1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
| ||||||||||
|
1983 నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని 294 నియోజకవర్గాలలో 1983 జనవరిలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తదుపరి ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరిగాయి. కొత్తగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ 202 స్థానాల్లో గెలిచి, భారీ మెజారిటీ సాధించింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెసు పార్టీ 60 సీట్లు మాత్రమే సాధించింది. షెడ్యూల్ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉండగా, జనవరి లోనే ఎన్నికలు జరిగాయి. 1983 జనవరి 9 న పది మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు డిప్యూటీ మంత్రులతో ఎన్టీరామారావు రాష్ట్రానికి 10వ ముఖ్యమంత్రిగా, మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
ఎన్నికల విశేషాలు[మార్చు]
రాష్ట్రంలో మొత్తం 3,18,46,694 మంది వోటర్లు ఉండగా, అందులో 2,15,60,642 (67.7%) మంది వోటుహక్కును వినియోగించుకున్నారు. పోలైన వోట్లలో 2.06% వోట్లు చెల్లలేదు.
ఎన్నికలకు 9 నెలల ముందు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మొత్తం 1,720 మంది పోటీ చెయ్యగా, వారిలో 1056 మంది ధరావతులు (డిపాజిట్లు) కోల్పోయారు. [1]
ఫలితాలు[మార్చు]
రాష్ట్రంలో 294 శాసనసభ నియోజకవర్గాలుండగా, వాటిలో 39 ని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు, 15 నియోజక వర్గాలను షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకూ రిజర్వు చేసారు.
శాసనసభ నియోజకవర్గాలు, విజేతల జాబితా [1][మార్చు]
s.No | పార్టీ | జెండా | పోటీ చేసిన సీట్లు | గెలుచుకున్న సీట్లు | సీట్లులో మార్పు | ఓట్ల వాటా | స్వింగ్ |
---|---|---|---|---|---|---|---|
1 | తెలుగుదేశం పార్టీ | 289 | 201 | 201 | 46.30% | 46.30% | |
2 | భారత జాతీయ కాంగ్రెస్ | 294 | 60 | 115 | 33.64% | 5.67% | |
3 | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 28 | 5 | 3 | 2.01% | 0.70% | |
4 | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 48 | 6 | 3 | 2.79% | 0.30% | |
5 | భారతీయ జనతా పార్టీ | 81 | 3 | 3 | 2.76% | 2.76% | |
6 | జనతా పార్టీ | 44 | 1 | 59 | 0.96% | 27.89% | |
7 | ఇతరులు | 1100 | 20 | 5 | 5.00% | 4.20% |
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "స్టాటిస్టికల్ రిపోర్ట్" (PDF). CEO, Telangana (ELECTION COMMISSION OF INDIA). Archived from the original (PDF) on 2022-12-15. Retrieved 2022-12-15.