొబ్బిలి రాజా సంస్థానం 227 చ.మై. విస్తీర్ణంలో ఉండేది. ఆదాయం - రూ 40,000. అందులో భూమి శిస్తు: రూ 9,000.

జనగణన గణాంకాలు[మార్చు]

2011 భారత జనన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,22,964 - పురుషులు 61,092 - స్త్రీలు 61,872

పరిపాలన[మార్చు]

బొబ్బిలి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యాసంస్థలు[మార్చు]

  • సంస్థానం ఉన్నత పాఠశాల (1864).
  • రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు కళాశాల: రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా సా.శ. 1962 సంవత్సరంలో ఈ కళాశాలను స్దాపించడం జరిగింది.
  • రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు కళాశాల, ఎమ్.సి.ఏ. సెంటర్ (1999)
  • గోకుల్ ఇంజనీరింగ్ కళాశాల
  • తాండ్రపాపారాయ ఇంజనీరింగ్ కళాశాల

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Basic Information of Municipality". Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Retrieved 11 August 2014.
  2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 11 August 2014.
  3. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=బొబ్బిలి&oldid=3917513" నుండి వెలికితీశారు